ETV Bharat / bharat

రాత్రికిరాత్రే ఒరిగిపోయిన నాలుగు అంతస్తుల భవనం!

author img

By

Published : Feb 6, 2020, 6:40 PM IST

Updated : Feb 29, 2020, 10:37 AM IST

ప్రపంచ వింతల్లో ఒకటైన పిసా టవర్​ను ఎప్పుడైనా చూశారా? అత్యంత ఎత్తయిన భవనం ఓవైపు వంగిపోయినప్పటికీ.. కిందపడకుండా భలే ఉంటుంది కదూ! అచ్చం అలాంటి దృశ్యమే కర్ణాటక రాష్ట్రంలో దర్శనమిస్తోంది. కానీ, ఆహ్లాదాన్ని పంచడంలేదు.. ఆందోళనకు గురిచేస్తోంది. బెంగళూరులోని ఓ కాలనీలో నిటారుగా ఉన్ననాలుగు అంతస్తుల భవనం రాత్రికిరాత్రే ఓ పక్కకు ఒరిగిపోయింది. ఫలితంగా స్థానికులంతా హడలిపోయారు. ఇంతకీ కారణమేమిటో తెలుసా...?

Bengaluru: panic as four-storey building tilts
రాత్రికిరాత్రే ఒరిగిపోయిన నాలుగు అంతస్తుల భవనం!
రాత్రికిరాత్రే ఒరిగిపోయిన నాలుగు అంతస్తుల భవనం!

బెంగళూరు కెంపపురలో నాలుగు అంతస్తుల భవనం ఓవైపునకు ఒరిగిపోయి పిసా టవర్​ను తలపిస్తోంది. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పునాది వేయడానికి తవ్వకాలు ప్రారంభించిన సమయంలో భవనం ఇలా ఓ వైపునకు కుంగిపోవడం అపార్ట్​మెంట్​ ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

36 మంది సేఫ్​

అపార్ట్​మెంట్​లో ప్రస్తుతం 36 మంది నివసిస్తున్నారు. అదృష్టవశాత్తు ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ, రోడ్డుపై పడిపోతున్నట్లుగా వంగిపోయిన భవనం ఏ క్షణాన తమపై పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్త్తున్నారు కాలనీవాసులు. తీవ్ర భయాందోళనలకు గురైన చాలా మంది తమ ఇళ్లను వదిలి ఒరిగిపోయిన భవనానికి దూరంగా వెళ్లిపోయారు.

కారణం తెలిశాకే చర్యలు...

అయితే వంగిపోయిన భవనం చట్టవిరుద్ధంగా నిర్మించిన దాఖలాలేవీ లేవని బృహత్​ బెంగళూరు మహానగర పాలక (బీబీఎంపీ) సంస్థ అధికారులు వెల్లడించారు. సాంకేతిక నిపుణులు పరిస్థితిని అంచనా వేస్తున్నారని.. వారి సూచనల మేరకు తరుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీ స్థలంలో తవ్వకాలు తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇంటి పునాది స్థంభాన్ని జేసీబీ ఢీకొందని.. అందుకే ఈ ప్రమాదం జరిగిందని భవన యజమాని సురేశ్​ చంద్ర జైన్​వాపోయారు. కనీస సమాచారం ఇవ్వకుండా తవ్వకాలు ఎలా ప్రారంభిస్తారని మండిపడ్డ ఆయన.. ఖాళీ స్థలం యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

ఇదీ చదవండి:మద్యం ఊరికే రాదు... మరి ఇలా కుళాయిల్లో వస్తే.!

రాత్రికిరాత్రే ఒరిగిపోయిన నాలుగు అంతస్తుల భవనం!

బెంగళూరు కెంపపురలో నాలుగు అంతస్తుల భవనం ఓవైపునకు ఒరిగిపోయి పిసా టవర్​ను తలపిస్తోంది. పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పునాది వేయడానికి తవ్వకాలు ప్రారంభించిన సమయంలో భవనం ఇలా ఓ వైపునకు కుంగిపోవడం అపార్ట్​మెంట్​ ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

36 మంది సేఫ్​

అపార్ట్​మెంట్​లో ప్రస్తుతం 36 మంది నివసిస్తున్నారు. అదృష్టవశాత్తు ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ, రోడ్డుపై పడిపోతున్నట్లుగా వంగిపోయిన భవనం ఏ క్షణాన తమపై పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్త్తున్నారు కాలనీవాసులు. తీవ్ర భయాందోళనలకు గురైన చాలా మంది తమ ఇళ్లను వదిలి ఒరిగిపోయిన భవనానికి దూరంగా వెళ్లిపోయారు.

కారణం తెలిశాకే చర్యలు...

అయితే వంగిపోయిన భవనం చట్టవిరుద్ధంగా నిర్మించిన దాఖలాలేవీ లేవని బృహత్​ బెంగళూరు మహానగర పాలక (బీబీఎంపీ) సంస్థ అధికారులు వెల్లడించారు. సాంకేతిక నిపుణులు పరిస్థితిని అంచనా వేస్తున్నారని.. వారి సూచనల మేరకు తరుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఖాళీ స్థలంలో తవ్వకాలు తాత్కాలికంగా నిలిపివేశారు.

ఇంటి పునాది స్థంభాన్ని జేసీబీ ఢీకొందని.. అందుకే ఈ ప్రమాదం జరిగిందని భవన యజమాని సురేశ్​ చంద్ర జైన్​వాపోయారు. కనీస సమాచారం ఇవ్వకుండా తవ్వకాలు ఎలా ప్రారంభిస్తారని మండిపడ్డ ఆయన.. ఖాళీ స్థలం యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

ఇదీ చదవండి:మద్యం ఊరికే రాదు... మరి ఇలా కుళాయిల్లో వస్తే.!

Intro:Body:

https://www.aninews.in/news/national/general-news/it-dept-recovers-rs-65-crore-from-tamil-actor-vijays-financer20200206145522/


Conclusion:
Last Updated : Feb 29, 2020, 10:37 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.