ETV Bharat / bharat

కరోనా కట్టడికి కలిసి నడుద్దాం: దక్షిణ కొరియాతో మోదీ ​

author img

By

Published : Apr 10, 2020, 5:46 AM IST

కరోనాను అరికట్టేందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడితో ఫోన్​లో సంభాషించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాలు పరస్పర సహకారంతో సాంకేతికతను వినియోగించి వైరస్​ను తుదముట్టించాలని ఆకాంక్షించారు.

PM Modi, S Korean president discuss ways to tackle COVID-19 pandemic
కరోనా కట్టడికి కలసి నడుద్దాం: దక్షిణ కొరియాతో మోదీ ​

ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 15 లక్షలమందికి పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు. ఈ వైరస్​ను నియంత్రించేందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్​ జే ఇన్​తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​​ ద్వారా చర్చించారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో సాంకేతికతను వినియోగించి వైరస్​ను అంతమొందించాలని ఆకాంక్షించారు.

వైరస్​కు వ్యతిరేకంగా పోరాడేందుకు భారతీయ కంపెనీలు అందిస్తోన్న వైద్య పరికరాల సరఫరా, రవాణాను సులభతరం చేసినందుకు దక్షిణ కొరియా ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

కరోనాపై పోరులో దేశమంతా ఎకతాటిపైకి వచ్చేలా ప్రజలను ప్రోత్సహించిన భారతీయ అధికారుల పనితీరును మూన్​ జే ప్రశంసించారు. ఇరుదేశాలకు చెందిన నిపుణులు కలిసి చర్చించి అనుభవాలను పంచుకుంటారని పేర్కొన్నారు. భారత్​లో కొరియా పౌరులకు అందిస్తోన్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది కొరియా పర్యటనను మోదీ గుర్తు చేసుకుంటూ.. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల మెరుగుదలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 15 లక్షలమందికి పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు. ఈ వైరస్​ను నియంత్రించేందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్​ జే ఇన్​తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​​ ద్వారా చర్చించారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో సాంకేతికతను వినియోగించి వైరస్​ను అంతమొందించాలని ఆకాంక్షించారు.

వైరస్​కు వ్యతిరేకంగా పోరాడేందుకు భారతీయ కంపెనీలు అందిస్తోన్న వైద్య పరికరాల సరఫరా, రవాణాను సులభతరం చేసినందుకు దక్షిణ కొరియా ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

కరోనాపై పోరులో దేశమంతా ఎకతాటిపైకి వచ్చేలా ప్రజలను ప్రోత్సహించిన భారతీయ అధికారుల పనితీరును మూన్​ జే ప్రశంసించారు. ఇరుదేశాలకు చెందిన నిపుణులు కలిసి చర్చించి అనుభవాలను పంచుకుంటారని పేర్కొన్నారు. భారత్​లో కొరియా పౌరులకు అందిస్తోన్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది కొరియా పర్యటనను మోదీ గుర్తు చేసుకుంటూ.. ఇరు దేశాల మధ్య సత్సంబంధాల మెరుగుదలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.