ETV Bharat / bharat

వేర్వేరుగా ఉరి తీయాలన్న​ వ్యాజ్యంపై విచారణ వాయిదా

author img

By

Published : Feb 13, 2020, 12:33 PM IST

Updated : Mar 1, 2020, 5:00 AM IST

నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరితీయాలన్న కేంద్రం వ్యాజ్యంపై విచారణను రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్భయ దోషులకు సూచించింది. మరోవైపు వినయ్ శర్మ క్షమాభిక్ష ప్రతిపాదనలపై కేంద్ర హోంమంత్రి సంతకం చేయలేదన్న ఆరోపణలను కొట్టిపారేసింది.

nirbhaya
నిర్భయ

వేర్వేరుగా ఉరి తీయాలన్న​ వ్యాజ్యంపై విచారణ వాయిదా

నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరితీయాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్​పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యాజ్యంపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్భయ దోషులకు సూచించింది.

కేంద్రం పిటిషన్​పై వాదనలు విన్న జస్టిస్ బానుమతి, జస్టిస్​ అశోక్ భూషణ్​లతో కూడిన ధర్మాసనం.. దోషి పవన్ గుప్తాకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది అంజనా ప్రకాశ్​ను అమికస్​ క్యూరీ (న్యాయ సలహాదారు)గా నియమించింది. శుక్రవారం 2 గంటల వరకు విచారణ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

వినయ్ పిటిషన్ తిరస్కరణ

తన క్షమాభిక్ష తిరస్కరణ దస్త్రంపై దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోంమంత్రి సంతకం చేయలేదంటూ.. నిర్భయ దోషి వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి రికార్డులను పరిశీలించిన ధర్మాసనం... పిటిషన్​పై ఇరువురూ సంతకాలు చేసినట్లు వెల్లడించింది.

ఆలస్యం!

ఉరిశిక్ష పడిన దోషులకు చివరి న్యాయ పరిహారం అయిన క్యురేటివ్ పిటిషన్​ను పవన్ గుప్తా ఇప్పటివరకు దాఖలు చేసుకోలేదు. క్షమభిక్ష పిటిషన్​ అవకాశాన్నీ ఇంతవరకు వినియోగించుకోలేదు. పవన్ గుప్తాకు కొత్త న్యాయవాదిని ఏర్పాటు చేస్తే ఉరి శిక్ష అమలు మరింత ఆలస్యమవుతుందని ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశారు నిర్భయ తల్లి ఆశా దేవి.

వేర్వేరుగా ఉరి తీయాలన్న​ వ్యాజ్యంపై విచారణ వాయిదా

నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరితీయాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్​పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యాజ్యంపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్భయ దోషులకు సూచించింది.

కేంద్రం పిటిషన్​పై వాదనలు విన్న జస్టిస్ బానుమతి, జస్టిస్​ అశోక్ భూషణ్​లతో కూడిన ధర్మాసనం.. దోషి పవన్ గుప్తాకు న్యాయ సహాయం అందించేందుకు సీనియర్ న్యాయవాది అంజనా ప్రకాశ్​ను అమికస్​ క్యూరీ (న్యాయ సలహాదారు)గా నియమించింది. శుక్రవారం 2 గంటల వరకు విచారణ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

వినయ్ పిటిషన్ తిరస్కరణ

తన క్షమాభిక్ష తిరస్కరణ దస్త్రంపై దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర హోంమంత్రి సంతకం చేయలేదంటూ.. నిర్భయ దోషి వినయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించి రికార్డులను పరిశీలించిన ధర్మాసనం... పిటిషన్​పై ఇరువురూ సంతకాలు చేసినట్లు వెల్లడించింది.

ఆలస్యం!

ఉరిశిక్ష పడిన దోషులకు చివరి న్యాయ పరిహారం అయిన క్యురేటివ్ పిటిషన్​ను పవన్ గుప్తా ఇప్పటివరకు దాఖలు చేసుకోలేదు. క్షమభిక్ష పిటిషన్​ అవకాశాన్నీ ఇంతవరకు వినియోగించుకోలేదు. పవన్ గుప్తాకు కొత్త న్యాయవాదిని ఏర్పాటు చేస్తే ఉరి శిక్ష అమలు మరింత ఆలస్యమవుతుందని ఇదివరకే ఆందోళన వ్యక్తం చేశారు నిర్భయ తల్లి ఆశా దేవి.

Last Updated : Mar 1, 2020, 5:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.