ETV Bharat / bharat

గిరిరాజ్ స్కూల్ పిల్లాడిలా మాట్లాడుతున్నారు : కన్నయ్య

కేంద్రమంత్రి గిరిరాజ్​ సింగ్ తనపై పోటీ చేయడానికి అయిష్టత వ్యక్తం చేస్తుండటంపై వ్యంగ్యాస్త్త్రాలు సంధించారు కన్నయ్య కుమార్. బెగూసరాయ్ లోక్​సభ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు జవహర్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం నేత కన్నయ్య.

author img

By

Published : Mar 26, 2019, 7:30 PM IST

గిరిరాజ్​పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన కన్నయ్య
గిరిరాజ్​పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన కన్నయ్య
కేంద్రమంత్రి గిరిరాజ్ వ్యవహారశైలి.. బడికి వెళ్లనని మారాంచేసే పిల్లాడి చందంగా ఉందని కన్నయ్యకుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బెగూసరాయ్ నుంచి సీపీఐ తరఫున లోక్​సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కన్నయ్యకుమార్. 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోదీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్​కు వెళ్లాలన్న గిరిరాజ్ వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ వాగ్బాణాల్ని సంధించారు.

"'టీవీలో ఈ వార్త చూసి ఆశ్చర్యానికి లోనయ్యా. ప్రజలను ఖర్చు లేకుండా పాకిస్థాన్​కు పంపటంలో ఆయన నిమగ్నమయ్యారు. ఈ కారణంగానే బెగూసరాయ్​లో ప్రచారానికి రావడం లేదు." -కన్నయ్యకుమార్, బెగూసరాయ్​ సీపీఐ అభ్యర్థి.

పట్నాలో మార్చి 9న జరిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్​షోకు హాజరు కాని వారిని దేశ ద్రోహులుగా ప్రకటించాలంటూ హాస్యోక్తులు విసిరారు కన్నయ్య. టీవీ ఛానెళ్లలోని భాజపా అనుకూల చర్చలు, వార్తలు వాస్తవం కాదన్నారు. రోడ్​షోల్లో మోదీకి లభిస్తున్న ఆదరణే సిసలైన వాస్తవమన్నారు కన్నయ్య.

గిరిరాజ్ సింగ్ ప్రస్తుతం నవాడా ఎంపీగా కొనసాగుతున్నారు. భాజపా అధిష్ఠానం ఈసారి ఎన్నికల్లో ఆయనను నవాడా నుంచి కాక బెగూసరాయ్ నుంచి పోటీ చేయాలని సూచించింది.

గిరిరాజ్ అసంతృప్తి

బెగూసరాయ్​ నుంచి పోటీ చేయాలని పార్టీ కోరిన విషయంపై ఓ ముఖాముఖిలో స్పందించారు గిరిరాజ్​సింగ్. నవాడాలో పోటీ చేయడం తన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. 2014లో బెగూసరాయ్ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటే అధిష్ఠానం తనను నవాడా నుంచి పోటీ చేయించిందని గుర్తు చేశారు. పార్టీ కేంద్ర నాయకత్వంతో తనకెటువంటి విభేదాలు లేవని, రాష్ట్ర నేతలే నవాడా సీటు విషయంలో మోసం చేశారని వ్యాఖ్యానించారు.

వామపక్షాలకు పట్టుగొమ్మ బెగూసరాయ్

"మాస్కో ఆఫ్ బిహార్​" అనే పేరు పొందిన బెగూసరాయ్​... వామపక్షాలకు పట్టున్న స్థానం. 2014లో మొదటిసారిగా ఈ స్థానాన్ని భాజపా కైవసం చేసుకుంది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ బోలాసింగ్ గత 2018 అక్టోబర్​లో మృతి చెందినప్పటి నుంచి ఖాళీగానే ఉంది.

దేశద్రోహం ఆరోపణలతో వెలుగులోకి..

దేశ విద్రోహ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దిల్లీలోని జవహర్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేత కన్నయ్య మొదటిసారి వెలుగులోకొచ్చారు. ఈ ఘటనపై అప్పట్లో ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో కన్నయ్య జైలుశిక్షనూ అనుభవించారు.

ఇద్దరూ ఒకే సామాజిక వర్గం

గిరిరాజ్ సింగ్, కన్నయ్యకుమార్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. మహాకూటమి అభ్యర్థి పోటీలో నిలువలేకపోతే ఇరునేతల మధ్య హోరాహోరీ జరిగే అవకాశం ఉంది.

