ETV Bharat / bharat

వీడియోకాల్​లోనే భర్త అంత్యక్రియలకు హాజరు!

author img

By

Published : Apr 19, 2020, 7:02 AM IST

ఊహించని ఉప్పెనలా విలయతాండవం చేస్తోన్న కరోనా కారణంగా దేశంలో ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో చాలామంది గడ్డు పరిస్థితుల్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ తన భర్త చనిపోతే కనీసం అంత్యక్రియలకూ నోచుకోని పరిస్థితి తలెత్తింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Lockdown: Woman attends husband's funeral through video call
వీడియోకాల్​లోనే భర్త అంత్యక్రియలకు హాజరు!

మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన భర్త కడసారి చూపులకు నోచుకోని ఆ మహిళ.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది.

సింధ్​దుర్గ్​ జిల్లా, దోడామార్గ్​లోని మోర్లే గ్రామంలో నివాసముంటున్నారు వాసంతి బండేకర్, చంద్రకాంత్ దంపతులు. తన కుమారుడు అమిత్​ను చూసేందుకు కొద్దిరోజుల క్రితం ముంబయి వెళ్లారు చంద్రకాంత్. అయితే.. అనారోగ్యం కారణంగా మార్చి 22న అక్కడే ఆస్పత్రిలో చేరగా అమిత్​ తండ్రికి క్యాన్సర్​ అని తేలింది. చికిత్స పొందుతూ ఈ నెల 16న మరణించారు.

లాక్​డౌన్​ ఎఫెక్ట్​...

ముంబయికి సుమారు 490 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసంతికి.. లాక్​డౌన్​ కారణంగా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారానే తన భర్త అంత్యక్రియలకు హాజరైంది. లాక్​డౌన్​ కారణంగా.. తన తండ్రిని సొంత గ్రామానికి, తల్లిని ముంబయికి తీసుకొచ్చే పరిస్థితి లేనందున ఇలా అంత్యక్రియలు నిర్వహించామని వాపోయాడు అమిత్​.

ఇదీ చదవండి: ఐఐటీ కాన్పుర్ కనిపెట్టిన ఈ పరికరంతో​ కరోనా కట్టడి!

మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తన భర్త కడసారి చూపులకు నోచుకోని ఆ మహిళ.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అంత్యక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది.

సింధ్​దుర్గ్​ జిల్లా, దోడామార్గ్​లోని మోర్లే గ్రామంలో నివాసముంటున్నారు వాసంతి బండేకర్, చంద్రకాంత్ దంపతులు. తన కుమారుడు అమిత్​ను చూసేందుకు కొద్దిరోజుల క్రితం ముంబయి వెళ్లారు చంద్రకాంత్. అయితే.. అనారోగ్యం కారణంగా మార్చి 22న అక్కడే ఆస్పత్రిలో చేరగా అమిత్​ తండ్రికి క్యాన్సర్​ అని తేలింది. చికిత్స పొందుతూ ఈ నెల 16న మరణించారు.

లాక్​డౌన్​ ఎఫెక్ట్​...

ముంబయికి సుమారు 490 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసంతికి.. లాక్​డౌన్​ కారణంగా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారానే తన భర్త అంత్యక్రియలకు హాజరైంది. లాక్​డౌన్​ కారణంగా.. తన తండ్రిని సొంత గ్రామానికి, తల్లిని ముంబయికి తీసుకొచ్చే పరిస్థితి లేనందున ఇలా అంత్యక్రియలు నిర్వహించామని వాపోయాడు అమిత్​.

ఇదీ చదవండి: ఐఐటీ కాన్పుర్ కనిపెట్టిన ఈ పరికరంతో​ కరోనా కట్టడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.