ETV Bharat / bharat

దిల్లీ ప్రజల తీర్పును శిరసా వహిస్తాం: భాజపా

author img

By

Published : Feb 11, 2020, 4:25 PM IST

Updated : Mar 1, 2020, 12:09 AM IST

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించింది భాజపా.  ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దిల్లీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామన్నారు. మరోసారి ఘన విజయం సాధించిన సీఎం కేజ్రీవాల్​కు అభినందనలు చెప్పారు.

NADDA ACCEPTS BJP DEFEAT IN DELHI
దిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తాం: జేపీ నడ్డా

దేశ రాజధాని దిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని చెప్పారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. బలమైన, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామని తెలిపారు.

దిల్లీ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణం చేయబోతున్న ఆమ్​ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్​ కేజ్రీవాల్​కు శుభాకాంక్షలు చెప్పారు నడ్డా. దిల్లీలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఆప్​ కృషి చేస్తుందని ఆశిస్తున్నట్లు వరుస ట్వీట్లు చేశారు.

దిల్లీలో భాజపా విజయం కోసం ప్రయత్నించిన ప్రతి కార్యకర్తకు నడ్డా కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: ఇది సామాన్యుడి విజయం: కేజ్రీవాల్​

దేశ రాజధాని దిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని చెప్పారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. బలమైన, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటామని తెలిపారు.

దిల్లీ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణం చేయబోతున్న ఆమ్​ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్​ కేజ్రీవాల్​కు శుభాకాంక్షలు చెప్పారు నడ్డా. దిల్లీలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఆప్​ కృషి చేస్తుందని ఆశిస్తున్నట్లు వరుస ట్వీట్లు చేశారు.

దిల్లీలో భాజపా విజయం కోసం ప్రయత్నించిన ప్రతి కార్యకర్తకు నడ్డా కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: ఇది సామాన్యుడి విజయం: కేజ్రీవాల్​

Last Updated : Mar 1, 2020, 12:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.