ETV Bharat / bharat

2020లో 'పద్మ' అవార్డులు వరించింది వీరినే

author img

By

Published : Jan 26, 2020, 5:27 AM IST

Updated : Feb 18, 2020, 10:43 AM IST

2020వ ఏడాదికిగానూ పద్మ అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రమాజీ మంత్రులు సుష్మా స్వరాజ్‌, అరుణ‌్‌జైట్లీ, జార్జ్‌ఫెర్నాండేజ్‌కు మరణానంతరం పద్మవిభూషణ్ ఇస్తున్నట్లు తెలిపిన కేంద్రం.. తెలుగుతేజం పీవీ సింధుకు పద్మభూషణ్‌ సహా.. ఐదుగురు తెలుగువారికి పద్మపురస్కారాలు ప్రదానం చేయనుంది. వివిధ రంగాల్లో.. తమ విలువైన సేవలు అందిస్తున్న 21 మంది సామాన్యులు ఈ ఏడాది పద్మశ్రీ అందుకోనున్నారు.

Padma Awards winners list
2020లో 'పద్మ' అవార్డులు వరించింది వీరినే

దేశంలో వివిధరంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు.... కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2020వ ఏడాదికిగానూ ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులను అందించనుంది. కేంద్ర మాజీ మంత్రులు జార్జ్ ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్​కు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ , కళారంగంలో యూపీకి చెందిన చన్నౌలాల్ మిశ్రా, కర్ణాటకలో ఉడిపి మఠానికి చెందిన దివంగత ఆధ్యాత్మికవేత్త విశ్వేషతీర్థ స్వామీజీ, మారిషస్​కు చెందిన అనిరుద్ జుగ్నౌత్​కు పద్మవిభూషణ్ ప్రకటించారు.

'పద్మ' వరించిన మరికొందరు వీరే..

తెలుగు తేజం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు.. పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేయనుంది కేంద్రం. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, టీవీఎస్​ మోటార్స్ అధినేత వేణు శ్రీనివాసన్​, గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్​కు పద్మ విభూషణ్​ ప్రకటించారు.

మాజీ క్రికెటర్‌ జహీర్‌ఖాన్‌, ప్రస్తుత భారత హాకీ జాతీయ మహిళాజట్టు సారథి రాణిరాంపాల్‌, షూటర్ జీతూరాయ్‌తో పాటు ఆరుగురు క్రీడాకారులకు పద్మశ్రీ ఇవ్వనున్నారు. సినీరంగంలో కరణ్‌జోహార్‌, ఏక్తాకపూర్‌, కంగనారనౌత్‌తో పాటు ఆరుగురిని పద్మశ్రీ వరించింది. ఆంధ్రప్రదేశ్​కు చెందిన యడ్ల గోపాల్ రావు, దళవాయి చలపతిరావు, తెలంగాణ నుంచి విజయ సారథి శ్రీభాష్యం, చింతల వెంకటరెడ్డిలకు పద్మశ్రీ అందించనున్నారు. మొత్తం 118 మందికి పద్మశ్రీ ప్రకటించగా అందులో 21 మంది సామాన్యులున్నారు. ఆయా రంగాల్లో చేసిన సామాజిక సేవకు గాను వీరందరినీ పద్మశ్రీ వరించింది.

25వేల గుర్తుతెలియని శవాలకు అంత్యక్రియలు జరిపిన ఫైజాబాద్‌కి చెందిన మొహమ్మద్‌ షరీఫ్‌తో పాటు చండీగడ్‌లో ఆస్పత్రి దగ్గర ఉండే రోగుల బంధువులకు భోజనం పెట్టే జగదీశ్‌లాల్ అహుజూ వంటి వారు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. పద్మపురస్కారాలు అందుకోనున్న వారిలో.. 34 మంది మహిళలున్నారు. 18 మంది విదేశీయులు కూడా ఉన్నారు.

దేశంలో వివిధరంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు.... కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. 2020వ ఏడాదికిగానూ ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులను అందించనుంది. కేంద్ర మాజీ మంత్రులు జార్జ్ ఫెర్నాండెజ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్​కు మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది. బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ , కళారంగంలో యూపీకి చెందిన చన్నౌలాల్ మిశ్రా, కర్ణాటకలో ఉడిపి మఠానికి చెందిన దివంగత ఆధ్యాత్మికవేత్త విశ్వేషతీర్థ స్వామీజీ, మారిషస్​కు చెందిన అనిరుద్ జుగ్నౌత్​కు పద్మవిభూషణ్ ప్రకటించారు.

'పద్మ' వరించిన మరికొందరు వీరే..

తెలుగు తేజం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు.. పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేయనుంది కేంద్రం. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, టీవీఎస్​ మోటార్స్ అధినేత వేణు శ్రీనివాసన్​, గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్​కు పద్మ విభూషణ్​ ప్రకటించారు.

మాజీ క్రికెటర్‌ జహీర్‌ఖాన్‌, ప్రస్తుత భారత హాకీ జాతీయ మహిళాజట్టు సారథి రాణిరాంపాల్‌, షూటర్ జీతూరాయ్‌తో పాటు ఆరుగురు క్రీడాకారులకు పద్మశ్రీ ఇవ్వనున్నారు. సినీరంగంలో కరణ్‌జోహార్‌, ఏక్తాకపూర్‌, కంగనారనౌత్‌తో పాటు ఆరుగురిని పద్మశ్రీ వరించింది. ఆంధ్రప్రదేశ్​కు చెందిన యడ్ల గోపాల్ రావు, దళవాయి చలపతిరావు, తెలంగాణ నుంచి విజయ సారథి శ్రీభాష్యం, చింతల వెంకటరెడ్డిలకు పద్మశ్రీ అందించనున్నారు. మొత్తం 118 మందికి పద్మశ్రీ ప్రకటించగా అందులో 21 మంది సామాన్యులున్నారు. ఆయా రంగాల్లో చేసిన సామాజిక సేవకు గాను వీరందరినీ పద్మశ్రీ వరించింది.

25వేల గుర్తుతెలియని శవాలకు అంత్యక్రియలు జరిపిన ఫైజాబాద్‌కి చెందిన మొహమ్మద్‌ షరీఫ్‌తో పాటు చండీగడ్‌లో ఆస్పత్రి దగ్గర ఉండే రోగుల బంధువులకు భోజనం పెట్టే జగదీశ్‌లాల్ అహుజూ వంటి వారు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. పద్మపురస్కారాలు అందుకోనున్న వారిలో.. 34 మంది మహిళలున్నారు. 18 మంది విదేశీయులు కూడా ఉన్నారు.

AP Video Delivery Log - 2100 GMT News
Saturday, 25 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2057: Russia Elephants Must credit content creator 4250838
Elephants on loose in Russia after circus escape
AP-APTN-2011: MEast US Peace Plan AP Clients Only 4251181
Rival Israeli leaders to meet Trump on peace plan
AP-APTN-1940: US Impeach Democrats No Access USA 4251180
Dems: Trump's lawyers made case for witnesses
AP-APTN-1932: US Impeach Philbin Cross Examination AP Clients Only 4251179
Trump lawyers: Cross-examination crucial for truth
AP-APTN-1926: Lebanon Protest 2 AP Clients Only 4251178
Tear gas, water cannon at Beirut protest
AP-APTN-1906: Iraq US Army AP Clients Only 4251171
US Army: Operations against IS "currently paused"
AP-APTN-1905: France China Virus AP Clients Only 4251176
Health Ministry: 3 French patients doing well
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 18, 2020, 10:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.