ETV Bharat / bharat

'సరిహద్దుపై తుది తీర్మానం వరకూ ప్రశాంతంగా ఉందాం' - NSA Doval and Chinese Foreign Minister Wang hold boundary talks

దశాబ్దాలుగా నలుగుతున్న భారత్​-చైనా సరిహద్దు వివాదంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమావేశమయ్యారు. 3500 కిలోమీటర్ల భారత్-చైనా సరిహద్దు వెంట శాంతి నెలకొల్పే దిశగా ప్రత్యేక ప్రతినిధులిద్దరూ చర్చించినట్లు సమాచారం. సరిహద్దు అంశమై తుది తీర్మానం వెలువడే వరకు శాంతిని పాటించాలని ప్రతినిధులు ఉద్ఘాటించారు.

dobal
'సరిహద్దుపై తుది తీర్మానం వరకు ప్రశాంతంగా ఉందాం'
author img

By

Published : Dec 21, 2019, 5:09 PM IST

భారత్​-చైనా సరిహద్దు అంశమై ప్రత్యేక ప్రతినిధులైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ దిల్లీలో సమావేశమయ్యారు. 3500 కిలోమీటర్ల మేర ఉన్న భారత్-చైనా సరిహద్దుపై గల భేదాభిప్రాయలపై చర్చించారు. సరిహద్దులో శాంతి నెలకొనే దిశగా పలు అంశాలపై ప్రతినిధులు చర్చించారని సమాచారం. సరిహద్దు సమస్యపై తుది తీర్మానం పెండింగ్​లో ఉన్నందున ఇరు దేశాలు సరిహద్దు వెంబడి ప్రశాంతంగా ఉండాలని ప్రతినిధులు ఆకాంక్షించారు.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్ మధ్య తమిళనాడు మహాబలిపురం వేదికగా రెండో అనధికారిక సమావేశం అనంతరం ఇరుదేశాల ప్రతినిధులు భేటీ కావడం ఇదే తొలిసారి.

అయితే సరిహద్దు అంశమై ప్రత్యేక ప్రతినిధుల సమావేశానికి వాంగ్​యీ గత సెప్టెంబర్​లోనే భారత్​ను సందర్శించినప్పటికీ ఆ సమయంలో చర్చలు వాయిదా పడ్డాయి. గతంలో 21 దఫాల పాటు సరిహద్దు అంశమై ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరిగింది. వాస్తవాధీన రేఖ వెంబడి గల ఇండో-చైనా సరిహద్దు అంశమై ఇరుదేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్​లో భాగమని డ్రాగన్ దేశం వాదిస్తోండగా.. భారత్ తమ భూభాగమేనని ఉద్ఘాటిస్తూ వస్తోంది.

ఇదీ చూడండి: మరోసారి పాక్ దుశ్చర్య.. ఇద్దరు దాయాది సైనికులు హతం

భారత్​-చైనా సరిహద్దు అంశమై ప్రత్యేక ప్రతినిధులైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ దిల్లీలో సమావేశమయ్యారు. 3500 కిలోమీటర్ల మేర ఉన్న భారత్-చైనా సరిహద్దుపై గల భేదాభిప్రాయలపై చర్చించారు. సరిహద్దులో శాంతి నెలకొనే దిశగా పలు అంశాలపై ప్రతినిధులు చర్చించారని సమాచారం. సరిహద్దు సమస్యపై తుది తీర్మానం పెండింగ్​లో ఉన్నందున ఇరు దేశాలు సరిహద్దు వెంబడి ప్రశాంతంగా ఉండాలని ప్రతినిధులు ఆకాంక్షించారు.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్ మధ్య తమిళనాడు మహాబలిపురం వేదికగా రెండో అనధికారిక సమావేశం అనంతరం ఇరుదేశాల ప్రతినిధులు భేటీ కావడం ఇదే తొలిసారి.

అయితే సరిహద్దు అంశమై ప్రత్యేక ప్రతినిధుల సమావేశానికి వాంగ్​యీ గత సెప్టెంబర్​లోనే భారత్​ను సందర్శించినప్పటికీ ఆ సమయంలో చర్చలు వాయిదా పడ్డాయి. గతంలో 21 దఫాల పాటు సరిహద్దు అంశమై ప్రత్యేక ప్రతినిధుల సమావేశం జరిగింది. వాస్తవాధీన రేఖ వెంబడి గల ఇండో-చైనా సరిహద్దు అంశమై ఇరుదేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్​లో భాగమని డ్రాగన్ దేశం వాదిస్తోండగా.. భారత్ తమ భూభాగమేనని ఉద్ఘాటిస్తూ వస్తోంది.

ఇదీ చూడండి: మరోసారి పాక్ దుశ్చర్య.. ఇద్దరు దాయాది సైనికులు హతం

AP Video Delivery Log - 1000 GMT News
Saturday, 21 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0934: US Trump Christian Magazine Part must credit NPR 4245777
Evangelical Christian magazine: Trump must go
AP-APTN-0924: Australia Fires Resident No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4245825
Adelaide Hills resident worried about fire threat
AP-APTN-0822: New Zealand Guns No access New Zealand 4245823
More than 50,000 guns handed over in NZ buy back
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.