ETV Bharat / bharat

'ప్రభుత్వానికి తక్కువ- ప్రైవేటీకరణకు ఎక్కువ'

author img

By

Published : Sep 5, 2020, 4:48 PM IST

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను కేంద్రం నిలిపివేసిన నేపథ్యంలో మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ. యువత భవిష్యత్తును తన సన్నిహితులకు మోదీ దోచిపెడుతున్నారన్నారు.

Modi dispensation's thinking -- minimum govt, maximum privatisation: Rahul Gandhi
'కనిష్ఠంగా ప్రభుత్వం-గరిష్ఠంగా ప్రైవేటీకరణ: మోదీ విధానం'

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. 'ప్రభుత్వానికి తక్కువ-ప్రైవేటీకరణకు ఎక్కువ' అన్న విధంగా మోదీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనను నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ట్విట్టర్​ వేదికగా మోదీ సర్కారుపై మండిపడ్డారు రాహుల్​.

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను నిలిపివేసిందనే మీడియా కథనాన్ని తన ట్వీట్​కు ట్యాగ్​ చేశారు రాహుల్​. ​'ప్రభుత్వ కార్యాలయాల్లో శాశ్వత సిబ్బంది లేకుండా చేయడానికి మహమ్మారిని సాకుగా చూపిస్తున్నారు. యువత భవిష్యత్​ను తన సన్నిహితులకు దోచిపెట్టాలని చూస్తున్నారు.' అని రాహుల్​ ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. 'ప్రభుత్వానికి తక్కువ-ప్రైవేటీకరణకు ఎక్కువ' అన్న విధంగా మోదీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనను నిలిపివేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ట్విట్టర్​ వేదికగా మోదీ సర్కారుపై మండిపడ్డారు రాహుల్​.

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను నిలిపివేసిందనే మీడియా కథనాన్ని తన ట్వీట్​కు ట్యాగ్​ చేశారు రాహుల్​. ​'ప్రభుత్వ కార్యాలయాల్లో శాశ్వత సిబ్బంది లేకుండా చేయడానికి మహమ్మారిని సాకుగా చూపిస్తున్నారు. యువత భవిష్యత్​ను తన సన్నిహితులకు దోచిపెట్టాలని చూస్తున్నారు.' అని రాహుల్​ ఆరోపించారు.

ఇదీ చూడండి: 'బాబ్రీ' పరిమాణంలోనే అయోధ్య మసీదు: ఐఐసీఎఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.