ETV Bharat / bharat

ఆవు-దూడకు 'మహా' పోలీసుల డీఎన్​ఏ పరీక్ష

author img

By

Published : Oct 8, 2020, 9:05 PM IST

మహారాష్ట్ర తానాజీ నగర్​కు చెందిన ఇద్దరు వ్యక్తుల మధ్య.. ఓ దూడపై యాజమాన్య హక్కుల గొడవ మొదలైంది. చివరికి అది పోలీస్​స్టేషన్​ వరకు వెళ్లింది. సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. దీంతో వారికి ఓ వింత సలహా ఇచ్చారు. ఆవుకు, దూడకు డీఎన్​ఏ పరీక్ష నిర్వహించి సమస్యను తేల్చుకోవాలన్నారు. ఇలా జంతువులకు డీఎన్​ఏ పరీక్ష చేయించడం చాలా అరుదైన ఘటన.

Maharashtra: DNA test on calf to determine ownership right
ఆవూ, దూడకి డీఎన్​ఏ టెస్ట్​ చేయండి:'మహా' పోలీసులు

మహారాష్ట్ర బుల్దానాలో వింత ఘటన జరిగింది. ఓ ఆవుకు, దూడకు డీఎన్​ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు ఆదేశించారు. దూడపై యాజమాన్య హక్కుల కోసం గొడవ మొదలవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు.

ఇదీ జరిగింది...

తానాజీ నగర్​కు చెందిన ప్రదీప్​ మోరే, అఫ్రోజ్​ బాగ్​భన్​లు.. మూడేళ్ల దూడపై యాజమాన్య హక్కుల గొడవతో పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు. ఆ దూడ 'నాదంటే నాదంటూ' వాదించుకున్నారు.

ప్రదీప్ మోర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. దూడ తన ఆవుకే పుట్టిందని తెల్చిచెప్పాడు. కొంతమందితో కలిసి బాగ్​భన్దూడను బలవంతంగా ట్రక్కులోకి ఎక్కించి తీసుకెళ్లడం తాను చూసినట్లు పేర్కొన్నాడు.

ఎంతకీ సమస్య కొలిక్కి రాకపోవడం వల్ల పోలీసులు ఓ పరీక్ష పెట్టారు. పెంచిన వ్యక్తిని చూస్తే తల్లీ,బిడ్డా పరిగెత్తుకుంటూ వస్తాయని.. ఎవరి దగ్గరికి వెళితే వారిదే అని నిర్ధరించుకోవచ్చని అనుకున్నారు. దూడ మోరేని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లింది. దీంతో ఆవు-దూడ అతనివే అని భావించారు. కానీ అందుకు బాగ్​భన్ అంగీకరించకపోవడం వల్ల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ఈ సమస్యను శాస్త్రీయంగా డీఎన్​ఏ పరీక్షతో తేల్చుకోవాలని సూచించారు పోలీసులు.

ఈ విషయంపై బుల్దానా పశుసంవర్ధక శాఖా అసిస్టెంట్​ కమిషనర్ సాలుంఖ​.. పోలీసులకు లేఖ రాశారు. ఆవు-దూడలను పంపితే డీఎన్​ఏ పరీక్షకు శాంపిల్స్​ తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానికంగా పరీక్షించే సౌకర్యం లేకపోవడం వల్ల హైదరాబాద్​ పంపాల్సి వస్తుందని తెలిపారు. ఐతే ఇది ఖర్చుతో కూడుకున్నదని స్పష్టం చేశారు. అయితే వచ్చే ఫలితంతో అసలు యజమాని ఎవరో తెలుస్తుందన్నారు.

మనుషులపై డీఎన్​ఏ పరీక్షలు జరపడం సర్వ సాధారణం. వారి తల్లిదండ్రులను నిర్ధరించేందుకు ఈ పరీక్షలు చేస్తారు. ఇలా జంతువులకు డీఎన్​ఏ పరీక్ష నిర్వహించడం చాలా అరుదు.

ఇదీ చూడండి: 'ప్రపంచానికి ఔషధ కర్మాగారంలా భారత్​'

మహారాష్ట్ర బుల్దానాలో వింత ఘటన జరిగింది. ఓ ఆవుకు, దూడకు డీఎన్​ఏ పరీక్ష నిర్వహించాలని పోలీసులు ఆదేశించారు. దూడపై యాజమాన్య హక్కుల కోసం గొడవ మొదలవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు.

ఇదీ జరిగింది...

తానాజీ నగర్​కు చెందిన ప్రదీప్​ మోరే, అఫ్రోజ్​ బాగ్​భన్​లు.. మూడేళ్ల దూడపై యాజమాన్య హక్కుల గొడవతో పోలీస్​ స్టేషన్​కు వెళ్లారు. ఆ దూడ 'నాదంటే నాదంటూ' వాదించుకున్నారు.

ప్రదీప్ మోర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. దూడ తన ఆవుకే పుట్టిందని తెల్చిచెప్పాడు. కొంతమందితో కలిసి బాగ్​భన్దూడను బలవంతంగా ట్రక్కులోకి ఎక్కించి తీసుకెళ్లడం తాను చూసినట్లు పేర్కొన్నాడు.

ఎంతకీ సమస్య కొలిక్కి రాకపోవడం వల్ల పోలీసులు ఓ పరీక్ష పెట్టారు. పెంచిన వ్యక్తిని చూస్తే తల్లీ,బిడ్డా పరిగెత్తుకుంటూ వస్తాయని.. ఎవరి దగ్గరికి వెళితే వారిదే అని నిర్ధరించుకోవచ్చని అనుకున్నారు. దూడ మోరేని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లింది. దీంతో ఆవు-దూడ అతనివే అని భావించారు. కానీ అందుకు బాగ్​భన్ అంగీకరించకపోవడం వల్ల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ఈ సమస్యను శాస్త్రీయంగా డీఎన్​ఏ పరీక్షతో తేల్చుకోవాలని సూచించారు పోలీసులు.

ఈ విషయంపై బుల్దానా పశుసంవర్ధక శాఖా అసిస్టెంట్​ కమిషనర్ సాలుంఖ​.. పోలీసులకు లేఖ రాశారు. ఆవు-దూడలను పంపితే డీఎన్​ఏ పరీక్షకు శాంపిల్స్​ తీసుకుంటామని పేర్కొన్నారు. స్థానికంగా పరీక్షించే సౌకర్యం లేకపోవడం వల్ల హైదరాబాద్​ పంపాల్సి వస్తుందని తెలిపారు. ఐతే ఇది ఖర్చుతో కూడుకున్నదని స్పష్టం చేశారు. అయితే వచ్చే ఫలితంతో అసలు యజమాని ఎవరో తెలుస్తుందన్నారు.

మనుషులపై డీఎన్​ఏ పరీక్షలు జరపడం సర్వ సాధారణం. వారి తల్లిదండ్రులను నిర్ధరించేందుకు ఈ పరీక్షలు చేస్తారు. ఇలా జంతువులకు డీఎన్​ఏ పరీక్ష నిర్వహించడం చాలా అరుదు.

ఇదీ చూడండి: 'ప్రపంచానికి ఔషధ కర్మాగారంలా భారత్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.