అమెరికా న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ద్వైపాక్షిక సహకారం, ఇరు దేశాల్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.
తెహ్రాన్ అణుకార్యకలాపాలపై అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రౌహానీతో మోదీ సమావేశం అవడం ఆసక్తికర అంశం. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై ఇరాన్ దాడులు చేయిస్తోందని అగ్రరాజ్యంతో పాటు దాని మిత్ర దేశాలు ఆరోపిస్తున్నాయి.