ETV Bharat / bharat

కర్​'నాటక' భయం: కమల్​నాథ్ ముందు​ జాగ్రత్తలు

మధ్యప్రదేశ్​లో శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్థిక బిల్లుల విషయంలో ఓటింగ్ పెట్టించాలని భాజపా యోచిస్తోంది. కాషాయ పార్టీ వ్యూహం ఫలిస్తే... అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది. అందువల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలనూ, బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్రులను సమావేశాలకు కచ్చితంగా హాజరుకావాలని ముఖ్యమంత్రి కమల్​నాథ్ ఆదేశించారు.

author img

By

Published : Jul 10, 2019, 6:01 AM IST

Updated : Jul 10, 2019, 7:23 AM IST

కర్ణాటకలా కాకుండా కమల్​నాథ్ ముందు​ జాగ్రత్తలు..!

కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి రాజకీయ సెగ తన ప్రభుత్వానికి తగలకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్​నాథ్​.

మధ్యప్రదేశ్​లో 7 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. స్వల్ప మెజారిటీతో ముఖ్యమంత్రి కమల్​నాథ్​ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. భాజపా నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా తన రాజకీయ చతురతతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు.

బీజేపీ ఎత్తులు చిత్తు చేయాలి..

మధ్యప్రదేశ్​లో జులై 8 నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. 19 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో...... ఆర్థిక బిల్లుల విషయంలో భాజపా డివిజన్​ తీసుకువచ్చి... ఓటింగ్ పెట్టమని డిమాండ్ చేయవచ్చు. ఇందులో నెగ్గుకురావాలంటే అసెంబ్లీలో ప్రభుత్వానికి సంఖ్యాబలం తప్పనిసరి. లేకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుంది.

అందువల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అలాగే తనకు మద్దతుగా నిలిచిన బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజధాని విడిచిపోకూడదని కమల్​నాథ్ స్పష్టం చేశారు.

బహుజన్ సమాజ్​ పార్టీ (బీఎస్పీ)... మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వానికి తన మద్దతును పునరుద్ధరించింది. ఇది కమల్​నాథ్​ ప్రభుత్వానికి శుభవార్త.

నీచ రాజకీయాలు..!

సంఖ్యాబలం లేకున్నా భాజపా నీచ రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఆర్థికమంత్రి తరుణ్ భానోత్ ఆరోపించారు. అయితే భాజపా పాచికలు పారవన్నారు.

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్, మిత్రపక్షాలు ఐక్యంగా ఉన్నందున భాజపా ఏమీ చేయలేదని భానోత్ అన్నారు.

భాజపా ఎత్తులు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి భాజపా కూడా వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో భాజపా ఎమ్మెల్యేలు అందరూ తప్పక హాజరు కావాలని ప్రతిపక్షనేత గోపాల్​ భార్గవ, భాజపా చీఫ్​ రాకేశ్​ సింగ్ సూచించారు.

లోక్​సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్​లోని 29 స్థానాల్లో భాజపా 28 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో భాజపా నేత గోపాల్​ భార్గవ మే నెలలో గవర్నర్​ ఆనందీబెన్​కు ఓ లేఖ రాశారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఫ్లోర్ టెస్ట్ చేయాలని కోరారు.

ఆర్థిక బిల్లుల విషయంలో డివిజన్​ పెట్టి ఓటింగ్ నిర్వహించాలని భాజపా భావిస్తోంది. అప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి శాసనసభలో ఎంత బలముందో తేలిపోతుందని గోపాల్ భార్గవ అభిప్రాయపడ్డారు. ఆర్థిక బిల్లులను నెగ్గించుకోవడంలో విఫలమైతే... ప్రభుత్వం కూలుతుందని గోపాల్ భార్గవ స్పష్టం చేశారు.

ఇదీ విషయం..

2018 మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాలకుగాను కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుంది. మేజిక్ నెంబర్ 116కు కేవలం 2 స్థానాల దూరంలో నిలిచిపోయింది. అయితే బీఎస్పీ నుంచి ఇద్దరు, సమాజ్​వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి ఒకరు, నలుగురు స్వతంత్రులు.... కమల్​నాథ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.

109 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న భాజపా... 15 ఏళ్ల తరువాత మధ్యప్రదేశ్​లో అధికారాన్ని కోల్పోయింది.

ఇదీ చూడండి: భారత్​పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ గుస్సా

కర్ణాటకలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా కాంగ్రెస్- జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి రాజకీయ సెగ తన ప్రభుత్వానికి తగలకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్​నాథ్​.

