ETV Bharat / bharat

'అయ్యిందేదో అయింది?'పై వెనక్కి తగ్గిన పిట్రోడా

సిక్కుల ఊచకోతపై అంశంలో తన వ్యాఖ్యలకు వివరణనిచ్చారు కాంగ్రెస్ విదేశీ విభాగం బాధ్యుడు సామ్ పిట్రోడా. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని తెలిపారు. పిట్రోడా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ప్రకటించింది కాంగ్రెస్​ పార్టీ.

author img

By

Published : May 10, 2019, 9:12 PM IST

Updated : May 10, 2019, 10:50 PM IST

'అయ్యిందేదో అయింది?'పై వెనక్కి తగ్గిన పిట్రోడా
'అయ్యిందేదో అయింది?'పై వెనక్కి తగ్గిన పిట్రోడా

1984 సిక్కుల ఊచకోత అంశంలో తన వ్యాఖ్యలపై భాజపా నేతలు, సిక్కుల నుంచి తీవ్ర విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. పిట్రోడా వ్యాఖ్యలు వ్యక్తిగతమని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.

"హిందీ సరిగా రాని కారణంగా సిక్కుల ఊచకోత అంశంపై నా ప్రకటన పూర్తిగా వక్రీకరణకు గురైంది. నేను చెప్పాలనుకున్నదేమిటంటే 'ఏదైతే జరిగిందో... అది తప్పుగా జరిగింది' అనే పదాన్ని నేను నా మనస్సులో అనువదించలేను. మనకు చర్చించేందుకు ఇంకా అనేక అంశాలున్నాయి. భాజపా పాలనపైనా చర్చ జరగాలి. నా వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నా."-సామ్ పిట్రోడా

సిక్కుల ఊచకోతపై జస్టిస్ నానావతి కమిషన్ నివేదిక ప్రకారం.. అల్లర్లపై అప్పటి ప్రధాని కార్యాలయం నుంచే ఆదేశాలు వెళ్లాయని భాజపా గురువారం ఆరోపించింది. ఈ ఆరోపణలకు సమాధానమిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు పిట్రోడా.

"1984 గురించి ఇప్పుడెందుకు? అయిదేళ్లలో ఏం చేశారో దాని గురించి మాట్లాడండి. సిక్కుల ఊచకోత ఘటన 1984 లో జరిగింది. అయితే ఏమిటి?" అని వ్యాఖ్యానించారు.

సామ్ పిట్రోడా వ్యాఖ్యలకు భాజపా నిరసన తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసం ముందు ఆందోళన చేసింది.

కాంగ్రెస్ స్పందన

ఏ వ్యక్తికైనా, వర్గానికైనా, ప్రాంతానికి, మతానికి వ్యతిరేకంగా అల్లర్లు చేయడాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించదన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా. సిక్కుల ఊచకోత, 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసుల్లో దోషులకు శిక్ష పడేవరకూ కాంగ్రెస్ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు నేతలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు సుర్జేవాలా.

ఇదీ చూడండి: 'రఫేల్'​ రివ్యూ పిటిషన్లపై నిర్ణయం వాయిదా

'అయ్యిందేదో అయింది?'పై వెనక్కి తగ్గిన పిట్రోడా

1984 సిక్కుల ఊచకోత అంశంలో తన వ్యాఖ్యలపై భాజపా నేతలు, సిక్కుల నుంచి తీవ్ర విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా క్షమాపణలు తెలిపారు. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. పిట్రోడా వ్యాఖ్యలు వ్యక్తిగతమని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.

"హిందీ సరిగా రాని కారణంగా సిక్కుల ఊచకోత అంశంపై నా ప్రకటన పూర్తిగా వక్రీకరణకు గురైంది. నేను చెప్పాలనుకున్నదేమిటంటే 'ఏదైతే జరిగిందో... అది తప్పుగా జరిగింది' అనే పదాన్ని నేను నా మనస్సులో అనువదించలేను. మనకు చర్చించేందుకు ఇంకా అనేక అంశాలున్నాయి. భాజపా పాలనపైనా చర్చ జరగాలి. నా వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నా."-సామ్ పిట్రోడా

సిక్కుల ఊచకోతపై జస్టిస్ నానావతి కమిషన్ నివేదిక ప్రకారం.. అల్లర్లపై అప్పటి ప్రధాని కార్యాలయం నుంచే ఆదేశాలు వెళ్లాయని భాజపా గురువారం ఆరోపించింది. ఈ ఆరోపణలకు సమాధానమిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు పిట్రోడా.

"1984 గురించి ఇప్పుడెందుకు? అయిదేళ్లలో ఏం చేశారో దాని గురించి మాట్లాడండి. సిక్కుల ఊచకోత ఘటన 1984 లో జరిగింది. అయితే ఏమిటి?" అని వ్యాఖ్యానించారు.

సామ్ పిట్రోడా వ్యాఖ్యలకు భాజపా నిరసన తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసం ముందు ఆందోళన చేసింది.

కాంగ్రెస్ స్పందన

ఏ వ్యక్తికైనా, వర్గానికైనా, ప్రాంతానికి, మతానికి వ్యతిరేకంగా అల్లర్లు చేయడాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించదన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా. సిక్కుల ఊచకోత, 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసుల్లో దోషులకు శిక్ష పడేవరకూ కాంగ్రెస్ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు నేతలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు సుర్జేవాలా.

ఇదీ చూడండి: 'రఫేల్'​ రివ్యూ పిటిషన్లపై నిర్ణయం వాయిదా

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Washington - 10 May 2019
1. Black SUV's carrying Chinese trade delegation leaving hotel with police escort
2. US Treasury Secretary Steve Mnuchin and US Trade Representative (USTR) Robert Lighthizer waiting on the steps of the office of the USTR
3. SUV's arriving at the office of USTR
4. Mnuchin and Lighthizer greeting Liu He, Vice Premier of the People's Republic of China outside the office of the USTR, they all walk inside
STORYLINE:
Trade talks between China and the U.S. continued Friday in Washington despite new tariffs the U.S. imposed on $200 billion in Chinese imports and Beijing's vow to retaliate.
Negotiators are trying to resolve the standoff after the United States raised tariffs on Chinese imports, escalating tensions between the world's two biggest economies and rattling stock markets around the world.
Earlier this week, top U.S. trade negotiator Robert Lighthizer and Treasury Secretary Steven Mnuchin accused the Chinese of reneging on commitments they'd made earlier, throwing the trade talks into disarray.
A Chinese Foreign Ministry spokesman said Beijing is hoping the Trump administration will meet China "halfway" in the dispute over trade.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 10, 2019, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.