ETV Bharat / bharat

దిల్లీ 'పౌర' ఘర్షణలపై రేపు సుప్రీంలో విచారణ

ఈశాన్య దిల్లీలో సీఏఏకు వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. బాధ్యులపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని.. షాహీన్​బాగ్​లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలపైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టులు విచారణ చేపట్టనున్నాయి.

author img

By

Published : Feb 25, 2020, 11:03 PM IST

Updated : Mar 2, 2020, 2:18 PM IST

Pleas relating to Delhi violence reach SC & HC, hearing on Wednesday
దిల్లీ అల్లర్లపై రేపు సుప్రీంలో విచారణ

ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లపై మంగళవారం సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టనుంది.

పౌరసత్వ చట్ట సవరణ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలకు సంబంధించిన ఫిర్యాదులపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసేలా పోలీసులకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజాహత్ హబీబుల్లా, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జస్టిస్ ఎస్.​కె.కౌల్​, జస్టిస్ కె.ఎం.జోసెఫ్​లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్​పై విచారణ చేయనుంది. అలాగే సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్​బాగ్​లో​ నిరసన వ్యక్తం చేసిన మహిళలకు రక్షణ కల్పించాలన్న మరో పిటిషన్​ను కూడా సుప్రీం రేపు విచారించనుంది. దీనిపై కోర్టు నియమించిన మధ్యవర్తులు సీల్డ్​ కవర్లో ఓ నివేదికను దాఖలు చేశారు.

దిల్లీ హైకోర్టులో

ఈశాన్య దిల్లీ అల్లర్లపై మానవహక్కుల కార్యకర్త హక్ష్​ మాండర్, ఫరా నఖ్వీ దాఖలు చేసిన మరో రెండు పిటిషన్లను రేపు దిల్లీ హైకోర్టు విచారించనుంది. హింసకు పాల్పడిన వ్యక్తులపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలని వీరు న్యాయస్థానాన్ని కోరారు. షాహీన్​బాగ్​తో సహా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసిన ఇతర ప్రాంతాల్లోని మహిళలకు కూడా రక్షణ కల్పించాలని వీరు తమ పిటిషన్​లో పేర్కొన్నారు.

ద్వేషపూరిత ప్రసంగాలు!

భాజపా నేతలు అనురాగ్​ ఠాకూర్​, పర్వేష్​ వర్మ, కపిల్ మిశ్రా ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, హింసను ప్రేరేపించారని, వీరిపై చర్య తీసుకోవాలని దిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది.

ఫిబ్రవరి 23న సీఏఏకు వ్యతిరేకంగా జాఫ్రాబాద్​లో శాంతియుత ర్యాలీ జరిగింది. దీనికి వ్యతిరేకంగా 2కి.మీ దూరంలో భాజపా నేత కపిల్ మిశ్రా సీఏఏకు అనుకూలంగా మౌజ్​పుర్​,బాబర్​పుర్​ మెట్రో స్టేషన్ల పక్కన ర్యాలీ నిర్వహించారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ, ఇళ్లు, దుకాణాలు, వాహనాలు తగులబెట్టారు. దిల్లీలోని చాంద్​బాగ్​, భజన్​పురా ప్రాంతాల్లో కూడా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో దిల్లీ హెడ్​ కానిస్టేబుల్ రతన్​లాల్​ సహా ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: భారత్​-అమెరికా: 'సమగ్ర వాణిజ్య ఒప్పందంతో ముందుకు!'

ఈశాన్య దిల్లీలో చెలరేగిన అల్లర్లపై మంగళవారం సుప్రీంకోర్టు, దిల్లీ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టనుంది.

పౌరసత్వ చట్ట సవరణ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఘర్షణలకు సంబంధించిన ఫిర్యాదులపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసేలా పోలీసులకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ వజాహత్ హబీబుల్లా, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

జస్టిస్ ఎస్.​కె.కౌల్​, జస్టిస్ కె.ఎం.జోసెఫ్​లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్​పై విచారణ చేయనుంది. అలాగే సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్​బాగ్​లో​ నిరసన వ్యక్తం చేసిన మహిళలకు రక్షణ కల్పించాలన్న మరో పిటిషన్​ను కూడా సుప్రీం రేపు విచారించనుంది. దీనిపై కోర్టు నియమించిన మధ్యవర్తులు సీల్డ్​ కవర్లో ఓ నివేదికను దాఖలు చేశారు.

దిల్లీ హైకోర్టులో

ఈశాన్య దిల్లీ అల్లర్లపై మానవహక్కుల కార్యకర్త హక్ష్​ మాండర్, ఫరా నఖ్వీ దాఖలు చేసిన మరో రెండు పిటిషన్లను రేపు దిల్లీ హైకోర్టు విచారించనుంది. హింసకు పాల్పడిన వ్యక్తులపై ఎఫ్​ఐఆర్ నమోదు చేసి, అరెస్టు చేయాలని వీరు న్యాయస్థానాన్ని కోరారు. షాహీన్​బాగ్​తో సహా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసిన ఇతర ప్రాంతాల్లోని మహిళలకు కూడా రక్షణ కల్పించాలని వీరు తమ పిటిషన్​లో పేర్కొన్నారు.

ద్వేషపూరిత ప్రసంగాలు!

భాజపా నేతలు అనురాగ్​ ఠాకూర్​, పర్వేష్​ వర్మ, కపిల్ మిశ్రా ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని, హింసను ప్రేరేపించారని, వీరిపై చర్య తీసుకోవాలని దిల్లీ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది.

ఫిబ్రవరి 23న సీఏఏకు వ్యతిరేకంగా జాఫ్రాబాద్​లో శాంతియుత ర్యాలీ జరిగింది. దీనికి వ్యతిరేకంగా 2కి.మీ దూరంలో భాజపా నేత కపిల్ మిశ్రా సీఏఏకు అనుకూలంగా మౌజ్​పుర్​,బాబర్​పుర్​ మెట్రో స్టేషన్ల పక్కన ర్యాలీ నిర్వహించారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ, ఇళ్లు, దుకాణాలు, వాహనాలు తగులబెట్టారు. దిల్లీలోని చాంద్​బాగ్​, భజన్​పురా ప్రాంతాల్లో కూడా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో దిల్లీ హెడ్​ కానిస్టేబుల్ రతన్​లాల్​ సహా ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: భారత్​-అమెరికా: 'సమగ్ర వాణిజ్య ఒప్పందంతో ముందుకు!'

Last Updated : Mar 2, 2020, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.