ETV Bharat / bharat

నేడు అసోంలో పర్యటించనున్న ప్రధాని మోదీ

సీఏఏ, ఎన్​ఆర్​సీలపై తీవ్రస్థాయిలో ఆందోళన చెలరేగిన అసోంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు పర్యటించనున్నారు. కోక్రాజర్​లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. బోడో శాంతి ఒప్పందం విజయోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు.

author img

By

Published : Feb 7, 2020, 5:36 AM IST

Updated : Feb 29, 2020, 11:48 AM IST

modi in assam
అస్సాంలో ప్రధాని మోడీ పర్యటన
నేడు అసోంలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు అసోంలో పర్యటించనున్నారు. కోక్రాజర్​లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్నారు.​ బోడోలతో శాంతి ఒప్పందం చేసుకున్న సందర్భంగా జరిగే వేడుకలకు హాజరుకానున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమైన అనంతరం అసోంలో మోదీ తొలిసారి పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.

"రేపు అసోం వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాను. కోక్రాజర్​ బహిరంగ సభలో ప్రసంగిస్తాను. దశాబ్దాల నుంచి వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభించే బోడో ఒప్పంద విజయాన్ని నిర్వహించుకుంటాం. అభివృద్ధి, శాంతి స్థాపన దిశగా ఇది నూతన అధ్యాయం లిఖిస్తుంది."-నరేంద్ర మోదీ ట్వీట్

అసోంలో బోడో ఉద్యమం ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో శాంతి స్థాపన కోసం జనవరి 27న నేషనల్​ డెమొక్రాటిక్ ఫ్రంట్​ ఆఫ్​ బోడోలాండ్​ (ఎన్​డీఎఫ్​బీ), బోడో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఒప్పందం అనంతరం ఎన్​డీఎఫ్​బీకి చెందిన 1615 మంది ఉద్యమకారులు తమ ఆయుధాలతో సహా ప్రభుత్వానికి లొంగిపోయారు. ఈ విజయంపై ఏర్పాటుచేసిన వేడుకల్లోనే ప్రధాని పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అసోం సంస్కృతిని ప్రతిబింబించేలా సభలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బాంబుల కలకలం

ప్రధాని పర్యటన నేపథ్యంలో గువాహటిలో బాంబుల కలకలం రేగింది. నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఏడు ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాన్​ఖైతీలో ఐదు, పాన్​బజార్, పల్టాన్ బజార్​ ప్రాంతంలో ఒక్కొక్కటి చొప్పున ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనల్లో ఓ అనుమానితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడిని యూఎల్​ఎఫ్​ఏ(ఐ) కేడర్ సభ్యుడుగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే మోదీ పర్యటన లక్ష్యంగానే ఈ బాంబులు పెట్టారా అన్న విషయమై స్పష్టత లేదని చెప్పారు. బాంబుల కలకలం నేపథ్యంలో రాజధాని గువాహటిలో ప్రధాని ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనబోరని స్పష్టం చేశారు అధికారులు.

ఇదీ చూడండి : బారాత్​లో 'లగే రహో కేజ్రీవాల్' గీతానికి చిందులు

నేడు అసోంలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు అసోంలో పర్యటించనున్నారు. కోక్రాజర్​లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్నారు.​ బోడోలతో శాంతి ఒప్పందం చేసుకున్న సందర్భంగా జరిగే వేడుకలకు హాజరుకానున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమైన అనంతరం అసోంలో మోదీ తొలిసారి పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది.

"రేపు అసోం వెళ్లేందుకు ఎదురుచూస్తున్నాను. కోక్రాజర్​ బహిరంగ సభలో ప్రసంగిస్తాను. దశాబ్దాల నుంచి వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభించే బోడో ఒప్పంద విజయాన్ని నిర్వహించుకుంటాం. అభివృద్ధి, శాంతి స్థాపన దిశగా ఇది నూతన అధ్యాయం లిఖిస్తుంది."-నరేంద్ర మోదీ ట్వీట్

అసోంలో బోడో ఉద్యమం ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో శాంతి స్థాపన కోసం జనవరి 27న నేషనల్​ డెమొక్రాటిక్ ఫ్రంట్​ ఆఫ్​ బోడోలాండ్​ (ఎన్​డీఎఫ్​బీ), బోడో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఒప్పందం అనంతరం ఎన్​డీఎఫ్​బీకి చెందిన 1615 మంది ఉద్యమకారులు తమ ఆయుధాలతో సహా ప్రభుత్వానికి లొంగిపోయారు. ఈ విజయంపై ఏర్పాటుచేసిన వేడుకల్లోనే ప్రధాని పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో అసోం సంస్కృతిని ప్రతిబింబించేలా సభలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బాంబుల కలకలం

ప్రధాని పర్యటన నేపథ్యంలో గువాహటిలో బాంబుల కలకలం రేగింది. నగరంలోని ఆయా ప్రాంతాల్లో ఏడు ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పాన్​ఖైతీలో ఐదు, పాన్​బజార్, పల్టాన్ బజార్​ ప్రాంతంలో ఒక్కొక్కటి చొప్పున ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనల్లో ఓ అనుమానితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడిని యూఎల్​ఎఫ్​ఏ(ఐ) కేడర్ సభ్యుడుగా పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే మోదీ పర్యటన లక్ష్యంగానే ఈ బాంబులు పెట్టారా అన్న విషయమై స్పష్టత లేదని చెప్పారు. బాంబుల కలకలం నేపథ్యంలో రాజధాని గువాహటిలో ప్రధాని ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనబోరని స్పష్టం చేశారు అధికారులు.

ఇదీ చూడండి : బారాత్​లో 'లగే రహో కేజ్రీవాల్' గీతానికి చిందులు

Intro:New Delhi: A day before Prime Minister Narendra Modi's scheduled visit to Assam to address a mammoth gathering commemorating the historic Bodo Accord, Senior Communist Party of India (CPI) leader Atul Anjan on Thursday said that the accord is nothing but only a tactic by the government to divert attention from other issues.


Body:"No peace will come. This is a ploy being played by Prime Minister Narendra Modi. Did NRC in Assam brought peace? Lakhs of people have been left out from NRC list. Many of them are from Muslim community and the maximum number are from the Hindu community...Where is the peace," asks Anjan.

He said ministers in the state government in Assam have come under attack by students bodies.

"The office of Asom Gana Parishad (AGP), an ally in the BJP governmnet has been burnt by AASU actisvsts. But when is peace...the situation reminds me the 70's agitation in Assam after which an Accord was signed by the then Prime Minister Rajeev Gandhi with AASU. Did it bring peace?" said Anjan.

It may be mentioned here that Prime Minister Modi will address a mammoth gathering in Assam's Kokrajhar district on Friday commemorating the signing of the Bodo Accord.

The Accord was signed on January 27 in New Delhi between central government, Assam government, All Bodo Students Union (ABSU) and four Bodo rebel groups.


Conclusion:The senior CPI leader also asked Prime Minister Narendra Modi to disclose what is there in the Accord with Naga organisation, National Socialist Council of Nagaland NSCN (IM).

"The government is in talks with NSCN (IM) for a long time...Why there was no accord signing agreement took place with them," said Anjan while raising questions on the implementation of the Naga Accord.

end.
Last Updated : Feb 29, 2020, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.