ETV Bharat / bharat

ఒక్క వ్యక్తి పొరపాటుతో 17 మందికి కరోనా

author img

By

Published : Apr 2, 2020, 12:44 PM IST

కరోనా​.. మనుషుల నుంచి మనుషులకు సంక్రమించే ఈ వైరస్​ మరింత భయానకంగా పరిణమిస్తోంది. సామాజిక దూరమే కరోనా నియంత్రణకు అత్యంత అవసరమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. తాజాగా రాజస్థాన్​లో ఒకే వ్యక్తి ద్వారా మరో 17 మందికి కరోనా వ్యాపించిన ఘటన కలకలం రేపుతోంది.

one corona positive person has infected 17 of his close contacts.
కరోనా- ఒక్కడే మరో 17 మందికి..

రాజస్థాన్​లో కరోనా సోకిన ఓ వ్యక్తి నుంచి మరో 17 మందికి వైరస్​ వ్యాపించింది. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అప్రమత్తమైన అధికారులు.. ఆ బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులందరినీ గుర్తించే పనిలో పడ్డారు.

జైపుర్​లోని రామ్​గంజ్​కు చెందిన ఆ వ్యక్తి ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. వైద్యులు పరీక్షలు చేసి అతడికి కరోనా సోకినట్లు నిర్ధరించారు. అయితే... కొద్ది రోజుల తర్వాత అదే ప్రాంతంలో మరిన్ని కేసులు వెలుగుచూశాయి. బాధితులంతా ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారేనని గుర్తించారు అధికారులు.

ఈ ఘటనను ఉదహరిస్తూ సామాజిక దూరమే కరోనా నియంత్రణకు ఏకైక మార్గమని హితబోధ చేస్తున్నారు అధికారులు. అదే కరోనా అంతానికి కీలకమని ఉద్ఘాటిస్తున్నారు.

రాజస్థాన్​లో నేడు కొత్తగా 9 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 129కి చేరింది.

ఒకరి నుంచి ముగ్గురికి...

కరోనా సోకిన ఓ వ్యక్తి నుంచి దాదాపు మరో ముగ్గురికి వైరస్ సోకే అవకాశం ఉందని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గించడానికి 'సోషల్​ డిస్టెన్స్'​ పాటించడమే అత్యంత కీలకమని వివరించింది.

రాజస్థాన్​లో కరోనా సోకిన ఓ వ్యక్తి నుంచి మరో 17 మందికి వైరస్​ వ్యాపించింది. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది. అప్రమత్తమైన అధికారులు.. ఆ బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులందరినీ గుర్తించే పనిలో పడ్డారు.

జైపుర్​లోని రామ్​గంజ్​కు చెందిన ఆ వ్యక్తి ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. వైద్యులు పరీక్షలు చేసి అతడికి కరోనా సోకినట్లు నిర్ధరించారు. అయితే... కొద్ది రోజుల తర్వాత అదే ప్రాంతంలో మరిన్ని కేసులు వెలుగుచూశాయి. బాధితులంతా ఆ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారేనని గుర్తించారు అధికారులు.

ఈ ఘటనను ఉదహరిస్తూ సామాజిక దూరమే కరోనా నియంత్రణకు ఏకైక మార్గమని హితబోధ చేస్తున్నారు అధికారులు. అదే కరోనా అంతానికి కీలకమని ఉద్ఘాటిస్తున్నారు.

రాజస్థాన్​లో నేడు కొత్తగా 9 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 129కి చేరింది.

ఒకరి నుంచి ముగ్గురికి...

కరోనా సోకిన ఓ వ్యక్తి నుంచి దాదాపు మరో ముగ్గురికి వైరస్ సోకే అవకాశం ఉందని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గించడానికి 'సోషల్​ డిస్టెన్స్'​ పాటించడమే అత్యంత కీలకమని వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.