ETV Bharat / bharat

'రైతులకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసింది'

కేంద్రంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు రాహుల్​ గాంధీ. దేశంలో ఆహార భద్రత కల్పిస్తున్న రైతులకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని కాంగ్రెస్​ నేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

author img

By

Published : Oct 13, 2020, 7:32 PM IST

Modi govt 'betrayed' farmers: Rahul slams Centre on farm laws
'రైతులకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేస్తుంది'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. నూతన వ్యవసాయ చట్టాలను ఉద్దేశించి మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న రైతులను కేంద్రం దారుణంగా మోసం చేసిందని ట్వీట్​ చేశారు.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇటీవలే పంజాబ్​, హరియాణాల్లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు రాహుల్​. ఇందుకు సంబంధించి రూపొందించిన ఓ వీడియోను తన ట్వీట్​లో ట్యాగ్​ చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత​. 'రైతులు దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్నారు. కానీ మోదీ ప్రభుత్వం వారికి ద్రోహం చేసింది. ఇకపై అలా జరగదు,' అని వ్యాఖ్యానించారు రాహుల్​​.

నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతారని.. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేందుకు మోదీ ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే చట్టాలను కేంద్రం సమర్థించుకుంది. రైతుల ఆదాయాన్నిపెంచడానికి ఇవి తోడ్పడతాయని పేర్కొంది.

ఇదీ చూడండి: టీకా లభ్యత, పంపిణీ వ్యూహాలపై కేంద్ర మంత్రుల భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శల దాడి కొనసాగించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ. నూతన వ్యవసాయ చట్టాలను ఉద్దేశించి మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న రైతులను కేంద్రం దారుణంగా మోసం చేసిందని ట్వీట్​ చేశారు.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇటీవలే పంజాబ్​, హరియాణాల్లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు రాహుల్​. ఇందుకు సంబంధించి రూపొందించిన ఓ వీడియోను తన ట్వీట్​లో ట్యాగ్​ చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత​. 'రైతులు దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్నారు. కానీ మోదీ ప్రభుత్వం వారికి ద్రోహం చేసింది. ఇకపై అలా జరగదు,' అని వ్యాఖ్యానించారు రాహుల్​​.

నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతారని.. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేందుకు మోదీ ప్రభుత్వం వీటిని ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే చట్టాలను కేంద్రం సమర్థించుకుంది. రైతుల ఆదాయాన్నిపెంచడానికి ఇవి తోడ్పడతాయని పేర్కొంది.

ఇదీ చూడండి: టీకా లభ్యత, పంపిణీ వ్యూహాలపై కేంద్ర మంత్రుల భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.