సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది పాక్. ఈరోజు ఉదయం జమ్ముకశ్మీర్ పూంఛ్ జిల్లాలో సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం. మాన్కోట్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి మోర్టార్లను ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. పాక్ సైన్యం కాల్పులకు దీటుగా స్పందించింది భారత సైన్యం.
ఈ ఏడాదిలో పాక్ మొత్తం 2,720 సార్లు కాల్పుల విరమణను అతిక్రమించింది. ఈ ఘటనల్లో మొత్తం 21 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో 94 మంది గాయపడ్డారు.
ఇదీ చదవండి: 'ఆ ప్రాంతం నుంచి చైనా వెనక్కి మళ్లాల్సిందే!'