ETV Bharat / bharat

క్షమాభిక్షపై నిర్భయ దోషి పిటిషన్​ కొట్టివేత

author img

By

Published : Feb 14, 2020, 3:01 PM IST

Updated : Mar 1, 2020, 8:10 AM IST

క్షమాభిక్ష తిరస్కరణను సవాల్​ చేస్తూ నిర్భయ దోషి వినయ్​ శర్మ దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టివేసింది సుప్రీం కోర్టు. న్యాయ సమీక్ష చేసేందుకు సహేతుక కారణమేదీ లేదని స్పష్టం చేసింది. దోషి మానసిక పరిస్థితి సక్రమంగానే ఉన్నట్లు వైద్య నివేదికలు చెబుతున్నాయని పేర్కొంది ధర్మాసనం.

Nirbhaya
క్షమాభిక్షపై నిర్భయ దోషి పిటిషన్​ కొట్టివేత

నిర్భయ దోషి వినయ్​ శర్మకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్​ చేస్తూ దాఖలు చేసిన వాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

జస్టిస్​ ఆర్​ బానుమతి, జస్టిస్​ అశోక్​ భూషన్​, జస్టిస్​ ఏఎస్​ బోపన్నలతో కూడిన ధర్మాసనం వినయ్ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. రాష్ట్రపతి నిర్ణయంపై న్యాయ సమీక్ష జరిపేందుకు ఎలాంటి సహేతుక కారణం కనిపించడంలేదని స్పష్టం చేసింది. అవసరమైన పత్రాలతో పాటు దోషికి సంబంధించిన మెడికల్​ రిపోర్టును రాష్ట్రపతి ముందు ఉంచినట్లు పేర్కొంది ధర్మాసనం. తన మానసిక స్థితి బాగోలేదని దోషి వినయ్​ పేర్కొనటాన్ని తప్పుపట్టింది. అతను మానసికంగా స్థిరంగానే ఉన్నట్లు వైద్య నివేదికలు చెబుతున్నాయని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

నాటకీయ పరిణామాలు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులు ముకేశ్​ కుమార్​, పవన్​ గుప్తా, వినయ్​ కుమార్​ శర్మ, అక్షయ్​ కుమార్​లకు ఉరి అమలు పలుమార్లు వాయిదా పడింది. ఈనెల 1న ఉదయం ఉరి వేయాల్సి ఉండగా.. తమకు న్యాయ సహాయం పొందేందుకు అవకాశం ఉందని దోషులు ట్రయల్​ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో జనవరి 31న ఉరి అమలును వాయిదా వేసింది కోర్టు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: స్పృహ తప్పిన సుప్రీం జడ్జి- 'నిర్భయ' కేసు తీర్పు చదువుతూ...

నిర్భయ దోషి వినయ్​ శర్మకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తన క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాల్​ చేస్తూ దాఖలు చేసిన వాజ్యాన్ని సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

జస్టిస్​ ఆర్​ బానుమతి, జస్టిస్​ అశోక్​ భూషన్​, జస్టిస్​ ఏఎస్​ బోపన్నలతో కూడిన ధర్మాసనం వినయ్ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది. రాష్ట్రపతి నిర్ణయంపై న్యాయ సమీక్ష జరిపేందుకు ఎలాంటి సహేతుక కారణం కనిపించడంలేదని స్పష్టం చేసింది. అవసరమైన పత్రాలతో పాటు దోషికి సంబంధించిన మెడికల్​ రిపోర్టును రాష్ట్రపతి ముందు ఉంచినట్లు పేర్కొంది ధర్మాసనం. తన మానసిక స్థితి బాగోలేదని దోషి వినయ్​ పేర్కొనటాన్ని తప్పుపట్టింది. అతను మానసికంగా స్థిరంగానే ఉన్నట్లు వైద్య నివేదికలు చెబుతున్నాయని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

నాటకీయ పరిణామాలు..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులు ముకేశ్​ కుమార్​, పవన్​ గుప్తా, వినయ్​ కుమార్​ శర్మ, అక్షయ్​ కుమార్​లకు ఉరి అమలు పలుమార్లు వాయిదా పడింది. ఈనెల 1న ఉదయం ఉరి వేయాల్సి ఉండగా.. తమకు న్యాయ సహాయం పొందేందుకు అవకాశం ఉందని దోషులు ట్రయల్​ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో జనవరి 31న ఉరి అమలును వాయిదా వేసింది కోర్టు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: స్పృహ తప్పిన సుప్రీం జడ్జి- 'నిర్భయ' కేసు తీర్పు చదువుతూ...

Last Updated : Mar 1, 2020, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.