ప్రధాని నరేంద్ర మోదీ 17వ భారత్-ఆసియాన్ సదస్సులో పాల్గొననున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా దృష్ట్యా కార్యక్రమాన్ని వర్చ్యువల్ పద్ధతిలో నిర్వహించనున్నారు. కొవిడ్-19 కారణంగా దెబ్బతిన్న ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టే దిశగా చర్చలు జరపనున్నారు. దీంతో పాటు వాణిజ్యం, తీరప్రాంతాలు, విద్య, ఉపాధి తదితర అంశాలపై చర్చించనున్నారు.
"భారత్-ఆసియాన్ సంబంధాలను బలోపేతం చేసే దిశగా దేశాధినేతలు చర్చలు జరపనున్నారు. భారత్-ఆసియాన్ (2021-2025) కార్యచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీతోపాటు, సభ్యత్వ దేశాల భౌగోళిక,చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా కార్యక్రమాలు చేపట్టనున్నారు."
-- భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.
దక్షిణ చైనా సముద్రం, సరిహద్దు వివాదాలు,తదితర అంశాల్లో చైనా వ్యవహరిస్తున్న తీరు దృష్ట్యా ఈ సమావేశం కీలకం కానుంది.
సభ్యత్వ దేశాలివే
మొత్తం 10దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా. భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు పార్ట్నర్ దేశాలుగా ఉన్నాయి.