కర్ణాటక చమరాజ్నగర్ జిల్లా గుండ్లుపేట్లో విషాద ఘటన జరిగింది. తన నాలుగేళ్ల కుమారుడిని, గర్భవతిగా ఉన్న భార్యను, తల్లిదండ్రులను తుపాకీతో నుదిటిపై కాల్చి చంపాడు ఓ వ్యక్తి. ఆపై తాను గొంతులో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
అప్పులు, వ్యాపారంలో నష్టాల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రకాశ్ భట్టాచార్య మనస్తాపంతోనే ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.
మైసూరుకు చెందిన ఓం ప్రకాశ్.. గురువారం సాయంత్రం స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గుండ్లుపేట్లోని రిసార్టుకు వెళ్లారు. శుక్రవారం ఉదయం 3గంటలకు సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఈ ఘటనకు పాల్పడ్డారు.
ఇదీ చూడండి: 'కశ్మీర్'సంబంధిత పిటిషన్లపై సుప్రీం విచారణ వాయిదా