ETV Bharat / bharat

5 కోట్ల మంది పేదలకు భాజపా ఉచిత భోజనం

author img

By

Published : Mar 25, 2020, 10:27 PM IST

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు దేశం లాక్​డౌన్​లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలు, వలస కార్మికులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది జాతీయ పార్టీ భాజపా. తమ పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు ఐదుగురు పేదలకు భోజనం అందించాలని నిర్ణయించింది.

1 crore party workers to provide meals to five poor persons each during lockdown, says BJP
5 కోట్ల మంది పేదలకు భాజపా ఉచిత భోజనం

21 రోజుల లాక్​డౌన్ సమయంలో పేదలకు అండగా నిలవాలని భాజపా నిర్ణయించింది. ఇందు కోసం తమ కోటి మంది పార్టీ కార్యకర్తలు.. ఒక్కొక్కరు ఐదుగురు పేదలకు చొప్పున భోజనం అందిస్తారని పేర్కొంది. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన పార్టీ బేరర్ల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

"పార్టీ నాయకులు, కార్యకర్తలు... ఒక్కొక్కరు ఐదుగురు పేదలకు భోజనం అందించాలి."

- జె.పి.నడ్డా, భాజపా అధ్యక్షుడు

పేదలకు భోజనం అందించే విషయమై త్వరలోనే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ మీడియా విభాగం హెడ్​ అనిల్​ బలూనీ తెలిపారు.

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశాన్ని లాక్​డౌన్ చేసింది. దీనితో పేదలు, వలస కార్మికులు, రోజువారీ కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్వస్థలాలకు వెళ్లలేక, ఉన్నచోట పని దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు భాజపా ముందుకొచ్చింది.

ఇదీ చూడండి: రష్యా అధ్యక్షుడు పుతిన్​తో ఫోన్​లో మాట్లాడిన మోదీ

21 రోజుల లాక్​డౌన్ సమయంలో పేదలకు అండగా నిలవాలని భాజపా నిర్ణయించింది. ఇందు కోసం తమ కోటి మంది పార్టీ కార్యకర్తలు.. ఒక్కొక్కరు ఐదుగురు పేదలకు చొప్పున భోజనం అందిస్తారని పేర్కొంది. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన పార్టీ బేరర్ల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

"పార్టీ నాయకులు, కార్యకర్తలు... ఒక్కొక్కరు ఐదుగురు పేదలకు భోజనం అందించాలి."

- జె.పి.నడ్డా, భాజపా అధ్యక్షుడు

పేదలకు భోజనం అందించే విషయమై త్వరలోనే ఒక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ మీడియా విభాగం హెడ్​ అనిల్​ బలూనీ తెలిపారు.

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశాన్ని లాక్​డౌన్ చేసింది. దీనితో పేదలు, వలస కార్మికులు, రోజువారీ కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్వస్థలాలకు వెళ్లలేక, ఉన్నచోట పని దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు భాజపా ముందుకొచ్చింది.

ఇదీ చూడండి: రష్యా అధ్యక్షుడు పుతిన్​తో ఫోన్​లో మాట్లాడిన మోదీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.