ETV Bharat / bharat

కొత్త కలల సాకారం దిశగా నవభారత్​ : మోదీ

author img

By

Published : Sep 23, 2019, 6:07 AM IST

Updated : Oct 1, 2019, 3:57 PM IST

సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ మంత్రంతో దేశ జనాభా కనీస అవసరాలు దాటి కొత్త కలల సాకారం దిశగా వెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. జాతి మొత్తాన్నీ శక్తివంతం చేసే దిశగా భారత్‌ అడుగులు వేస్తోందని తెలిపారు. గత ఐదేళ్లలో ఎవరూ కలలో కూడా ఊహించనంతగా ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

కొత్త కలల సాకారం దిశగా నవభారత్​ : మోదీ
కొత్త కలల సాకారం దిశగా నవభారత్​ : మోదీ

సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ మంత్రంతో నవ భారత నిర్మాణానికి బాటలు వేస్తున్నట్లు హౌడీ-మోదీ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం భారత్‌ నిరంతరం శ్రమిస్తోందని వ్యాఖ్యానించారు. అమెరికాలోని హ్యూస్టన్ వేదికగా జరిగిన హౌడీ-మోదీ’ సభలో పాల్గొన్నారు మోదీ. అందరూ బాగున్నారా అంటూ పలు భారతీయ భాషల్లో సంబోధించి సభికులను ఉత్సాహపరిచారు. వైవిధ్య భారతీయ భాషలు స్వేచ్ఛాయుత సహజీవనానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు.‘‘


" దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు భారత్‌లో బాగా చర్చలో ఉన్న పదం అభివృద్ధి. భారత్‌ వల్లిస్తున్న అతిపెద్ద మంత్రం సబ్‌కా సాథ్‌-సబ్‌ కా వికాస్‌. భారత్‌ అనుసరిస్తున్న అతిపెద్ద విధానం ప్రజా భాగస్వామ్యం. భారత్‌ ప్రవచిస్తున్న అతిపెద్ద నినాదం.. సంకల్పం నుంచి లక్ష్యాన్ని సిద్ధించుకోవడం. నవభారతం అన్నది భారత్‌కు ఉన్న అతిపెద్ద సంకల్పం. నవభారతం అన్న స్వప్నాన్ని నిజం చేసుకోవడం కోసం భారత్‌ రాత్రిపగలూ కష్టపడుతోంది. ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే భారత్‌ ఇతరులతో కాకుండా తమతో తామే పోటీ పడుతోంది. మాకు మేమే మార్పు చేసుకుంటున్నాం."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

అసాధారణ విజయం

2019 లోక్‌సభ ఎన్నికల్లో భారత ఓటర్లు ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు ప్రధాని. ఆ ఎన్నికలు భారత ప్రజాస్వామ్య శక్తిని ప్రపంచమంతా చాటాయని... 61 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. ఒక రకంగా ఆ సంఖ్య అమెరికా జనాభా కంటే రెట్టింపు అని తెలిపిన ప్రధాని... భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో మహిళలు ఆ ఎన్నికల్లో ఓటు వేశారని ఉద్ఘాటించారు. 2019 లోక్‌సభ ఎన్నికలు మరో కొత్త రికార్డును సృష్టించాయని... 60 ఏళ్ల తర్వాత పూర్తి మెజార్టీతో ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. 'ఇది మోదీ కారణంగా జరగలేదు. భారతీయుల వల్ల మాత్రమే జరిగిందన్నారు' ప్రధాని.


ఐదేళ్ల పాలనపై ప్రస్తావన

గాంధీజీ 150వ జయంతి జరుపుకోనున్న అక్టోబర్‌ 2 నాటికి బహిరంగ మల విసర్జనకు దేశం వీడ్కోలు పలకనుందని ప్రధాని వ్యాఖ్యానించారు. గ్రామీణ పారిశుద్ధ్య వ్యవస్థను 95 శాతానికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఐదేళ్లలో దేశంలో గ్యాస్‌ వినియోగం 50 నుంచి 95 శాతానికి తీసుకెళ్లినట్లు వివరించారు. 97 శాతం గ్రామాలకు ఐదేళ్లలో రోడ్లు వేశామన్న ప్రధాని...2 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. గత ఐదేళ్లలో వందశాతం ప్రజలను బ్యాంకులకు అనుసంధానించి.. 37 కోట్ల మందితో కొత్త బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు ప్రధాని వివరించారు.

భారత్​కు రండి

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్‌ మరింత సరళతరంగా మారుతుందని తెలిపారు ప్రధాని. ఆర్థిక వ్యవస్థను సరళీకరిస్తూ.. ఇటీవల తమ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను ప్రస్తావించారు మోదీ. ఫలితంగా భారత కంపెనీల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. అమెరికా సంస్థలు భారత్​లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు మోదీ. అలాగే కుటుంబంతో సహా భారత్​ను సందర్శించాలని ఆయన ట్రంప్​ను కోరారు.

