ETV Bharat / bharat

మధ్యప్రదేశ్: భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి

author img

By

Published : Aug 26, 2020, 11:07 AM IST

మధ్యప్రదేశ్​లో మంగళవారం రెండంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 16 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

Madhya Pradesh: 2 died, 16 rescued in Dewas building collapse incident
మధ్యప్రదేశ్​లో భవనం కూలిన ఘటనలో 2 మృతి

మధ్యప్రదేశ్​- దేవాస్​లో మంగళవారం సాయంత్రం రెండంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 16 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న సహాయక సిబ్బంది

లాల్​ గేట్​ సమీపంలో గల స్టేషన్​ రోడ్డు వద్ద సంభవించిన ఈ ప్రమాదంలో ఇంకా దాదాపు 12 మందికిపైగా శిథిలాల్లో చిక్కుకున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

రెండు మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షాల వల్లే భవనం కూలి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: 'మహా' భవనం కూలిన ఘటనలో 16కు చేరిన మృతులు

మధ్యప్రదేశ్​- దేవాస్​లో మంగళవారం సాయంత్రం రెండంతస్తుల భవనం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 16 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న సహాయక సిబ్బంది

లాల్​ గేట్​ సమీపంలో గల స్టేషన్​ రోడ్డు వద్ద సంభవించిన ఈ ప్రమాదంలో ఇంకా దాదాపు 12 మందికిపైగా శిథిలాల్లో చిక్కుకున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

రెండు మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షాల వల్లే భవనం కూలి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: 'మహా' భవనం కూలిన ఘటనలో 16కు చేరిన మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.