ETV Bharat / bharat

ఎయిర్​ ఇండియా కేసులో ప్రఫుల్​ విచారణ

ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ఎదుట పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి ప్రఫుల్​ పటేల్​ హాజరయ్యారు. ఎయిర్ ​ఇండియా కుంభకోణంలో హవాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ ఎన్సీపీ నేత.

author img

By

Published : Jun 10, 2019, 2:19 PM IST

ఎయిర్​ఇండియా కేసు

పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్​ పటేల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ఎదుట హాజరయ్యారు. ఎయిర్ ​ఇండియా కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్​ కేసులో విచారణ కోసం ఇటీవలే సమన్లు జారీచేసింది ఈడీ.

ఇదీ కేసు

లాభాలు వచ్చే రూట్లు, సమయాల్లో ఎయిర్​ ఇండియా విమానాలు తిప్పకుండా చేయడం ద్వారా విదేశీ ప్రైవేటు విమానయాన సంస్థలకు అనుచిత లబ్ధి చేకూరేలా చేశారన్నది ప్రధాన అభియోగం. ఇందుకు ప్రతిఫలంగా పౌర విమానయాన శాఖ, ఎయిర్​ ఇండియా అధికారులకు ముడుపులు అందాయన్నది ఆరోపణ. ఆ సమయంలో ప్రఫుల్​ పటేల్​ పౌరవిమానయాన శాఖ మంత్రి.

ఎయిర్​ ఇండియాకు తీవ్ర నష్టం మిగిల్చిన ఈ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్​ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. విమానయాన రంగ మధ్యవర్తి దీపక్ తల్వార్​ను ఈ ఏడాది ఆరంభంలో అరెస్టు చేసింది. ప్రఫుల్​తో తల్వార్​ ఎప్పుడూ సంప్రదింపులు జరుపుతూ ఉండేవారని అభియోగ పత్రంలో పేర్కొంది ఈడీ.

"ఎయిర్​ ఇండియా ధరకు తగినట్టు.. 2008-09 మధ్య ఎమిరేట్స్, కతార్​, ఎయిర్​ అరేబియాకు అవసరమైన అనుమతులు రాబట్టుకున్నారు తల్వార్​. ఇందుకు ఆ సంస్థలు తల్వార్​కు రూ.272 కోట్లు చెల్లించాయి."

-ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​

ఇదీ చూడండి: కథువా అత్యాచార కేసులో ఆరుగురు దోషులు

పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్​ పటేల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ ఎదుట హాజరయ్యారు. ఎయిర్ ​ఇండియా కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్​ కేసులో విచారణ కోసం ఇటీవలే సమన్లు జారీచేసింది ఈడీ.

ఇదీ కేసు

లాభాలు వచ్చే రూట్లు, సమయాల్లో ఎయిర్​ ఇండియా విమానాలు తిప్పకుండా చేయడం ద్వారా విదేశీ ప్రైవేటు విమానయాన సంస్థలకు అనుచిత లబ్ధి చేకూరేలా చేశారన్నది ప్రధాన అభియోగం. ఇందుకు ప్రతిఫలంగా పౌర విమానయాన శాఖ, ఎయిర్​ ఇండియా అధికారులకు ముడుపులు అందాయన్నది ఆరోపణ. ఆ సమయంలో ప్రఫుల్​ పటేల్​ పౌరవిమానయాన శాఖ మంత్రి.

ఎయిర్​ ఇండియాకు తీవ్ర నష్టం మిగిల్చిన ఈ వ్యవహారానికి సంబంధించి మనీలాండరింగ్​ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. విమానయాన రంగ మధ్యవర్తి దీపక్ తల్వార్​ను ఈ ఏడాది ఆరంభంలో అరెస్టు చేసింది. ప్రఫుల్​తో తల్వార్​ ఎప్పుడూ సంప్రదింపులు జరుపుతూ ఉండేవారని అభియోగ పత్రంలో పేర్కొంది ఈడీ.

"ఎయిర్​ ఇండియా ధరకు తగినట్టు.. 2008-09 మధ్య ఎమిరేట్స్, కతార్​, ఎయిర్​ అరేబియాకు అవసరమైన అనుమతులు రాబట్టుకున్నారు తల్వార్​. ఇందుకు ఆ సంస్థలు తల్వార్​కు రూ.272 కోట్లు చెల్లించాయి."

-ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​

ఇదీ చూడండి: కథువా అత్యాచార కేసులో ఆరుగురు దోషులు


Mumbai, May 01 (ANI): Jet Airways employees held a peace protest at the Chhatrapati Shivaji Maharaj International Airport in Mumbai today. They marched to Sahar Police Station and gave an application regarding the issue. Speaking to ANI, President of All India Jet Airways Officers and Staff Association, Kiran Pawaskar said, "Board of directors, chairman and CO will go out of the country. The way Kingfisher people are running around, this situation should not happen with these people."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.