ETV Bharat / bharat

కేజ్రీవాల్​ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ! - Delhi Chief minister

ఈనెల 16న జరగబోయే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. ఈ మేరకు గురువారమే ప్రధానికి ఆహ్వానం పంపారు. దిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించే కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

Kejriwal invites PM Modi to his swearing-in ceremony
కేజ్రీవాల్​ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ!
author img

By

Published : Feb 14, 2020, 2:26 PM IST

Updated : Mar 1, 2020, 8:05 AM IST

దిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​. తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు కేజ్రీ. గురువారమే ప్రధానికి ఆహ్వానం పంపినట్లు ఆప్​ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇటీవల జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది 70 స్థానాలకు గాను 62 స్థానాలను కైవసం చేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ ఈనెల 16న ఆదివారం.. రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పూర్తి స్థాయి మంత్రివర్గం ప్రమాణం చేయనున్నట్లు పార్టీ స్పష్టం చేసింది. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించటం లేదని.. ప్రజల సమక్షంలోనే కేజ్రీ ప్రమాణం చేస్తారని ఆ పార్టీ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

ఇదీ చూడండి: 'ఎవరికీ ఆహ్వానం లేదు.. ప్రజల మధ్యే కేజ్రీ ప్రమాణం'

దిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ప్రమాణం చేయనున్నారు ఆమ్​ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​. తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు కేజ్రీ. గురువారమే ప్రధానికి ఆహ్వానం పంపినట్లు ఆప్​ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇటీవల జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది 70 స్థానాలకు గాను 62 స్థానాలను కైవసం చేసుకుంది. దిల్లీ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​ ఈనెల 16న ఆదివారం.. రాంలీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పూర్తి స్థాయి మంత్రివర్గం ప్రమాణం చేయనున్నట్లు పార్టీ స్పష్టం చేసింది. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

అయితే ఈ ప్రమాణ స్వీకారానికి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించటం లేదని.. ప్రజల సమక్షంలోనే కేజ్రీ ప్రమాణం చేస్తారని ఆ పార్టీ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

ఇదీ చూడండి: 'ఎవరికీ ఆహ్వానం లేదు.. ప్రజల మధ్యే కేజ్రీ ప్రమాణం'

Last Updated : Mar 1, 2020, 8:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.