ETV Bharat / bharat

'కరోనా సవాళ్లను అవకాశాలుగా మలుచుకుందాం'

author img

By

Published : Apr 27, 2020, 7:07 PM IST

కరోనాపై పోరుతో పాటే ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రులతో లాక్​డౌన్ ఎత్తివేత అంశమై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని.. వేలాది ప్రాణాలు కాపాడటంలో గత నెలన్నరగా తీసుకున్న నిర్ణయాలు ఫలించాయని పేర్కొన్నారు. దేశం రెండు లాక్‌డౌన్‌లు చూసిందన్న ఆయన ఇక భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని ఉద్ఘాటించారు. వైరస్ సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని చెప్పారు.

modi
'కరోనా సవాళ్లను అవకాశాలుగా మలుచుకుందాం'

కరోనా వైరస్ విసురుతున్న సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. వైరస్​పై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, లాక్‌డౌన్‌ అమలు కారణంగా నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండున్నర గంటలు చర్చించారు. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, ప్రధాని కార్యాలయం, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లాక్​డౌన్​తో ఫలితాలు

కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు, కేంద్రంతో కలిసి చేపట్టిన ప్రయత్నాలు కొంత ప్రభావాన్ని చూపుతున్నట్లు పేర్కొన్నారు ప్రధాని. లాక్​డౌన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గత నెలన్నరగా లాక్‌డౌన్‌ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని మోదీ చెప్పినట్లు తెలిసింది. వేలాదిమంది ప్రాణాలను రక్షించే దిశగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఉపయోగపడ్డాయని చెప్పారు.

మాస్కులూ భాగమే..

రాబోయే రోజుల్లోనూ కరోనా ప్రభావం కనిపిస్తుందని పేర్కొన్న ప్రధాని మాస్కులు మన జీవితంలో భాగంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. మార్చిలో కరోనా ప్రభావం అన్ని దేశాల్లో మాదిరే భారత్‌లోనూ ఉన్నట్లు మోదీ వ్యాఖ్యానించారు. సమయానుకూలంగా తీసుకున్న చర్యలతో ఎంతో మందిని వైరస్ బారినుంచి కాపాడినట్లు చెప్పారు.

ఇంకా ప్రమాదమే..

నిపుణుల అంచనా మేరకు కరోనా ప్రమాదం ఇంకా పొంచే ఉందన్న మోదీ పటిష్టమైన నిఘా చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. వేసవి నుంచి వర్షాకాలం మారేటప్పటికి వైరస్‌ ప్రభావం తిరిగి విజృంభించే అవకాశముందన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యూహాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రులను కోరారు.

ఆర్థిక వ్యవస్థకు అధిక ప్రాధాన్యం..

వైరస్​పై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థను కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు మోదీ. రెండు దశల లాక్‌డౌన్‌లో రెండో విడతలో కొన్ని మినహాయింపులు తీసుకువచ్చినట్లు మోదీ గుర్తుచేశారు. ఉపాధి హామీ సహా మరికొన్ని పనులు ప్రారంభమైనట్లు చెప్పారు.

తొమ్మిదిమందికే అవకాశం..

లాక్‌డౌన్ గడువు మే 3తో ముగుస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేసే అంశంపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయం కోరారు. మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్‌, పుదుచ్ఛేరి, హిమాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, బిహార్‌, గుజరాత్‌, హర్యానా సీఎంలకు మోదీ మాట్లాడే అవకాశం ఇచ్చినట్లు తెలిసింది.

మే 3 తర్వాతే నిర్ణయం..

మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగిస్తామని..మేఘాలయ సహా నాలుగు రాష్ట్రాల సీఎంలు చెప్పినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌పై మే 3 తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రధాని అన్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్‌ కొనసాగుతుందని మోదీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. కోవిడ్‌ ప్రభావం తక్కువ ఉన్న రాష్ట్రాల్లో జిల్లాల వారీగా పరిస్థితి సమీక్షించి.. మినహాయింపులు ఇచ్చే అంశం పరిశీలిస్తామని సీఎంలతో ప్రధాని అన్నట్లు సమాచారం.

సంస్కరణలపై దృష్టి

సాంకేతికతను వీలైనంతగా ఉపయోగించాలని సూచించారు ప్రధాని. సంస్కరణలపై దృష్టి పెట్టాలని కోరారు. విదేశాల్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే అంశం తన మనస్సులో ఉన్నట్లు చెప్పిన ప్రధాని వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకూడదని, అదే సమయంలో వారి కుటుంబాలు ప్రమాదంలో పడకూడదని అన్నారు. ఉపాధి హామీ పనిదినాలను ప్రస్తుతం ఉన్న 100 నుంచి 150 రోజులకు పెంచాలని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి...ప్రధానికి సూచించినట్లు తెలిసింది.

'సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలి'

కరోనా సవాళ్లను పాలనా సంస్కరణలకు అవకాశాలుగా మలుచుకోవాలని ప్రధాని మోదీ వెల్లడించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. వైరస్ కేసుల్లో పెరుగుదల నేరమేమీ కాదని వ్యాఖ్యానించినట్లు చెప్పారు.

'రోజుకూలీల కోసం..'

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు విధించిన లాక్​డౌన్​కు కొన్ని సడలింపులు చేయాలని భావిస్తున్నట్లు వీడియో కాన్ఫరెన్స్ వేదికగా చెప్పారు గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. రోజూవారీ కూలీల కోసం ఈ ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు.

