ETV Bharat / bharat

చెట్టుకు వేలాడిన ముంగిసలు.. చంపిందెవరు! - latest killing animals news

కేరళ కాసర్​గోడ్​ జిల్లా కుమ్​బాడ్జేలో రెండు ముంగిసలను చంపి చెట్టుకు ఉరి తీసిన ఘటన వెలుగులోకి వచ్చింది.​ మూగజీవుల మీద ఈ విధంగా ప్రవర్తించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

చెట్టుకు వేలాడిన ముంగిసలు.. చంపిందెవరు!
author img

By

Published : Nov 17, 2019, 8:00 PM IST

రెండు ముంగిసలను చంపి చెట్టుకు వేలాడేసిన ఘటన కేరళలో కలకలం సృష్టిస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన వారి వివరాలు ఇంకా తెలియలేదు. మూగ జీవులను ఉరి వేయడంపై సర్వత్రా ఆందోళన ఎదురవుతోంది.

సంఘ విద్రోహక శక్తుల పని!

కాసర్​గోడ్​ జిల్లా కుమ్​బాడ్జేలోని ఓ చెట్టుకు ఉరి వేసి ఉన్న రెండు ముంగిసలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. మృతదేహాలున్న ప్రాంతంలో రాత్రి వేళ సంఘ విద్రోహక కార్యకలాపాలు సాగుతున్నట్టు వారు ఆరోపించారు. ఈ ఘటనను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

mongoose
చెట్టుకు వేలాడిన ముంగిసలు.. చంపిందెవరు!

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు.. మృతదేహాలను పరీక్షించారు. ఒక ముగింసను నాలుగు రోజుల మందు, మరో ముంగిసను రెండు రోజుల ముందే హత్య చేసినట్టు నిర్ధారించారు. అనంతరం వాటిని భూమిలో పూడ్చిపెట్టారు.

ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ మూగ జంతువుల మృతదేహాలను భూమి నుంచి తిరిగి బయటకు తీశారు అటవీశాఖ అధికారులు. అనంతరం శవపరీక్షకు పంపించారు. దీనికి సంబంధించిన నివేదిక రెండు రోజుల్లో వస్తుందని తెలిపారు.

మూగజీవులను చంపి.. ఉరివేసే ఘటనలు కేరళలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవలే తిరువనంతపురంలో ఓ పిల్లిని ఇదే విధంగా ఉరి వేశారు దుండగులు. ఇది మరువక ముందే ముంగిసను చంపిన ఘటన వెలుగు చూడటంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి : పిల్లిని చంపిన కిరాతకుడికి 34 నెలల జైలు

రెండు ముంగిసలను చంపి చెట్టుకు వేలాడేసిన ఘటన కేరళలో కలకలం సృష్టిస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన వారి వివరాలు ఇంకా తెలియలేదు. మూగ జీవులను ఉరి వేయడంపై సర్వత్రా ఆందోళన ఎదురవుతోంది.

సంఘ విద్రోహక శక్తుల పని!

కాసర్​గోడ్​ జిల్లా కుమ్​బాడ్జేలోని ఓ చెట్టుకు ఉరి వేసి ఉన్న రెండు ముంగిసలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. మృతదేహాలున్న ప్రాంతంలో రాత్రి వేళ సంఘ విద్రోహక కార్యకలాపాలు సాగుతున్నట్టు వారు ఆరోపించారు. ఈ ఘటనను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

mongoose
చెట్టుకు వేలాడిన ముంగిసలు.. చంపిందెవరు!

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు.. మృతదేహాలను పరీక్షించారు. ఒక ముగింసను నాలుగు రోజుల మందు, మరో ముంగిసను రెండు రోజుల ముందే హత్య చేసినట్టు నిర్ధారించారు. అనంతరం వాటిని భూమిలో పూడ్చిపెట్టారు.

ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ మూగ జంతువుల మృతదేహాలను భూమి నుంచి తిరిగి బయటకు తీశారు అటవీశాఖ అధికారులు. అనంతరం శవపరీక్షకు పంపించారు. దీనికి సంబంధించిన నివేదిక రెండు రోజుల్లో వస్తుందని తెలిపారు.

మూగజీవులను చంపి.. ఉరివేసే ఘటనలు కేరళలో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇటీవలే తిరువనంతపురంలో ఓ పిల్లిని ఇదే విధంగా ఉరి వేశారు దుండగులు. ఇది మరువక ముందే ముంగిసను చంపిన ఘటన వెలుగు చూడటంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి : పిల్లిని చంపిన కిరాతకుడికి 34 నెలల జైలు

Lucknow, Nov 17 (ANI): The All India Muslim Personal Law Board has decided to file a review petition regarding Supreme Court's verdict on Ayodhya case on November 17. Syed Qasim Rasool Ilyas, member of All India Muslim Personal Law Board (AIMPLB) made this statement while addressing a press conference in Lucknow.


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.