ETV Bharat / bharat

బురదలో కూరుకుపోయి ప్రాణాలు విడిచిన 'గజరాజు'

author img

By

Published : Jul 18, 2020, 12:40 PM IST

Updated : Jul 18, 2020, 1:40 PM IST

దేశంలో ఇటీవల ఏనుగులు ప్రమాదాల బారిన పడి మృతి చెందుతున్న ఘటనలు పెరిగాయి. తాజాగా తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో ఓ ఏనుగు బురదలో చిక్కుకొని ప్రాణాలు విడిచింది.

Male Elephant dies after getting stuck in mud
బురదలో కూరుకుపోయి.. ప్రాణాలు విడిచిన గజరాజు
ఇటీవల అటవీ ఏనుగులు మృతి చెందుతున్న ఘటనలు పెరిగాయి. తాజాగా తమిళనాడు నీలగిరి అటవీ ప్రాంతంలో ఓ మగ ఏనుగు బురదలో కూరుకుపోయి మృతిచెందింది. శుక్రవారం రాత్రి గుడలూర్​ సమీపంలోని కాఫీ తోటలోకి ప్రవేశించిన గజరాజు.. బురద గుంటలో పడిపోయింది. దాని రెండు వెనుక కాళ్లు సుమారు 5 అడుగుల లోతైన మట్టిలో కూరుకుపోవడం వల్ల పైకి లేవలేక.. అక్కడే ప్రాణాలు కోల్పోయింది.

బురదలో ఇరుక్కున్న ఆ ఏనుగు.. తనను తాను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నమే చేసింది. కొన్ని గంటల పోరాటం తర్వాత ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. తక్షణమే అక్కడికి చేరుకున్న అధికారులు.. ఏనుగు మృతికి గల కారణాలను పరిశీలించారు. తీవ్ర ఆకలితో మరణించి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.

ఇదీ చదవండి: అపూర్వ స్నేహం: నిమిషమైనా విడిచి ఉండలేని వేదవతి

ఇటీవల అటవీ ఏనుగులు మృతి చెందుతున్న ఘటనలు పెరిగాయి. తాజాగా తమిళనాడు నీలగిరి అటవీ ప్రాంతంలో ఓ మగ ఏనుగు బురదలో కూరుకుపోయి మృతిచెందింది. శుక్రవారం రాత్రి గుడలూర్​ సమీపంలోని కాఫీ తోటలోకి ప్రవేశించిన గజరాజు.. బురద గుంటలో పడిపోయింది. దాని రెండు వెనుక కాళ్లు సుమారు 5 అడుగుల లోతైన మట్టిలో కూరుకుపోవడం వల్ల పైకి లేవలేక.. అక్కడే ప్రాణాలు కోల్పోయింది.

బురదలో ఇరుక్కున్న ఆ ఏనుగు.. తనను తాను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నమే చేసింది. కొన్ని గంటల పోరాటం తర్వాత ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. తక్షణమే అక్కడికి చేరుకున్న అధికారులు.. ఏనుగు మృతికి గల కారణాలను పరిశీలించారు. తీవ్ర ఆకలితో మరణించి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.

ఇదీ చదవండి: అపూర్వ స్నేహం: నిమిషమైనా విడిచి ఉండలేని వేదవతి

Last Updated : Jul 18, 2020, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.