ETV Bharat / bharat

భాజపాలో నయా జోష్​- రాజ్యసభలోనూ పట్టు!

పెద్దల సభలో కమళ దళానికి బలం పెరుగుతోంది. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 8 స్థానాలు కైవసం చేసుకున్న భాజపా.. ఎగువ సభలో తన బలాన్ని 86కు పెంచుకుంది. ఇదే సమయంలో.. విపక్ష కాంగ్రెస్ పార్టీ బలం 41కి పరిమితమైంది. అటు ఎన్డీఏలోని పార్టీల మద్దతు, అన్నాడీఎంకే, వైకాపా వంటి స్నేహపూర్వక పక్షాల మద్దతుతో కీలకమైన బిల్లుల ఆమోదం విషయంలో.. భాజపాకు ఇబ్బందులు తొలగనున్నాయి.

author img

By

Published : Jun 20, 2020, 5:59 PM IST

NDA widens gap with Opposition in Rajya Sabha
రాజ్యసభలో భాజపాకు పెరుగుతున్న బలం

రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ క్రమంగా బలం పుంజుకుంటోంది. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఎగువసభలో విపక్షాలకు, ఎన్డీఏకి సంఖ్యా బలంలో ఉన్న తేడా మరింత తగ్గింది. ఫలితాల అనంతరం రాజ్యసభలో అధికార భాజపాకు సొంతంగా 86మంది సభ్యులుండగా.. విపక్ష కాంగ్రెస్ పార్టీకి 41మంది సభ్యులు మద్దతుంది.

భాజపావైపే మొగ్గు...

రాజ్యసభలో ఖాళీ అయిన 61 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రకటించగా.. వీటిలో 42 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 19 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. భాజపా 8, కాంగ్రెస్ 4, వైకాపా నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. మరో మూడు స్థానాలలో.. చిన్న పార్టీలు గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో తమకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో గెలవగలిగిన స్థానాలకంటే.. మరో రెండు స్థానాల్లో అదనంగా భాజపా విజయం సాధించింది. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలోని కాంగ్రెస్ శాసనసభ్యులు పార్టీ ఫిరాయించటం వల్ల కమలదళం ఎనిమిది చోట్ల విజయకేతనం ఎగరేసింది.

మొత్తంగా ఖాళీ అయిన 61 రాజ్యసభ స్థానాలలో.. భాజపా 17, కాంగ్రెస్ 9 స్థానాలు కైవసం చేసుకుంది. భాజపా మిత్రపక్షమైన జేడీయూ మూడు స్థానాలు సొంతం చేసుకుంది. బీజేడీ, టీఎంసీ నాలుగు చొప్పున రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అన్నాడీఎంకే 3, డీఎంకే 3, ఎన్సీపీ, ఆర్జేడీ, టీఆర్ఎస్ రెండు చొప్పున సొంతం చేసుకున్నాయి.

ఈ ఫలితాల అనంతరం రాజ్యసభలో భాజపా బలం 86కు పెరగ్గా.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బలం 41కి పరిమితమైంది. మొత్తంగా 245 మంది సభ్యులున్న ఎగువసభలో.. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకి వందమందికి పైగా సభ్యుల మద్దతుంది. భాజపా స్నేహపూర్వక పక్షాలైన అన్నాడీఎంకేకు 9, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సభ్యులుండగా.. మిగిలిన చిన్నాచితకా పార్టీల మద్దతుతో కీలకమైన బిల్లులను సులభంగా ఆమోదింపజేసుకునేందుకు వీలు కలగనుంది.

పార్టీ ఫిరాయింపులతో...

రాజ్యసభలో విపక్షాలకు ఉన్న మెజారిటీ కారణంగా కీలకమైన బిల్లుల ఆమోదం విషయంలో మోదీ 1.0 సర్కారుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఐతే వివిధ రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం.. రాజ్యసభలో బలాన్ని పెంచుకునేందుకు కాషాయ దళానికి ఉపయోగపడింది. దీనితో పాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘన విజయం అనంతరం విపక్షాల్లో ఫిరాయింపులు మొదలయ్యాయి. కాంగ్రెస్, తెదేపా, సమాజ్ వాదీ పార్టీ నుంచి కొంత మంది రాజ్యసభ సభ్యులు కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో ఎగువసభలో భాజపా క్రమంగా బలం పుంజుకుంది.

అక్కడే అసలు చిక్కు...

ఇదే సమయంలో ఎన్డీఏలో లేని అనేక పార్టీలు కీలకమైన అంశాల విషయంలో కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ పునర్విభజన, ముమ్మారు తలాక్ వంటి కీలకమైన బిల్లుల ఆమోదం సమయంలోనూ భాజపాకు భారీగా మద్దతు లభించింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి సైతం రెండు సభల్లో ఆమోదం లభించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలుపొందడం వల్ల కాషాయ పార్టీ బలం మరింత పెరిగింది. ఐతే 2018 నుంచి వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాజపాకు తగులుతున్న ఎదురుదెబ్బలు.. రాజ్యసభలో సొంతంగా మెజారిటీ సాధించాలన్న కమళదలం ఆశలకు గండికొడుతున్నాయి.

