దాదాపు వారం రోజులకు పైగా అల్లర్లతో అట్టుడికిన దేశ రాజధాని దిల్లీలో.. ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పౌర నిరసనలు హింసకు దారితీసినందున.. ఇన్ని రోజులు ఇళ్లకే పరిమితమైన ఈశాన్య దిల్లీ ప్రజలు ప్రస్తుతం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. జఫ్రాబాద్, మౌజ్పుర్, బాబర్పుర్, సీలంపుర్ ప్రాంతాల్లో మూతపడిన షాపుల్లో కొన్ని తెరుచుకున్నాయి. ప్రజలు నెమ్మదిగా భయాందోళనలు వీడి పనిలో నిమగ్నమైనట్లు కనిపిస్తున్నారు. అయితే అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో మాత్రం భద్రతా దళాల బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.
సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఫిబ్రవరి 23న చెలరేగిన హింసకాండలో ఇప్పటివరకు 43 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి : 'జంగిల్బుక్'ను తలపిస్తున్న చిరుతతో చిన్నారుల స్నేహం