ETV Bharat / bharat

పాక్ కాల్పుల్లో ముగ్గురు మృతి.. ఒకరికి గాయాలు

author img

By

Published : Apr 13, 2020, 3:40 AM IST

Updated : Apr 13, 2020, 10:33 AM IST

సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచింది పాకిస్థాన్​. అయితే దాయాది కాల్పులకు దీటుగా బదులిచ్చారు భారత జవాన్లు. ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. పాక్​ సిబ్బంది చేసిన మరో దాడిలో ఓ జాలరికి గాయాలయ్యాయి.

Pakistan on Sunday violated ceasefire along the Line of Control (LoC) in Jammu and Kashmir's keran sector
సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్‌ 'తూట్లు'

కరోనా విజృంభిస్తున్న క్లిష్ట సమయంలోనూ పాకిస్థాన్​ కపట బుద్ధి ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్​ కేరన్​ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వద్ద.. ఆ దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత్​లోని గ్రామాల్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడింది. పొరుగు దేశం దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాక్​ సేనలకు భారత సైన్యం దీటైన జవాబిచ్చింది.

సముద్ర జలాల్లోనూ..

అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ ప్రాదేశిక జలాల సరిహద్దు(ఐఎమ్​బీఎల్​) వద్ద పాకిస్థాన్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో.. భారత జాలరి ఒకరు గాయపడ్డారు. గుజరాత్‌లోని ఓఖా తీరప్రాంతంలో ఆదివారం రెండు పడవలు.. ఐఎమ్​బీఎల్​ సమీపంలోకి వెళ్లగా పాక్ సిబ్బంది ఎటువంటి హెచ్చరిక చేయకుండానే కాల్పులకు తెగబడినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా జాలరులను పాక్​ అధికారులు అదుపులోనికి తీసుకోగా.. భారత కోస్ట్​గార్డులు వారిని విడిపించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా తీవ్రత అంతగా లేని ప్రాంతాల్లో నిబంధనలను సడలించింది గుజరాత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లారు.

మిలిటెంట్ల దాడి..

జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో ఆదివారం మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ మాజీ ఆర్మీజవానుకు గాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

కరోనా విజృంభిస్తున్న క్లిష్ట సమయంలోనూ పాకిస్థాన్​ కపట బుద్ధి ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్​ కేరన్​ సెక్టార్​లోని నియంత్రణ రేఖ వద్ద.. ఆ దేశ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత్​లోని గ్రామాల్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడింది. పొరుగు దేశం దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాక్​ సేనలకు భారత సైన్యం దీటైన జవాబిచ్చింది.

సముద్ర జలాల్లోనూ..

అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ ప్రాదేశిక జలాల సరిహద్దు(ఐఎమ్​బీఎల్​) వద్ద పాకిస్థాన్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో.. భారత జాలరి ఒకరు గాయపడ్డారు. గుజరాత్‌లోని ఓఖా తీరప్రాంతంలో ఆదివారం రెండు పడవలు.. ఐఎమ్​బీఎల్​ సమీపంలోకి వెళ్లగా పాక్ సిబ్బంది ఎటువంటి హెచ్చరిక చేయకుండానే కాల్పులకు తెగబడినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా జాలరులను పాక్​ అధికారులు అదుపులోనికి తీసుకోగా.. భారత కోస్ట్​గార్డులు వారిని విడిపించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండగా తీవ్రత అంతగా లేని ప్రాంతాల్లో నిబంధనలను సడలించింది గుజరాత్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లారు.

మిలిటెంట్ల దాడి..

జమ్ముకశ్మీర్​లోని కుల్గాం జిల్లాలో ఆదివారం మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ మాజీ ఆర్మీజవానుకు గాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Apr 13, 2020, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.