ETV Bharat / bharat

లాక్​డౌన్​ 5.0: ఈ నగరాలకే పరిమితం!

author img

By

Published : May 28, 2020, 7:53 AM IST

దేశంలో ఐదో విడత లాక్​డౌన్​ను కేవలం 11 నగరాలకే పరిమితం చేయవచ్చని తెలుస్తోంది. ఈ నెలఖారుతో లాక్​డౌన్​ 4.0 ముగియనున్న నేపథ్యంలో జూన్​ 1 నుంచి ఐదో విడత ప్రారంభమవుతుందని సమాచారం.

Lockdown 5.0
లాక్​డౌన్​ 5.0

దేశంలో లాక్​డౌన్​ 4.0 ఈ నెల 31తో తీరిపోనుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవటం వల్ల జూన్​ 1 నుంచి లాక్​డౌన్​ 5.0 తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తారని తెలుస్తోంది.

70 శాతం కేసులు..

దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న 11 నగరాలకే లాక్​డౌన్​ 5.0 అమలు చేయనున్నట్లు సమాచారం. దిల్లీ, ముంబయి, పుణె, ఠాణె, సూరత్, అహ్మదాబాద్, బెంగళూరు, ఇండోర్​, చెన్నై, జైపుర్, కోల్​కతా నగరాల్లో ఆంక్షలు కొనసాగిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మిగిలిన చోట్ల అనేక సడలింపులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

దేశం మొత్తం నమోదైన కేసుల్లో ఈ 11 నగరాల్లోనే 70 శాతం ఉన్నాయి.

ఇదీ చూడండి: దేశంలో తగ్గుతోన్న కరోనా సంక్రమణ వేగం!

దేశంలో లాక్​డౌన్​ 4.0 ఈ నెల 31తో తీరిపోనుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవటం వల్ల జూన్​ 1 నుంచి లాక్​డౌన్​ 5.0 తథ్యమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది కొన్ని ప్రాంతాలకే పరిమితం చేస్తారని తెలుస్తోంది.

70 శాతం కేసులు..

దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న 11 నగరాలకే లాక్​డౌన్​ 5.0 అమలు చేయనున్నట్లు సమాచారం. దిల్లీ, ముంబయి, పుణె, ఠాణె, సూరత్, అహ్మదాబాద్, బెంగళూరు, ఇండోర్​, చెన్నై, జైపుర్, కోల్​కతా నగరాల్లో ఆంక్షలు కొనసాగిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మిగిలిన చోట్ల అనేక సడలింపులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

దేశం మొత్తం నమోదైన కేసుల్లో ఈ 11 నగరాల్లోనే 70 శాతం ఉన్నాయి.

ఇదీ చూడండి: దేశంలో తగ్గుతోన్న కరోనా సంక్రమణ వేగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.