ETV Bharat / bharat

రాంవిలాస్ మృతికి సంతాపంగా జాతీయ జెండా అవనతం

author img

By

Published : Oct 9, 2020, 10:20 AM IST

కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ మృతికి సంతాపంగా రాష్ట్రపతి భవన్​, పార్లమెంట్ సహా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో జాతీయ జెండాను అవనతం చేశారు. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు.

national-flag-to-fly-at-half-mast-today-as-mark-of-respect-to-ram-vilas-paswan
రాంవిలాస్ మృతికి సంతాపం తెలిపిన త్రివర్ణపతాకం!

కేంద్ర మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్‌ పాసవాన్‌ (74) మృతికి సంతాప సూచకంగా ఇవాళ దిల్లీలోని రాష్ట్రపతి భవన్​, పార్లమెంట్ సహా రాష్ట్రాల రాజధానుల్లో జాతీయ జెండాలను అవనతం(జెండాను కర్రకు సగం ఎత్తులో ఎగరెయ్యడం) చేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయవేత్తలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటివద్ద భౌతికకాయం..

ఎయిమ్స్​లో వైద్య పరీక్షల అనంతరం పాసవాన్​ భౌతికకాయాన్ని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. అధికారిక లాంఛనాలతో నేడు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఇదీ చదవండి: దళిత దిగ్గజ నేత 'పాసవాన్​' కన్నుమూత

కేంద్ర మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాంవిలాస్‌ పాసవాన్‌ (74) మృతికి సంతాప సూచకంగా ఇవాళ దిల్లీలోని రాష్ట్రపతి భవన్​, పార్లమెంట్ సహా రాష్ట్రాల రాజధానుల్లో జాతీయ జెండాలను అవనతం(జెండాను కర్రకు సగం ఎత్తులో ఎగరెయ్యడం) చేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయవేత్తలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇంటివద్ద భౌతికకాయం..

ఎయిమ్స్​లో వైద్య పరీక్షల అనంతరం పాసవాన్​ భౌతికకాయాన్ని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. అధికారిక లాంఛనాలతో నేడు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.

ఇదీ చదవండి: దళిత దిగ్గజ నేత 'పాసవాన్​' కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.