ETV Bharat / bharat

కర్ణాటకలో ఒక్కరోజే 10 వేల మందికిపైగా డిశ్చార్జి

భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పలు రాష్ట్రాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇవాళ 21 వేల 907 కరోనా కేసులు వెలుగుచూశాయి. కర్ణాటకలో మరో 8,364 మంది కొవిడ్​ బారినపడ్డారు.

author img

By

Published : Sep 19, 2020, 8:56 PM IST

Updated : Sep 19, 2020, 11:03 PM IST

Karnataka reported 8,364 new COVID-19 cases
కర్ణాటకలో ఒక్కరోజే 10 వేల మందికిపైగా డిశ్చార్జి

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

మహారాష్ట్రలో మరో 21 వేల 907 మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసులు 11 లక్షల 88 వేలకు చేరాయి. మరో 425 మంది మరణించారు. మొత్తం 32 వేల 216 మంది చనిపోయారు.

కర్ణాటకలో ఇవాళ 8,364 మందికి వైరస్​ సోకింది. మరో 114 మంది చనిపోయారు. అయితే.. రికార్డు స్థాయిలో రాష్ట్రంలో ఒక్కరోజే 10 వేల 815 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 5 లక్షల 11 వేలు దాటింది. మొత్తం మృతుల సంఖ్య 7,922కు చేరింది.

  • మధ్యప్రదేశ్​, పంజాబ్​లో 2 వేల 600 కేసుల చొప్పున నమోదయ్యాయి.
  • తమిళనాడులో మరో 5 వేల 569 మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసులు 5 లక్షల 36 వేలు దాటాయి. ఇప్పటివరకు 8,751 మంది కొవిడ్​కు బలయ్యారు.
  • కొద్దిరోజులుగా పశ్చిమ్​ బంగాలో కేసులు తగ్గుతున్నాయి. ఇవాళ 3,188 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 56 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 4,298కి చేరింది.
  • ఉత్తరాఖండ్​లో శనివారం 2078 మంది వైరస్​ బారినపడ్డారు.

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది.

మహారాష్ట్రలో మరో 21 వేల 907 మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసులు 11 లక్షల 88 వేలకు చేరాయి. మరో 425 మంది మరణించారు. మొత్తం 32 వేల 216 మంది చనిపోయారు.

కర్ణాటకలో ఇవాళ 8,364 మందికి వైరస్​ సోకింది. మరో 114 మంది చనిపోయారు. అయితే.. రికార్డు స్థాయిలో రాష్ట్రంలో ఒక్కరోజే 10 వేల 815 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 5 లక్షల 11 వేలు దాటింది. మొత్తం మృతుల సంఖ్య 7,922కు చేరింది.

  • మధ్యప్రదేశ్​, పంజాబ్​లో 2 వేల 600 కేసుల చొప్పున నమోదయ్యాయి.
  • తమిళనాడులో మరో 5 వేల 569 మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసులు 5 లక్షల 36 వేలు దాటాయి. ఇప్పటివరకు 8,751 మంది కొవిడ్​కు బలయ్యారు.
  • కొద్దిరోజులుగా పశ్చిమ్​ బంగాలో కేసులు తగ్గుతున్నాయి. ఇవాళ 3,188 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 56 మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 4,298కి చేరింది.
  • ఉత్తరాఖండ్​లో శనివారం 2078 మంది వైరస్​ బారినపడ్డారు.
Last Updated : Sep 19, 2020, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.