ETV Bharat / bharat

రాజస్థాన్​లో 'బాంబు' శబ్దం... ఏం జరిగింది? - Rajasthan latest update

రాజస్థాన్​ సాంచోర్​లోని ప్రజలు ఓ భారీ శబ్దం విని తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆకాశం నుంచి అనుమానాస్పద వస్తువు ఏదో పడినప్పుడు ఈ శబ్దం వచ్చింది. కొందరు దానిని మోర్టార్​(బాంబు) అని అనుమానిస్తున్నారు. మరికొందరు ఆకాశం నుంచి ఉల్క జారిపడినట్లు భావిస్తున్నారు.

mysterious-loud-boom-causes-panic-in-rajasthans-sanchore
రాజస్థాన్​లో భారీ శబ్దంతో బెంబేలెత్తిపోయిన ప్రజలు
author img

By

Published : Jun 19, 2020, 7:06 PM IST

రాజస్థాన్​లోని సాంచోర్​ గ్రామంలో ఆకాశం నుంచి అనుమానాస్పద వస్తువేదో భారీ శబ్దంతో నేలపై పడింది. ఆ ధ్వని ధాటికి స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోయారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. భయపడాల్సిందేమీ లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఆకాశం నుంచి పడిన అనుమానాస్పద వస్తువును కొందరు మోర్టార్​(బాంబు) అని అనుమానిస్తున్నారు. మరికొందరేమో ఉల్క అని భావిస్తున్నారు. దాని శబ్దం హెలికాప్టర్​లానే ఉందని స్థానికులు తెలిపారు. ఆ వస్తువు భూమిపై పడినప్పుడు చుట్టుపక్కల 2 కి.మీ వరకు శబ్దం వినిపించినట్లు చెప్పారు.

mysterious-loud-boom-causes-panic-in-rajasthans-sanchore
రాజస్థాన్​లో భారీ శబ్దంతో బెంబేలెత్తిపోయిన ప్రజలు

శుక్రవారం ఉదయం 6:15 గంటలకు బర్సం బైపాస్​ పులియా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సబ్ డివిజన్ అధికారి భూపేంద్ర యాదవ్​ తెలిపారు. ఆకాశం నుంచి పడిన వస్తువు నుంచి వేడి తరంగాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. అది ఏంటనే విషయాన్ని కనుగొనేందుకు నిపుణుల బృందాన్ని రంగంలోకి దించనున్నట్లు పేర్కొన్నారు.

ఘటనా స్థలానికి ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు భూపేంద్ర యాదవ్​. తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయొద్దని కోరారు.

ఇదీ చూడండి: సరిహద్దు ఉద్రిక్తతలతో రామ మందిర నిర్మాణం వాయిదా

రాజస్థాన్​లోని సాంచోర్​ గ్రామంలో ఆకాశం నుంచి అనుమానాస్పద వస్తువేదో భారీ శబ్దంతో నేలపై పడింది. ఆ ధ్వని ధాటికి స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోయారు. తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఈ విషయంపై దర్యాప్తు చేపట్టారు. భయపడాల్సిందేమీ లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఆకాశం నుంచి పడిన అనుమానాస్పద వస్తువును కొందరు మోర్టార్​(బాంబు) అని అనుమానిస్తున్నారు. మరికొందరేమో ఉల్క అని భావిస్తున్నారు. దాని శబ్దం హెలికాప్టర్​లానే ఉందని స్థానికులు తెలిపారు. ఆ వస్తువు భూమిపై పడినప్పుడు చుట్టుపక్కల 2 కి.మీ వరకు శబ్దం వినిపించినట్లు చెప్పారు.

mysterious-loud-boom-causes-panic-in-rajasthans-sanchore
రాజస్థాన్​లో భారీ శబ్దంతో బెంబేలెత్తిపోయిన ప్రజలు

శుక్రవారం ఉదయం 6:15 గంటలకు బర్సం బైపాస్​ పులియా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సబ్ డివిజన్ అధికారి భూపేంద్ర యాదవ్​ తెలిపారు. ఆకాశం నుంచి పడిన వస్తువు నుంచి వేడి తరంగాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. అది ఏంటనే విషయాన్ని కనుగొనేందుకు నిపుణుల బృందాన్ని రంగంలోకి దించనున్నట్లు పేర్కొన్నారు.

ఘటనా స్థలానికి ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు భూపేంద్ర యాదవ్​. తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయొద్దని కోరారు.

ఇదీ చూడండి: సరిహద్దు ఉద్రిక్తతలతో రామ మందిర నిర్మాణం వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.