ETV Bharat / bharat

రైతన్నకు షాక్​.. రూ. 4.35 చెల్లించిన బీమా సంస్థ

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన ఓ రైతు.. గతేడాది 900 చెల్లించి ఓ కంపెనీలో పంట బీమా తీసుకున్నాడు. అకాల వర్షాలతో పంట చేతికందకపోవడం వల్ల బీమా మీదే ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ కంపెనీ రైతుకు రూ. 4.35 చెల్లించింది. దీంతో తాను మోసపోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

author img

By

Published : Jul 9, 2020, 11:36 AM IST

Maharashtra: Insurance company pays Rs 4.35 against crop insurance
రైతన్న ఆశలు ఆవిరి.. రూ. 4.35 చెల్లించిన బీమా సంస్థ

మహారాష్ట్రలో.. బీమా కింద ఓ కంపెనీ అమరావతి జిల్లా రైతుకు 4.35 రూపాయలు చెల్లించింది. దీనితో ఆ రైతు తీవ్ర దిగ్భ్రాంతి చెందాడు. మోసపోయానంటూ కన్నీరు పెట్టుకున్నాడు.

ఆశలు పెట్టుకుని...

70ఏళ్ల సాహెబ్​రావ్​ ధాలే రిధ్​పుర్​ గ్రామవాసి. ఆయనకు 5 ఎకరాల పొలం ఉంది. 2019లో రెండు పంటలు(పత్తి, సోయాబీన్​) వేశాడు. వీటికి ప్రధానమంత్రి ఫసల్​ బీమా యోజన కింద రూ. 900 చెల్లించి బీమా తీసుకున్నాడు.

అయితే గతేడాది మహారాష్ట్రను అకాల వర్షాలు కుదిపేశాయి. వేలాది ఎకరాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పంట చేతికందకపోవడం వల్ల.. ఆశలన్నీ బీమా మీదే పెట్టుకున్నాడు. కానీ ఆ కంపెనీ మాత్రం రైతుకు రూ. 4.35 ఇచ్చి పంపించింది. బీమా సంస్థ తనను మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సాహెబ్​రావ్​.

ఈ ఘటనపై జిల్లా వ్యవసాయ అధికారి విజయ్​ ఛాహ్లే స్పందించారు.

"పంట నష్టానికి సంబంధించి బీమా ప్రకటించినప్పటికీ.. మిగిలిన సొమ్మును ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విషయం తెలియక రైతులు ఆందోళన పడుతున్నారు. అందరికీ బీమా కింద కనీసం రూ. 1000 అందుతుంది."

--- విజయ్​ ఛాహ్లే, జిల్లా వ్యవసాయాధికారి.

రైతులకు నష్టం జరుగుతోందని రాష్ట్ర మాజీ వ్యవసాయమంత్రి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.

మహారాష్ట్రలో.. బీమా కింద ఓ కంపెనీ అమరావతి జిల్లా రైతుకు 4.35 రూపాయలు చెల్లించింది. దీనితో ఆ రైతు తీవ్ర దిగ్భ్రాంతి చెందాడు. మోసపోయానంటూ కన్నీరు పెట్టుకున్నాడు.

ఆశలు పెట్టుకుని...

70ఏళ్ల సాహెబ్​రావ్​ ధాలే రిధ్​పుర్​ గ్రామవాసి. ఆయనకు 5 ఎకరాల పొలం ఉంది. 2019లో రెండు పంటలు(పత్తి, సోయాబీన్​) వేశాడు. వీటికి ప్రధానమంత్రి ఫసల్​ బీమా యోజన కింద రూ. 900 చెల్లించి బీమా తీసుకున్నాడు.

అయితే గతేడాది మహారాష్ట్రను అకాల వర్షాలు కుదిపేశాయి. వేలాది ఎకరాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పంట చేతికందకపోవడం వల్ల.. ఆశలన్నీ బీమా మీదే పెట్టుకున్నాడు. కానీ ఆ కంపెనీ మాత్రం రైతుకు రూ. 4.35 ఇచ్చి పంపించింది. బీమా సంస్థ తనను మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సాహెబ్​రావ్​.

ఈ ఘటనపై జిల్లా వ్యవసాయ అధికారి విజయ్​ ఛాహ్లే స్పందించారు.

"పంట నష్టానికి సంబంధించి బీమా ప్రకటించినప్పటికీ.. మిగిలిన సొమ్మును ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విషయం తెలియక రైతులు ఆందోళన పడుతున్నారు. అందరికీ బీమా కింద కనీసం రూ. 1000 అందుతుంది."

--- విజయ్​ ఛాహ్లే, జిల్లా వ్యవసాయాధికారి.

రైతులకు నష్టం జరుగుతోందని రాష్ట్ర మాజీ వ్యవసాయమంత్రి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.