ETV Bharat / bharat

భారత టీకాల గురించి మెర్కెల్​కు వివరించిన మోదీ - మోదీ న్యూస్ టుడే

భారత్​లో కరోనా టీకాల అభివృద్ధి గురించి జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​కు వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి ఆమె చేసిన కృషిని ప్రశంసించారు. వీడియో-టెలికాన్ఫరెన్స్​ సమావేశంలో ఇరు దేశాధినేతలు పాల్గొన్నారు.

PM, Merkel hold video-teleconference; Modi briefs on vaccine development
భారత టీకాల గురించి మెర్కెల్​కు వివరించిన మోదీ
author img

By

Published : Jan 6, 2021, 9:35 PM IST

Updated : Jan 6, 2021, 10:41 PM IST

జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​తో వీడియో టెలికాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్​లో కరోనా టీకాల అభివృద్ధి గురించి ఆమెకు వివరించారు. ప్రపంచ దేశాల ప్రయోజనాల కోసం భారత్ తన శక్తి సామర్థ్యాలన్నింటినీ వినియోగించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

జర్మనీ సహా ఐరోపా దేశాల్లో కరోనా కొత్త రకం స్ట్రెయిన్​ను విజయవంతంగా కట్టడి చేసినందుకు మెర్కెల్​కు అభినందనలు తెలిపారు మోదీ. భారత్-జర్మనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆమె చేసిన కృషిని కొనియాడారు.

ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్​(ఐఎస్​ఏ)లో చేరాలని జర్మనీ తీసుకన్న నిర్ణయాన్ని మోదీ స్వాగతించారు. జర్మనీ-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తైంది. వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొని 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా రెండు దేశాలు ప్రభుత్వాల అంతర్గత సంప్రదింపుల 6వ సమావేశాన్ని నిర్వహించేందుకు మోదీ, మెర్కెల్​ అంగీకరించారు. త్వరలోనే తేదీలను ఖరారు చేయనున్నారు.

ఇదీ చూడండి: సరిహద్దులో 400 మంది ఉగ్రవాదులు!

జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​తో వీడియో టెలికాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్​లో కరోనా టీకాల అభివృద్ధి గురించి ఆమెకు వివరించారు. ప్రపంచ దేశాల ప్రయోజనాల కోసం భారత్ తన శక్తి సామర్థ్యాలన్నింటినీ వినియోగించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

జర్మనీ సహా ఐరోపా దేశాల్లో కరోనా కొత్త రకం స్ట్రెయిన్​ను విజయవంతంగా కట్టడి చేసినందుకు మెర్కెల్​కు అభినందనలు తెలిపారు మోదీ. భారత్-జర్మనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆమె చేసిన కృషిని కొనియాడారు.

ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్​(ఐఎస్​ఏ)లో చేరాలని జర్మనీ తీసుకన్న నిర్ణయాన్ని మోదీ స్వాగతించారు. జర్మనీ-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తైంది. వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొని 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా రెండు దేశాలు ప్రభుత్వాల అంతర్గత సంప్రదింపుల 6వ సమావేశాన్ని నిర్వహించేందుకు మోదీ, మెర్కెల్​ అంగీకరించారు. త్వరలోనే తేదీలను ఖరారు చేయనున్నారు.

ఇదీ చూడండి: సరిహద్దులో 400 మంది ఉగ్రవాదులు!

Last Updated : Jan 6, 2021, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.