గ్యారేజీలో పడి ఉన్న పాత బస్సుతో పదిమందికి ఉపయోగపడేలా కర్ణాటక ఆర్టీసీ వినూత్న ఆలోచన చేసింది. కావాల్సిన మరమ్మతులు చేసి బస్సును పబ్లిక్ టాయిలెట్గా మార్చింది. మహిళల కోసమే దీనిని తయారు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ఈ సదుపాయాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావాడి గురువారం ప్రారంభించారు. దీన్ని బెంగళూరు మేజిస్టిక్ బస్టాండ్లో ఏర్పాటు చేశారు. పాడైన బస్సులను టాయిలెట్లుగా వినియోగించే అవకాశాన్ని ఆర్టీసీ పరిశీలిస్తోందని లక్ష్మణ్ తెలిపారు.
![KSRTC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ka-bng-1-ksrtc-women-bus-toilet-ka10012_27082020135248_2708f_1598516568_619_2708newsroom_1598526157_693.jpg)
సామాజిక బాధ్యత కింద..
ఈ 'స్త్రీ టాయిలెట్' ప్రాజెక్టుకు రూ.12 లక్షలు ఖర్చయినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఈ మొత్తాన్ని సామాజిక బాధ్యత కింద బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (బీఐఏఎల్) భరించినట్లు తెలిపింది.
![KSRTC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ka-bng-1-ksrtc-women-bus-toilet-ka10012_27082020135248_2708f_1598516568_125_2708newsroom_1598526157_739.jpg)
![KSRTC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ka-bng-1-ksrtc-women-bus-toilet-ka10012_27082020135248_2708f_1598516568_66_2708newsroom_1598526157_562.jpg)
"ఈ టాయిలెట్ బస్సులో సౌర విద్యుత్ను ఏర్పాటు చేశాం. సెన్సార్ లైట్లు, వాష్ బేసిన్, పిల్లలకు పాలు ఇచ్చే సౌకర్యంతో పాటు డైపర్లు, నాప్కిన్లు వంటి సదుపాయాలు కల్పించాం. ఇందులో 3 ఇండియన్ టాయిలెట్లు, 2 వెస్ట్రన్ టాయిలెట్లు ఉన్నాయి."
- ఆర్టీసీ ఆధికారి
ఇదీ చూడండి: 'నీట్, జేఈఈ రాసేందుకు విద్యార్థులు సుముఖం'