కొత్త కలల సాకారం దిశగా నవభారత్​ : మోదీ

సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ మంత్రంతో నవ భారత నిర్మాణానికి బాటలు వేస్తున్నట్లు హౌడీ-మోదీ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం భారత్‌ నిరంతరం శ్రమిస్తోందని వ్యాఖ్యానించారు. అమెరికాలోని హ్యూస్టన్ వేదికగా జరిగిన హౌడీ-మోదీ’ సభలో పాల్గొన్నారు మోదీ. అందరూ బాగున్నారా అంటూ పలు భారతీయ భాషల్లో సంబోధించి సభికులను ఉత్సాహపరిచారు. వైవిధ్య భారతీయ భాషలు స్వేచ్ఛాయుత సహజీవనానికి ప్రతీక అని వ్యాఖ్యానించారు.‘‘


" దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు భారత్‌లో బాగా చర్చలో ఉన్న పదం అభివృద్ధి. భారత్‌ వల్లిస్తున్న అతిపెద్ద మంత్రం సబ్‌కా సాథ్‌-సబ్‌ కా వికాస్‌. భారత్‌ అనుసరిస్తున్న అతిపెద్ద విధానం ప్రజా భాగస్వామ్యం. భారత్‌ ప్రవచిస్తున్న అతిపెద్ద నినాదం.. సంకల్పం నుంచి లక్ష్యాన్ని సిద్ధించుకోవడం. నవభారతం అన్నది భారత్‌కు ఉన్న అతిపెద్ద సంకల్పం. నవభారతం అన్న స్వప్నాన్ని నిజం చేసుకోవడం కోసం భారత్‌ రాత్రిపగలూ కష్టపడుతోంది. ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే భారత్‌ ఇతరులతో కాకుండా తమతో తామే పోటీ పడుతోంది. మాకు మేమే మార్పు చేసుకుంటున్నాం."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

అసాధారణ విజయం

2019 లోక్‌సభ ఎన్నికల్లో భారత ఓటర్లు ముఖ్య పాత్ర పోషించారని తెలిపారు ప్రధాని. ఆ ఎన్నికలు భారత ప్రజాస్వామ్య శక్తిని ప్రపంచమంతా చాటాయని... 61 కోట్ల మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. ఒక రకంగా ఆ సంఖ్య అమెరికా జనాభా కంటే రెట్టింపు అని తెలిపిన ప్రధాని... భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో మహిళలు ఆ ఎన్నికల్లో ఓటు వేశారని ఉద్ఘాటించారు. 2019 లోక్‌సభ ఎన్నికలు మరో కొత్త రికార్డును సృష్టించాయని... 60 ఏళ్ల తర్వాత పూర్తి మెజార్టీతో ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. 'ఇది మోదీ కారణంగా జరగలేదు. భారతీయుల వల్ల మాత్రమే జరిగిందన్నారు' ప్రధాని.


ఐదేళ్ల పాలనపై ప్రస్తావన

గాంధీజీ 150వ జయంతి జరుపుకోనున్న అక్టోబర్‌ 2 నాటికి బహిరంగ మల విసర్జనకు దేశం వీడ్కోలు పలకనుందని ప్రధాని వ్యాఖ్యానించారు. గ్రామీణ పారిశుద్ధ్య వ్యవస్థను 95 శాతానికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఐదేళ్లలో దేశంలో గ్యాస్‌ వినియోగం 50 నుంచి 95 శాతానికి తీసుకెళ్లినట్లు వివరించారు. 97 శాతం గ్రామాలకు ఐదేళ్లలో రోడ్లు వేశామన్న ప్రధాని...2 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రోడ్లను నిర్మించినట్లు తెలిపారు. గత ఐదేళ్లలో వందశాతం ప్రజలను బ్యాంకులకు అనుసంధానించి.. 37 కోట్ల మందితో కొత్త బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు ప్రధాని వివరించారు.

భారత్​కు రండి

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్‌ మరింత సరళతరంగా మారుతుందని తెలిపారు ప్రధాని. ఆర్థిక వ్యవస్థను సరళీకరిస్తూ.. ఇటీవల తమ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను ప్రస్తావించారు మోదీ. ఫలితంగా భారత కంపెనీల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. అమెరికా సంస్థలు భారత్​లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు మోదీ. అలాగే కుటుంబంతో సహా భారత్​ను సందర్శించాలని ఆయన ట్రంప్​ను కోరారు.

SHOTLIST:
++CLIENTS NOTE: VIDEO ONLY - SHOTLIST AND STORYLINE TO FOLLOW AS SOON AS POSSIBLE++
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.