ETV Bharat / bharat

'లేఖలో నాయకత్వ మార్పును కోరలేదు'

author img

By

Published : Aug 29, 2020, 4:17 PM IST

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖపై పార్టీ సీనియర్ నేత జితిన్ ప్రసాద్​ స్పష్టతనిచ్చారు. నాయకత్వ మార్పు ఉద్దేశంతో లేఖ రాయలేదని తెలిపారు. మా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, పార్టీ అధినాయకత్వంపై పూర్తి నమ్మకం ఉందని వెల్లడించారు.

CONG-JITIN PRASADA-INTERVIEW
జితిన్ ప్రసాద

నాయకత్వ మార్పు ఉద్దేశంతో కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయలేదని సీనియర్ నాయకుడు జితిన్ ప్రసాద స్పష్టం చేశారు. ఆ లేఖ సారాంశాన్ని తప్పుగా చిత్రీకరించారని, కాంగ్రెస్ అధినాయకత్వంపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో మళ్లీ అంతర్యుద్ధం- కారణం ఆ 'లేఖ'!

కాంగ్రెస్​లో సంస్థాగత మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సోనియాకు లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో జితిన్ ఒకరు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ లేఖ వివాదంపై స్పందించారు.

"కాంగ్రెస్​కు పునరుజ్జీవం ఎలా తీసుకురావాలన్న ఉద్దేశంతో లేఖ రాశాం. పార్టీకి మళ్లీ పూర్వవైభవం రావాలని ఆకాంక్షించాం. అంతేకానీ, అధినాయకత్వాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఇదే విషయాన్ని చెప్పాను."

- జితిన్ ప్రసాద, కాంగ్రెస్ సీనియర్ నేత

ఇదీ చూడండి: 'సొంతపార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుంటారా?'

కాంగ్రెస్​ అధినాయకత్వం లక్ష్యంగా లేఖ రాశారని కొంతమంది పార్టీ నేతలు ఆరోపించారు. దీనిపై స్పందించిన జితిన్.. సోనియా, రాహుల్​ గాంధీపై పూర్తి విశ్వాసముందని అన్నారు. తనపై కూడా వాళ్లకు నమ్మకముందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సీనియర్లపై రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్​లో దుమారం!

డీసీసీ వ్యాఖ్యలపై..

సీనియర్లు రాసిన లేఖను ఉద్దేశించి లఖీంపుర్ ఖేరి డీసీసీ.. జితిన్​పై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. దీనిపై స్పందించిన జితిన్​.. స్థానికంగా నెలకొన్న విభేదాల కారణంగా ఇటువంటి సమస్యలు రావటం సహజమన్నారు​. ప్రజాస్వామిక పార్టీలో ఇవి సాధారణమని తెలిపారు. ఈ వివాదం ముగిసిందని, పాలన పరమైన విషయాలపై దృష్టిసారించాలని సోనియానే చెప్పినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'కాంగ్రెస్‌ వాదులైతే లేఖను స్వాగతిస్తారు'

నాయకత్వ మార్పు ఉద్దేశంతో కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాయలేదని సీనియర్ నాయకుడు జితిన్ ప్రసాద స్పష్టం చేశారు. ఆ లేఖ సారాంశాన్ని తప్పుగా చిత్రీకరించారని, కాంగ్రెస్ అధినాయకత్వంపై పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​లో మళ్లీ అంతర్యుద్ధం- కారణం ఆ 'లేఖ'!

కాంగ్రెస్​లో సంస్థాగత మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సోనియాకు లేఖ రాసిన 23 మంది సీనియర్ నేతల్లో జితిన్ ఒకరు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ లేఖ వివాదంపై స్పందించారు.

"కాంగ్రెస్​కు పునరుజ్జీవం ఎలా తీసుకురావాలన్న ఉద్దేశంతో లేఖ రాశాం. పార్టీకి మళ్లీ పూర్వవైభవం రావాలని ఆకాంక్షించాం. అంతేకానీ, అధినాయకత్వాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. వర్కింగ్ కమిటీ సమావేశంలోనూ ఇదే విషయాన్ని చెప్పాను."

- జితిన్ ప్రసాద, కాంగ్రెస్ సీనియర్ నేత

ఇదీ చూడండి: 'సొంతపార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుంటారా?'

కాంగ్రెస్​ అధినాయకత్వం లక్ష్యంగా లేఖ రాశారని కొంతమంది పార్టీ నేతలు ఆరోపించారు. దీనిపై స్పందించిన జితిన్.. సోనియా, రాహుల్​ గాంధీపై పూర్తి విశ్వాసముందని అన్నారు. తనపై కూడా వాళ్లకు నమ్మకముందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సీనియర్లపై రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్​లో దుమారం!

డీసీసీ వ్యాఖ్యలపై..

సీనియర్లు రాసిన లేఖను ఉద్దేశించి లఖీంపుర్ ఖేరి డీసీసీ.. జితిన్​పై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. దీనిపై స్పందించిన జితిన్​.. స్థానికంగా నెలకొన్న విభేదాల కారణంగా ఇటువంటి సమస్యలు రావటం సహజమన్నారు​. ప్రజాస్వామిక పార్టీలో ఇవి సాధారణమని తెలిపారు. ఈ వివాదం ముగిసిందని, పాలన పరమైన విషయాలపై దృష్టిసారించాలని సోనియానే చెప్పినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: 'కాంగ్రెస్‌ వాదులైతే లేఖను స్వాగతిస్తారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.