'మే 3 తర్వాత కొనసాగిస్తాం'

మే 3 తర్వాత కూడా లాక్​డౌన్ కొనసాగిస్తామని చెప్పారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి: నాగాల రక్తంపై చైనా పరిశోధనల వల్లే కరోనా?

కరోనా వైరస్ విసురుతున్న సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. వైరస్​పై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, లాక్‌డౌన్‌ అమలు కారణంగా నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండున్నర గంటలు చర్చించారు. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, ప్రధాని కార్యాలయం, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లాక్​డౌన్​తో ఫలితాలు

కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు, కేంద్రంతో కలిసి చేపట్టిన ప్రయత్నాలు కొంత ప్రభావాన్ని చూపుతున్నట్లు పేర్కొన్నారు ప్రధాని. లాక్​డౌన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. గత నెలన్నరగా లాక్‌డౌన్‌ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని మోదీ చెప్పినట్లు తెలిసింది. వేలాదిమంది ప్రాణాలను రక్షించే దిశగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఉపయోగపడ్డాయని చెప్పారు.

మాస్కులూ భాగమే..

రాబోయే రోజుల్లోనూ కరోనా ప్రభావం కనిపిస్తుందని పేర్కొన్న ప్రధాని మాస్కులు మన జీవితంలో భాగంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. మార్చిలో కరోనా ప్రభావం అన్ని దేశాల్లో మాదిరే భారత్‌లోనూ ఉన్నట్లు మోదీ వ్యాఖ్యానించారు. సమయానుకూలంగా తీసుకున్న చర్యలతో ఎంతో మందిని వైరస్ బారినుంచి కాపాడినట్లు చెప్పారు.

ఇంకా ప్రమాదమే..

నిపుణుల అంచనా మేరకు కరోనా ప్రమాదం ఇంకా పొంచే ఉందన్న మోదీ పటిష్టమైన నిఘా చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. వేసవి నుంచి వర్షాకాలం మారేటప్పటికి వైరస్‌ ప్రభావం తిరిగి విజృంభించే అవకాశముందన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యూహాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రులను కోరారు.

ఆర్థిక వ్యవస్థకు అధిక ప్రాధాన్యం..

వైరస్​పై పోరాడుతూనే ఆర్థిక వ్యవస్థను కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు మోదీ. రెండు దశల లాక్‌డౌన్‌లో రెండో విడతలో కొన్ని మినహాయింపులు తీసుకువచ్చినట్లు మోదీ గుర్తుచేశారు. ఉపాధి హామీ సహా మరికొన్ని పనులు ప్రారంభమైనట్లు చెప్పారు.

తొమ్మిదిమందికే అవకాశం..

లాక్‌డౌన్ గడువు మే 3తో ముగుస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేసే అంశంపై ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల అభిప్రాయం కోరారు. మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్‌, పుదుచ్ఛేరి, హిమాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, బిహార్‌, గుజరాత్‌, హర్యానా సీఎంలకు మోదీ మాట్లాడే అవకాశం ఇచ్చినట్లు తెలిసింది.

మే 3 తర్వాతే నిర్ణయం..

మే 3 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగిస్తామని..మేఘాలయ సహా నాలుగు రాష్ట్రాల సీఎంలు చెప్పినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌పై మే 3 తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రధాని అన్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి ఉన్నచోట్ల లాక్‌డౌన్‌ కొనసాగుతుందని మోదీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. కోవిడ్‌ ప్రభావం తక్కువ ఉన్న రాష్ట్రాల్లో జిల్లాల వారీగా పరిస్థితి సమీక్షించి.. మినహాయింపులు ఇచ్చే అంశం పరిశీలిస్తామని సీఎంలతో ప్రధాని అన్నట్లు సమాచారం.

సంస్కరణలపై దృష్టి

సాంకేతికతను వీలైనంతగా ఉపయోగించాలని సూచించారు ప్రధాని. సంస్కరణలపై దృష్టి పెట్టాలని కోరారు. విదేశాల్లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే అంశం తన మనస్సులో ఉన్నట్లు చెప్పిన ప్రధాని వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకూడదని, అదే సమయంలో వారి కుటుంబాలు ప్రమాదంలో పడకూడదని అన్నారు. ఉపాధి హామీ పనిదినాలను ప్రస్తుతం ఉన్న 100 నుంచి 150 రోజులకు పెంచాలని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి...ప్రధానికి సూచించినట్లు తెలిసింది.

'సవాళ్లను అవకాశాలుగా మలుచుకోవాలి'

కరోనా సవాళ్లను పాలనా సంస్కరణలకు అవకాశాలుగా మలుచుకోవాలని ప్రధాని మోదీ వెల్లడించినట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. వైరస్ కేసుల్లో పెరుగుదల నేరమేమీ కాదని వ్యాఖ్యానించినట్లు చెప్పారు.

'రోజుకూలీల కోసం..'

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు విధించిన లాక్​డౌన్​కు కొన్ని సడలింపులు చేయాలని భావిస్తున్నట్లు వీడియో కాన్ఫరెన్స్ వేదికగా చెప్పారు గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. రోజూవారీ కూలీల కోసం ఈ ఏర్పాటు చేయాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు.

'మే 3 తర్వాత కొనసాగిస్తాం'

మే 3 తర్వాత కూడా లాక్​డౌన్ కొనసాగిస్తామని చెప్పారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి: నాగాల రక్తంపై చైనా పరిశోధనల వల్లే కరోనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.