ETV Bharat / bharat

కరోనాపై యుద్ధానికి మహారాష్ట్ర కొత్త 'రాపిడ్' స్కెచ్

author img

By

Published : Apr 2, 2020, 6:34 PM IST

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాపిడ్ టెస్టులకు సిద్ధమయింది మహారాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి వెల్లడించారు. రక్తనమూనాలతో వేగంగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్రమోదీ అనుమతించారు.

MH-VIRUS
మహారాష్ట్ర

దేశంలో మిగతా రాష్ట్రాలకన్నా మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా 20 శాతం కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది ఠాక్రే ప్రభుత్వం. ఈ యుద్ధంలో తాజాగా మరో వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.

మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో నిర్ధరణ పరీక్షల్లో వేగం పెంచాలని మహా సర్కారు భావించింది. ఇందుకు అనుగుణంగా రాపిడ్ టెస్టులకు మొగ్గు చూపింది. రక్త నమూనాలతో ఒకే సారి భారీ సంఖ్యలో నిర్ధరణ పరీక్షలు చేపట్టనున్నట్లు తెలిపింది.

కేంద్రం అనుమతి..

మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్ర సర్కారు ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ థోపే తెలిపారు. ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ మేరకు అనుమతించినట్లు వెల్లడించారు.

"రాపిడ్ పరీక్షల్లో ముక్కు, నోరు స్రావాలకు బదులుగా రక్త నమూనాలను వినియోగిస్తాం. దీని ద్వారా 5 నిమిషాలలోపే ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు బాధితుడి శరీరం ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసిందా లేదా అన్న విషయమూ తెలుస్తుంది.

ఇందుకు ప్రధాని అనుమతి లభించింది. తొలుత రాపిడ్ టెస్టులకు కేంద్రం అనుమతి నిరాకరించింది. "

-రాజేశ్ థోపే, మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి

మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా జీఎస్టీకి సంబంధించి రాష్ట్రానికి బకాయిపడ్డ రూ. 16 వేల కోట్లను ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. మహారాష్ట్రలో ఉన్న 3.25 లక్షల మంది వలస కార్మికుల పరిస్థితిపై మోదీ ఆరా తీశారని థోపే తెలిపారు.

వారికి ఆహారంతో పాటు ఆశ్రయం, అవసరమైతే వినోదానికి టీవీలు అందించాలని సూచించినట్లు పేర్కొన్నారు. వైరస్ ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయాలన్నారని వెల్లడించారు. ఈ మేరకు 146 ప్రాంతాల్లో శానిటైజేషన్ చేస్తామని స్పష్టం చేశారు.

మర్కజ్ పర్యటకుల గురించి..

మహారాష్ట్ర నుంచి తబ్లిగీ జమాత్ కార్యక్రమాలకు 1,400 మంది వెళ్లినట్లు థోపే తెలిపారు. వీరిలో 1,300 మందిని గుర్తించామని.. మిగతా వారి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు.

ప్రత్యేకంగా 30 ఆసుపత్రులు..

ఇంకా కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు.. ప్రత్యేకంగా కొవిడ్​ బాధితులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రులను గుర్తించినట్లు తెలిపింది మహారాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మొత్తం 30 ఆసుపత్రుల్లో అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: కరోనాతో ముంబయి కళావిహీనం- పునర్వైభవం ఎప్పటికి?

దేశంలో మిగతా రాష్ట్రాలకన్నా మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దేశవ్యాప్తంగా 20 శాతం కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది ఠాక్రే ప్రభుత్వం. ఈ యుద్ధంలో తాజాగా మరో వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.

మహారాష్ట్రలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో నిర్ధరణ పరీక్షల్లో వేగం పెంచాలని మహా సర్కారు భావించింది. ఇందుకు అనుగుణంగా రాపిడ్ టెస్టులకు మొగ్గు చూపింది. రక్త నమూనాలతో ఒకే సారి భారీ సంఖ్యలో నిర్ధరణ పరీక్షలు చేపట్టనున్నట్లు తెలిపింది.

కేంద్రం అనుమతి..

మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్ర సర్కారు ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ థోపే తెలిపారు. ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ మేరకు అనుమతించినట్లు వెల్లడించారు.

"రాపిడ్ పరీక్షల్లో ముక్కు, నోరు స్రావాలకు బదులుగా రక్త నమూనాలను వినియోగిస్తాం. దీని ద్వారా 5 నిమిషాలలోపే ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు బాధితుడి శరీరం ప్రతిరోధకాలను ఉత్పత్తి చేసిందా లేదా అన్న విషయమూ తెలుస్తుంది.

ఇందుకు ప్రధాని అనుమతి లభించింది. తొలుత రాపిడ్ టెస్టులకు కేంద్రం అనుమతి నిరాకరించింది. "

-రాజేశ్ థోపే, మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి

మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా జీఎస్టీకి సంబంధించి రాష్ట్రానికి బకాయిపడ్డ రూ. 16 వేల కోట్లను ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. మహారాష్ట్రలో ఉన్న 3.25 లక్షల మంది వలస కార్మికుల పరిస్థితిపై మోదీ ఆరా తీశారని థోపే తెలిపారు.

వారికి ఆహారంతో పాటు ఆశ్రయం, అవసరమైతే వినోదానికి టీవీలు అందించాలని సూచించినట్లు పేర్కొన్నారు. వైరస్ ప్రభావిత ప్రాంతాలను శుభ్రం చేయాలన్నారని వెల్లడించారు. ఈ మేరకు 146 ప్రాంతాల్లో శానిటైజేషన్ చేస్తామని స్పష్టం చేశారు.

మర్కజ్ పర్యటకుల గురించి..

మహారాష్ట్ర నుంచి తబ్లిగీ జమాత్ కార్యక్రమాలకు 1,400 మంది వెళ్లినట్లు థోపే తెలిపారు. వీరిలో 1,300 మందిని గుర్తించామని.. మిగతా వారి వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు.

ప్రత్యేకంగా 30 ఆసుపత్రులు..

ఇంకా కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు.. ప్రత్యేకంగా కొవిడ్​ బాధితులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రులను గుర్తించినట్లు తెలిపింది మహారాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మొత్తం 30 ఆసుపత్రుల్లో అందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: కరోనాతో ముంబయి కళావిహీనం- పునర్వైభవం ఎప్పటికి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.