మధ్యప్రదేశ్​లో 7 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. స్వల్ప మెజారిటీతో ముఖ్యమంత్రి కమల్​నాథ్​ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. భాజపా నుంచి ఎలాంటి ప్రమాదం లేకుండా తన రాజకీయ చతురతతో ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారు.

బీజేపీ ఎత్తులు చిత్తు చేయాలి..

మధ్యప్రదేశ్​లో జులై 8 నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. 19 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో...... ఆర్థిక బిల్లుల విషయంలో భాజపా డివిజన్​ తీసుకువచ్చి... ఓటింగ్ పెట్టమని డిమాండ్ చేయవచ్చు. ఇందులో నెగ్గుకురావాలంటే అసెంబ్లీలో ప్రభుత్వానికి సంఖ్యాబలం తప్పనిసరి. లేకపోతే ప్రభుత్వం కుప్పకూలుతుంది.

అందువల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అలాగే తనకు మద్దతుగా నిలిచిన బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజధాని విడిచిపోకూడదని కమల్​నాథ్ స్పష్టం చేశారు.

బహుజన్ సమాజ్​ పార్టీ (బీఎస్పీ)... మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వానికి తన మద్దతును పునరుద్ధరించింది. ఇది కమల్​నాథ్​ ప్రభుత్వానికి శుభవార్త.

నీచ రాజకీయాలు..!

సంఖ్యాబలం లేకున్నా భాజపా నీచ రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేత, రాష్ట్ర ఆర్థికమంత్రి తరుణ్ భానోత్ ఆరోపించారు. అయితే భాజపా పాచికలు పారవన్నారు.

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్, మిత్రపక్షాలు ఐక్యంగా ఉన్నందున భాజపా ఏమీ చేయలేదని భానోత్ అన్నారు.

భాజపా ఎత్తులు

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి భాజపా కూడా వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో భాజపా ఎమ్మెల్యేలు అందరూ తప్పక హాజరు కావాలని ప్రతిపక్షనేత గోపాల్​ భార్గవ, భాజపా చీఫ్​ రాకేశ్​ సింగ్ సూచించారు.

లోక్​సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్​లోని 29 స్థానాల్లో భాజపా 28 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో భాజపా నేత గోపాల్​ భార్గవ మే నెలలో గవర్నర్​ ఆనందీబెన్​కు ఓ లేఖ రాశారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఫ్లోర్ టెస్ట్ చేయాలని కోరారు.

ఆర్థిక బిల్లుల విషయంలో డివిజన్​ పెట్టి ఓటింగ్ నిర్వహించాలని భాజపా భావిస్తోంది. అప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి శాసనసభలో ఎంత బలముందో తేలిపోతుందని గోపాల్ భార్గవ అభిప్రాయపడ్డారు. ఆర్థిక బిల్లులను నెగ్గించుకోవడంలో విఫలమైతే... ప్రభుత్వం కూలుతుందని గోపాల్ భార్గవ స్పష్టం చేశారు.

ఇదీ విషయం..

2018 మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాలకుగాను కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుంది. మేజిక్ నెంబర్ 116కు కేవలం 2 స్థానాల దూరంలో నిలిచిపోయింది. అయితే బీఎస్పీ నుంచి ఇద్దరు, సమాజ్​వాదీ పార్టీ (ఎస్పీ) నుంచి ఒకరు, నలుగురు స్వతంత్రులు.... కమల్​నాథ్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.

109 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న భాజపా... 15 ఏళ్ల తరువాత మధ్యప్రదేశ్​లో అధికారాన్ని కోల్పోయింది.

ఇదీ చూడండి: భారత్​పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ గుస్సా

Gaya (Bihar), July 10 (ANI): At least six children's have died at Anugrah Narayan Magadh Medical College and Hospital (ANMMCH) in Bihar's Gaya since July 02 and cause could be encephalitis but, it is yet to be established. While speaking to ANI on this matter, Medical Superintendent of Gaya's ANMMCH, Dr VK Prasad said, "So far, 22 patients have been admitted. It is being stated they might be suffering from encephalitis but it has not been confirmed yet. Reports are awaited. The patients are being treated. Six have died." "Out of 13 suspected cases, three patients are in a critical condition, one patient has been found Japanese Encephalitis (JE) positive. There have been six deaths so far, their samples have been sent for testing, report is being awaited," he added. The death toll due to Acute Encephalitis Syndrome (AES) mounted to 142 in Muzaffarpur, the district which is facing a severe outbreak of the vector-borne disease since last one month. AES is a viral disease that causes flu-like symptoms such as high fever, vomiting and in extreme cases, brain dysfunction, seizure, and inflammation of heart and kidney.
Last Updated : Jul 10, 2019, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.