ఇదీ చూడండి:- చైనా చొరబాటుపై ప్రధాని కార్యాలయం క్లారిటీ

రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ క్రమంగా బలం పుంజుకుంటోంది. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం ఎగువసభలో విపక్షాలకు, ఎన్డీఏకి సంఖ్యా బలంలో ఉన్న తేడా మరింత తగ్గింది. ఫలితాల అనంతరం రాజ్యసభలో అధికార భాజపాకు సొంతంగా 86మంది సభ్యులుండగా.. విపక్ష కాంగ్రెస్ పార్టీకి 41మంది సభ్యులు మద్దతుంది.

భాజపావైపే మొగ్గు...

రాజ్యసభలో ఖాళీ అయిన 61 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు ప్రకటించగా.. వీటిలో 42 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 19 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. భాజపా 8, కాంగ్రెస్ 4, వైకాపా నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. మరో మూడు స్థానాలలో.. చిన్న పార్టీలు గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో తమకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలంతో గెలవగలిగిన స్థానాలకంటే.. మరో రెండు స్థానాల్లో అదనంగా భాజపా విజయం సాధించింది. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలోని కాంగ్రెస్ శాసనసభ్యులు పార్టీ ఫిరాయించటం వల్ల కమలదళం ఎనిమిది చోట్ల విజయకేతనం ఎగరేసింది.

మొత్తంగా ఖాళీ అయిన 61 రాజ్యసభ స్థానాలలో.. భాజపా 17, కాంగ్రెస్ 9 స్థానాలు కైవసం చేసుకుంది. భాజపా మిత్రపక్షమైన జేడీయూ మూడు స్థానాలు సొంతం చేసుకుంది. బీజేడీ, టీఎంసీ నాలుగు చొప్పున రాజ్యసభ స్థానాలను కైవసం చేసుకున్నాయి. అన్నాడీఎంకే 3, డీఎంకే 3, ఎన్సీపీ, ఆర్జేడీ, టీఆర్ఎస్ రెండు చొప్పున సొంతం చేసుకున్నాయి.

ఈ ఫలితాల అనంతరం రాజ్యసభలో భాజపా బలం 86కు పెరగ్గా.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బలం 41కి పరిమితమైంది. మొత్తంగా 245 మంది సభ్యులున్న ఎగువసభలో.. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకి వందమందికి పైగా సభ్యుల మద్దతుంది. భాజపా స్నేహపూర్వక పక్షాలైన అన్నాడీఎంకేకు 9, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు సభ్యులుండగా.. మిగిలిన చిన్నాచితకా పార్టీల మద్దతుతో కీలకమైన బిల్లులను సులభంగా ఆమోదింపజేసుకునేందుకు వీలు కలగనుంది.

పార్టీ ఫిరాయింపులతో...

రాజ్యసభలో విపక్షాలకు ఉన్న మెజారిటీ కారణంగా కీలకమైన బిల్లుల ఆమోదం విషయంలో మోదీ 1.0 సర్కారుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఐతే వివిధ రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం.. రాజ్యసభలో బలాన్ని పెంచుకునేందుకు కాషాయ దళానికి ఉపయోగపడింది. దీనితో పాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఘన విజయం అనంతరం విపక్షాల్లో ఫిరాయింపులు మొదలయ్యాయి. కాంగ్రెస్, తెదేపా, సమాజ్ వాదీ పార్టీ నుంచి కొంత మంది రాజ్యసభ సభ్యులు కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో ఎగువసభలో భాజపా క్రమంగా బలం పుంజుకుంది.

అక్కడే అసలు చిక్కు...

ఇదే సమయంలో ఎన్డీఏలో లేని అనేక పార్టీలు కీలకమైన అంశాల విషయంలో కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ పునర్విభజన, ముమ్మారు తలాక్ వంటి కీలకమైన బిల్లుల ఆమోదం సమయంలోనూ భాజపాకు భారీగా మద్దతు లభించింది. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి సైతం రెండు సభల్లో ఆమోదం లభించింది. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు గెలుపొందడం వల్ల కాషాయ పార్టీ బలం మరింత పెరిగింది. ఐతే 2018 నుంచి వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాజపాకు తగులుతున్న ఎదురుదెబ్బలు.. రాజ్యసభలో సొంతంగా మెజారిటీ సాధించాలన్న కమళదలం ఆశలకు గండికొడుతున్నాయి.

ఇదీ చూడండి:- చైనా చొరబాటుపై ప్రధాని కార్యాలయం క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.