ETV Bharat / bharat

లక్షల మంది 'చౌకీదార్ల'తో మోదీ మాటామంతీ

author img

By

Published : Mar 31, 2019, 12:00 PM IST

Updated : Mar 31, 2019, 1:03 PM IST

చౌకీదార్​ నినాదంతో సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది భాజపా. సాయంత్రం 5గంటలకు దిల్లీలో 'మై బీ చౌకీదార్​' పేరిట భారీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది.

లక్షల మంది 'చౌకీదార్ల'తో మోదీ మాటామంతీ
లక్షల మంది 'చౌకీదార్ల'తో మోదీ మాటామంతీ
చౌకీదార్...​ ఇప్పుడు ఏ భాజపా నాయకుడి ట్విట్టర్​ ఖాతా చూసినా ఇదే పేరు. కమలదళం నోట వచ్చే మాట 'మై బీ చౌకీదార్​.' కాంగ్రెస్​ విమర్శలను అస్త్రంగా మార్చుకున్న కాషాయదళం ఈ నినాదాన్ని ప్రజల్లో విస్త్రతం చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా ఈ సాయంత్రం 5 గంటలకు 'మై బీ చౌకిదార్​' పేరుతో దిల్లీలో ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది భాజపా. ఇందుకు తల్కతోర మైదానం ముస్తాబవుతోంది.

'మై బీ చౌకీదార్'​ నినాదానికి మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీనితో పాటు దేశంలోని 500 ప్రాంతాల్లో ఏకకాలంలో లక్షల మంది భారతీయులు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రధాని ప్రసంగాన్ని వీక్షించేందుకు భాజపా ఏర్పాట్లు చేసింది. వారిలో కొందరితో మోదీ స్వయంగా మాట్లాడతారు.

'మనం ఎదురుచూసిన రోజు వచ్చేసింది. ఈరోజ సాయంత్రం లక్షలాది చౌకీదారులు 'మై బీ చౌకీదార్'​ కార్యక్రమంలో భాగమవుతారు. యువత, నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నా. వీరే దేశానికి బలం. 21 శతాబ్దంలో వీరి శ్రమ వల్లే భారతదేశం ముందడుగు వేస్తోంది.'
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

లక్షల మంది 'చౌకీదార్ల'తో మోదీ మాటామంతీ
చౌకీదార్...​ ఇప్పుడు ఏ భాజపా నాయకుడి ట్విట్టర్​ ఖాతా చూసినా ఇదే పేరు. కమలదళం నోట వచ్చే మాట 'మై బీ చౌకీదార్​.' కాంగ్రెస్​ విమర్శలను అస్త్రంగా మార్చుకున్న కాషాయదళం ఈ నినాదాన్ని ప్రజల్లో విస్త్రతం చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా ఈ సాయంత్రం 5 గంటలకు 'మై బీ చౌకిదార్​' పేరుతో దిల్లీలో ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది భాజపా. ఇందుకు తల్కతోర మైదానం ముస్తాబవుతోంది.

'మై బీ చౌకీదార్'​ నినాదానికి మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దీనితో పాటు దేశంలోని 500 ప్రాంతాల్లో ఏకకాలంలో లక్షల మంది భారతీయులు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రధాని ప్రసంగాన్ని వీక్షించేందుకు భాజపా ఏర్పాట్లు చేసింది. వారిలో కొందరితో మోదీ స్వయంగా మాట్లాడతారు.

'మనం ఎదురుచూసిన రోజు వచ్చేసింది. ఈరోజ సాయంత్రం లక్షలాది చౌకీదారులు 'మై బీ చౌకీదార్'​ కార్యక్రమంలో భాగమవుతారు. యువత, నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నా. వీరే దేశానికి బలం. 21 శతాబ్దంలో వీరి శ్రమ వల్లే భారతదేశం ముందడుగు వేస్తోంది.'
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

Intro:Body:Conclusion:
Last Updated : Mar 31, 2019, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.