ETV Bharat / bharat

పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు-25 కేజీల బంగారం దోపిడీ - gold robbery in punjab ludhiyana

పంజాబ్​లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే భారీ దోపిడీకి పాల్పడ్డారు. లూధియానాలోని గోల్డ్​ లోన్ సంస్థలోకి చొరబడి 25 కిలోలకు పైగా బంగారాన్ని దోచుకెళ్లారు.

Ludhiana
లూధియానా
author img

By

Published : Feb 17, 2020, 7:52 PM IST

Updated : Mar 1, 2020, 3:44 PM IST

పంజాబ్‌లోని లూధియానాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. భారీ దోపిడీకి పాల్పడ్డారు. సినీ ఫక్కీలో గోల్డ్‌ లోన్‌ సంస్థలోకి చొరబడిన ఐదుగురు దుండగులు 25 కిలోలకు పైగా ఆభరణాలు దోచుకెళ్లారు. సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని గిల్‌ రోడ్డు ప్రాంతంలో ఈ ఉదయం 10.15 గంటల సమయంలో ఇండియా ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌ఎల్‌) శాఖలోకి ఐదుగురు దుండగులు ప్రవేశించారు. చోరీ సమయంలో నలుగురు ముసుగులు ధరించి లోపలికి ప్రవేశించగా.. ఒకడు బయట కారులోనే ఉన్నాడని వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఐఐఎఫ్‌ఎల్‌ భద్రతా సిబ్బంది అక్కడ లేరని తెలిపారు.

దుండగులు సంస్థలోకి ప్రవేశించి సిబ్బందిని భయపెట్టి.. ఆభరణాలు భద్రపరిచిన గది తాళాలు తీసుకున్నారని ఏసీపీ సందీప్‌ వాధేరా చెప్పారు. అనంతరం సిబ్బందిని తాళ్లతో కట్టి దాదాపు 25 నుంచి 30కిలోల మేర బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి ఉడాయించారని వివరించారు. ఇదంతా 20 నిమిషాల్లోనే జరిగిందన్నారు. దుండగులు అక్కడి నుంచి పరారైన వెంటనే ఐఐఎఫ్‌ఎల్‌ సిబ్బంది అలారం మోగించారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ రాకేశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

చోరీకి సంబంధించిన దృశ్యాలు

పంజాబ్‌లోని లూధియానాలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. భారీ దోపిడీకి పాల్పడ్డారు. సినీ ఫక్కీలో గోల్డ్‌ లోన్‌ సంస్థలోకి చొరబడిన ఐదుగురు దుండగులు 25 కిలోలకు పైగా ఆభరణాలు దోచుకెళ్లారు. సోమవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని గిల్‌ రోడ్డు ప్రాంతంలో ఈ ఉదయం 10.15 గంటల సమయంలో ఇండియా ఇన్ఫోలైన్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎఫ్‌ఎల్‌) శాఖలోకి ఐదుగురు దుండగులు ప్రవేశించారు. చోరీ సమయంలో నలుగురు ముసుగులు ధరించి లోపలికి ప్రవేశించగా.. ఒకడు బయట కారులోనే ఉన్నాడని వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఐఐఎఫ్‌ఎల్‌ భద్రతా సిబ్బంది అక్కడ లేరని తెలిపారు.

దుండగులు సంస్థలోకి ప్రవేశించి సిబ్బందిని భయపెట్టి.. ఆభరణాలు భద్రపరిచిన గది తాళాలు తీసుకున్నారని ఏసీపీ సందీప్‌ వాధేరా చెప్పారు. అనంతరం సిబ్బందిని తాళ్లతో కట్టి దాదాపు 25 నుంచి 30కిలోల మేర బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి ఉడాయించారని వివరించారు. ఇదంతా 20 నిమిషాల్లోనే జరిగిందన్నారు. దుండగులు అక్కడి నుంచి పరారైన వెంటనే ఐఐఎఫ్‌ఎల్‌ సిబ్బంది అలారం మోగించారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ రాకేశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

చోరీకి సంబంధించిన దృశ్యాలు
Last Updated : Mar 1, 2020, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.