జమ్ముకశ్మీర్ బుద్గాం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. బుద్గాం జిల్లాలోని హరిబాగ్ మౌచ్వా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు మంగళవారం రాత్రి 9గంటల సమయంలో భద్రతాదళాలు, పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. ఈ పరిణామాలు ఎన్కౌంటర్కు దారితీశాయి.
![jammu -kashmir-encounter-two-militants-dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9337002_144_9337002_1603855475086.png)
![jammu -kashmir-encounter-two-militants-dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9337002_3.jpg)
![jammu -kashmir-encounter-two-militants-dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9337002_2.jpg)
సుమారు నాలుగు గంటల పాటు ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అయితే ముష్కరులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉగ్రవాదుల్లో ఒకరు విదేశీయుడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.