ETV Bharat / bharat

'ఇద్దరు మోదీలకు భేదం లేదు'

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు నీరవ్​ మోదీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భేదమేమీ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ.

author img

By

Published : Mar 10, 2019, 12:04 AM IST

నీరవ్​ మోదీ, నరేంద్రమోదీలపై రాహుల్ విమర్శలు

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధినేత రాహుల్​ గాంధీ. పంజాబ్​ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్​మోదీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భేదమేమీ లేదన్నారు. ఇద్దరు న్యాయవ్యవస్థకు అతీతులని రాహుల్​ ఎద్దేవా చేశారు.

పీఎన్​బీలో రూ. 13500 కోట్లను ఎగవేసి బ్రిటన్​లో తలదాచుకుంటున్నారు నీరవ్​ మోదీ. నీరవ్​ మోదీ మీసంతో ఉన్న వీడియో తాజాగా వెలుగు చూసిన కారణంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్. నీరవ్​ మోదీ 8 మిలియన్​ పౌండ్ల విలువచేసే గృహంలో నివసిస్తూ అక్కడా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారని సమాచారం. నీరవ్​ మోదీకి, ఆయన సోదరుడి వంటి వాడైన నరేంద్రమోదీకి ఏ భేదమూ లేదని ఎద్దేవా చేశారు రాహుల్. భవిష్యత్తులో ఇద్దరు మోదీలు న్యాయ విచారణ ఎదుర్కోక తప్పదని రాహుల్ జోస్యం చెప్పారు.

రుణఎగవేతదారులు రూ. లక్ష కోట్ల విలువైన ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి దోచేశారన్నారు రాహుల్.

  • The video of fugitive #NiravModi in London shows an uncanny similarity between him & his bhai, PM Modi.

    Both have looted India and are called Modi.

    Both refuse to answer any questions.

    Both believe they are above the law.

    Both will face justice. https://t.co/20Y36iVj2Y

    — Rahul Gandhi (@RahulGandhi) March 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మీ పాలనలోనే...

2011లో కాంగ్రెస్ పాలనలోనే నీరవ్​ మోదీ తన కుంభకోణాన్ని ప్రారంభించాడని కాంగ్రెస్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టింది భాజపా. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ కుంభకోణాన్ని బయటపెట్టిందని పేర్కొంది.

ఇదీ చూడండి:పోలీసు పల్లకీలో.... బెల్ట్​షాపు నిందితుడు

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధినేత రాహుల్​ గాంధీ. పంజాబ్​ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్​మోదీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భేదమేమీ లేదన్నారు. ఇద్దరు న్యాయవ్యవస్థకు అతీతులని రాహుల్​ ఎద్దేవా చేశారు.

పీఎన్​బీలో రూ. 13500 కోట్లను ఎగవేసి బ్రిటన్​లో తలదాచుకుంటున్నారు నీరవ్​ మోదీ. నీరవ్​ మోదీ మీసంతో ఉన్న వీడియో తాజాగా వెలుగు చూసిన కారణంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్. నీరవ్​ మోదీ 8 మిలియన్​ పౌండ్ల విలువచేసే గృహంలో నివసిస్తూ అక్కడా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారని సమాచారం. నీరవ్​ మోదీకి, ఆయన సోదరుడి వంటి వాడైన నరేంద్రమోదీకి ఏ భేదమూ లేదని ఎద్దేవా చేశారు రాహుల్. భవిష్యత్తులో ఇద్దరు మోదీలు న్యాయ విచారణ ఎదుర్కోక తప్పదని రాహుల్ జోస్యం చెప్పారు.

రుణఎగవేతదారులు రూ. లక్ష కోట్ల విలువైన ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి దోచేశారన్నారు రాహుల్.

  • The video of fugitive #NiravModi in London shows an uncanny similarity between him & his bhai, PM Modi.

    Both have looted India and are called Modi.

    Both refuse to answer any questions.

    Both believe they are above the law.

    Both will face justice. https://t.co/20Y36iVj2Y

    — Rahul Gandhi (@RahulGandhi) March 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మీ పాలనలోనే...

2011లో కాంగ్రెస్ పాలనలోనే నీరవ్​ మోదీ తన కుంభకోణాన్ని ప్రారంభించాడని కాంగ్రెస్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టింది భాజపా. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ కుంభకోణాన్ని బయటపెట్టిందని పేర్కొంది.

ఇదీ చూడండి:పోలీసు పల్లకీలో.... బెల్ట్​షాపు నిందితుడు


Kinnaur (Himachal Pradesh), Mar 09 (ANI): The Indian Army on Saturday retrieved the body of another jawan on the 18th day of operations at the avalanche site in Namgya, Kinnaur. Six army men were trapped after an avalanche hit Pooh sub-division of Kinnaur district on Feb 20. Four bodies have been recovered by the forces from the site of the avalanche. Rescue operation is underway to recover the remaining bodies.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.