గిరిరాజ్​పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన కన్నయ్య
కేంద్రమంత్రి గిరిరాజ్ వ్యవహారశైలి.. బడికి వెళ్లనని మారాంచేసే పిల్లాడి చందంగా ఉందని కన్నయ్యకుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బెగూసరాయ్ నుంచి సీపీఐ తరఫున లోక్​సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కన్నయ్యకుమార్. 2014 ఎన్నికలకు ముందు నరేంద్రమోదీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్​కు వెళ్లాలన్న గిరిరాజ్ వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ వాగ్బాణాల్ని సంధించారు.

"'టీవీలో ఈ వార్త చూసి ఆశ్చర్యానికి లోనయ్యా. ప్రజలను ఖర్చు లేకుండా పాకిస్థాన్​కు పంపటంలో ఆయన నిమగ్నమయ్యారు. ఈ కారణంగానే బెగూసరాయ్​లో ప్రచారానికి రావడం లేదు." -కన్నయ్యకుమార్, బెగూసరాయ్​ సీపీఐ అభ్యర్థి.

పట్నాలో మార్చి 9న జరిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్​షోకు హాజరు కాని వారిని దేశ ద్రోహులుగా ప్రకటించాలంటూ హాస్యోక్తులు విసిరారు కన్నయ్య. టీవీ ఛానెళ్లలోని భాజపా అనుకూల చర్చలు, వార్తలు వాస్తవం కాదన్నారు. రోడ్​షోల్లో మోదీకి లభిస్తున్న ఆదరణే సిసలైన వాస్తవమన్నారు కన్నయ్య.

గిరిరాజ్ సింగ్ ప్రస్తుతం నవాడా ఎంపీగా కొనసాగుతున్నారు. భాజపా అధిష్ఠానం ఈసారి ఎన్నికల్లో ఆయనను నవాడా నుంచి కాక బెగూసరాయ్ నుంచి పోటీ చేయాలని సూచించింది.

గిరిరాజ్ అసంతృప్తి

బెగూసరాయ్​ నుంచి పోటీ చేయాలని పార్టీ కోరిన విషయంపై ఓ ముఖాముఖిలో స్పందించారు గిరిరాజ్​సింగ్. నవాడాలో పోటీ చేయడం తన ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. 2014లో బెగూసరాయ్ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటే అధిష్ఠానం తనను నవాడా నుంచి పోటీ చేయించిందని గుర్తు చేశారు. పార్టీ కేంద్ర నాయకత్వంతో తనకెటువంటి విభేదాలు లేవని, రాష్ట్ర నేతలే నవాడా సీటు విషయంలో మోసం చేశారని వ్యాఖ్యానించారు.

వామపక్షాలకు పట్టుగొమ్మ బెగూసరాయ్

"మాస్కో ఆఫ్ బిహార్​" అనే పేరు పొందిన బెగూసరాయ్​... వామపక్షాలకు పట్టున్న స్థానం. 2014లో మొదటిసారిగా ఈ స్థానాన్ని భాజపా కైవసం చేసుకుంది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ బోలాసింగ్ గత 2018 అక్టోబర్​లో మృతి చెందినప్పటి నుంచి ఖాళీగానే ఉంది.

దేశద్రోహం ఆరోపణలతో వెలుగులోకి..

దేశ విద్రోహ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో దిల్లీలోని జవహర్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నేత కన్నయ్య మొదటిసారి వెలుగులోకొచ్చారు. ఈ ఘటనపై అప్పట్లో ఆయనపై రాజద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో కన్నయ్య జైలుశిక్షనూ అనుభవించారు.

ఇద్దరూ ఒకే సామాజిక వర్గం

గిరిరాజ్ సింగ్, కన్నయ్యకుమార్ ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. మహాకూటమి అభ్యర్థి పోటీలో నిలువలేకపోతే ఇరునేతల మధ్య హోరాహోరీ జరిగే అవకాశం ఉంది.

AP Video Delivery Log - 0700 GMT News
Tuesday, 26 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0638: US Boeing Grounded Planes No access USA 4202802
Southwest store grounded planes near LA
AP-APTN-0609: Mideast Airstrikes AP Clients Only 4202799
Israeli aircraft bomb targets across Gaza Strip
AP-APTN-0551: US Missile Defence Test AP Clients Only 4202796
Pentagon: successful missile defence test
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.