ETV Bharat / bharat

నక్సల్స్​ కుట్ర భగ్నం- భారీగా ఆయుధాలు స్వాధీనం

author img

By

Published : Jul 2, 2020, 6:07 PM IST

ఒడిశాలో మావోయిస్టుల​ కుట్రను భగ్నం చేశాయి భద్రతా బలగాలు. కందమాల్​ జిల్లాలోని సమర్బంధ్​ గ్రామ సమీపంలోని అడవిలో ఏర్పాటు చేసుకున్న స్థావరాలను ధ్వంసం చేశాయి. క్యాంపు నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే.. బలగాల రాకను గమనించిన మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు అధికారులు.

Maoist camp busted in Odisha's Kandhamal district
మావోయిస్ట్​ కుట్ర భగ్నం

ఒడిశా కందమాల్​ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న సీపీఐ(మావోయిస్ట్​) స్థావరాన్ని ధ్వంసం చేశాయి భద్రతా బలగాలు. క్యాంపు నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్​ పోలీసు అధికారులు తెలిపారు. బలగాలు చేరుకునేసరికే అక్కడి నుంచి మావోయిస్టులు పారిపోయినట్లు వెల్లడించారు.

"అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికపై అందిన సమాచారం మేరకు ఒడిశా మావోయిస్టు అణచివేత దళాలకు చెందిన ప్రత్యేక బలగాలు (ఎల్​ఓజీ) కూంబింగ్​ నిర్వహించాయి. ఈ క్రమంలో ఫిరింగియా పోలీస్​స్టేషన్​ పరిధి సమర్బంధ్​ గ్రామానికి సమీపంలోని అటవీలో మావోయిస్టుల క్యాంపును గుర్తించారు. అక్కడ నుంచి 15 కిలోల పేలుడు పదార్థాలు, 28 డిటోనేటర్లు, ఐఈడీలు అమర్చేందుకు వినియోగించే టిఫిన్​ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు."

- ప్రతీక్​ సింగ్​, కందమాల్​ జిల్లా ఎస్పీ

స్థావరంలోని బ్యాగులు, బూట్లు, డాక్యుమెంట్లు, మావోయిస్టు రచనలకు సంబంధించిన పత్రాలనూ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎస్పీ. ఫిరింగియా పోలీస్​ స్టేషన్​ పరిధిలో గత రెండేళ్లుగా మావోయిస్టుల కదలికలు పెరిగాయన్నారు. వారిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. ఇటీవల సీపీఐ(మావోయిస్ట్​)కు చెందిన 15-20 మంది కేకేబీఎన్​ డివిజన్​ దస్సారు ప్రాంత కమిటీ సభ్యులు సమర్బంధ్​ గ్రామ సమీపంలో సమావేశమైనట్లు సమాచారం ఉందన్నారు.

Maoist camp busted in Odisha's Kandhamal district
మావోయిస్ట్​ స్థావరం వద్ద పడి ఉన్న వస్తువులు
Maoist camp busted in Odisha's Kandhamal district
ఐఈడీ అమర్చే టిఫిన్​ బాక్స్​
Maoist camp busted in Odisha's Kandhamal district
స్థావరంలో పేలుడు పదార్థాలు

ఇదీ చూడండి: టార్గెట్​ చైనా: భారత అమ్ముల పొదిలోకి మరిన్ని అస్త్రాలు

ఒడిశా కందమాల్​ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న సీపీఐ(మావోయిస్ట్​) స్థావరాన్ని ధ్వంసం చేశాయి భద్రతా బలగాలు. క్యాంపు నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్​ పోలీసు అధికారులు తెలిపారు. బలగాలు చేరుకునేసరికే అక్కడి నుంచి మావోయిస్టులు పారిపోయినట్లు వెల్లడించారు.

"అటవీ ప్రాంతంలో మావోయిస్టు కదలికపై అందిన సమాచారం మేరకు ఒడిశా మావోయిస్టు అణచివేత దళాలకు చెందిన ప్రత్యేక బలగాలు (ఎల్​ఓజీ) కూంబింగ్​ నిర్వహించాయి. ఈ క్రమంలో ఫిరింగియా పోలీస్​స్టేషన్​ పరిధి సమర్బంధ్​ గ్రామానికి సమీపంలోని అటవీలో మావోయిస్టుల క్యాంపును గుర్తించారు. అక్కడ నుంచి 15 కిలోల పేలుడు పదార్థాలు, 28 డిటోనేటర్లు, ఐఈడీలు అమర్చేందుకు వినియోగించే టిఫిన్​ బాక్సులు స్వాధీనం చేసుకున్నారు."

- ప్రతీక్​ సింగ్​, కందమాల్​ జిల్లా ఎస్పీ

స్థావరంలోని బ్యాగులు, బూట్లు, డాక్యుమెంట్లు, మావోయిస్టు రచనలకు సంబంధించిన పత్రాలనూ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎస్పీ. ఫిరింగియా పోలీస్​ స్టేషన్​ పరిధిలో గత రెండేళ్లుగా మావోయిస్టుల కదలికలు పెరిగాయన్నారు. వారిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు. ఇటీవల సీపీఐ(మావోయిస్ట్​)కు చెందిన 15-20 మంది కేకేబీఎన్​ డివిజన్​ దస్సారు ప్రాంత కమిటీ సభ్యులు సమర్బంధ్​ గ్రామ సమీపంలో సమావేశమైనట్లు సమాచారం ఉందన్నారు.

Maoist camp busted in Odisha's Kandhamal district
మావోయిస్ట్​ స్థావరం వద్ద పడి ఉన్న వస్తువులు
Maoist camp busted in Odisha's Kandhamal district
ఐఈడీ అమర్చే టిఫిన్​ బాక్స్​
Maoist camp busted in Odisha's Kandhamal district
స్థావరంలో పేలుడు పదార్థాలు

ఇదీ చూడండి: టార్గెట్​ చైనా: భారత అమ్ముల పొదిలోకి మరిన్ని అస్త్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.