పాకిస్థాన్ అరాచకాల నుంచి రక్షించాలని భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కోరాయి సింధి, బలూచ్, పస్టో సంఘాలు. మోదీ, ట్రంప్ పాల్గొనే 'హౌడీ మోదీ' సభా వేదిక వద్ద ఆయా సంఘాల ప్రతినిధులు ప్రదర్శన చేపట్టారు.
అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి హ్యూస్టర్ చేరుకున్న వీరంతా... పాకిస్థాన్ నుంచి స్వేచ్ఛ కల్పించాలని నినాదాలు చేశారు. బలూచ్ ప్రాంతంలో పాకిస్థాన్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు.
1971లో బంగ్లాదేశ్ ప్రజల స్వేచ్ఛకు భారత్ సహాయం చేసినట్లు పాక్ ప్రజలకు సహాయం చేయాలని కోరుతున్నాను. పాకిస్థాన్లో ఉగ్రవాదం పెరిగిపోయింది. అంతా ఐఎస్ఐ, సైన్యం చెప్పినట్టే సాగుతోంది. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అందుకే స్వేచ్ఛ కోరుకుంటున్నారు.
-జాఫర్ సాహిటో, సింధి హక్కుల ఉద్యమకారుడు
ఇదీ చూడండి:చమురు సంస్థల ప్రతినిధులతో మోదీ సమావేశం