ETV Bharat / bharat

కశ్మీర్​: పోలీసులపై ఉగ్రదాడి- ఇద్దరు మృతి

author img

By

Published : Aug 14, 2020, 9:58 AM IST

Updated : Aug 14, 2020, 11:17 AM IST

Jammu and Kashmir:
కశ్మీర్​లో పోలీసులపై ఉగ్రవాదుల దాడి

11:02 August 14

ఘటన వెనుక జైషే హస్తం: ఐజీపీ

జమ్ముకశ్మీర్​లో పోలీసు బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్​ శివార్లలోని నౌగామ్​ వద్ద జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి.  

"శ్రీనగర్​ నౌగామ్ బైపాస్ వద్ద ఉదయం 9.15 గంటలకు అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించాం. అందులో ఇద్దరు మరణించారు."

-సీనియర్ పోలీసు అధికారి

మరణించిన ఇద్దరు పోలీసులను ఇష్ఫాక్ అహ్మద్, ఫయాజ్ అహ్మద్​లుగా గుర్తించారు.  

ఈ ఘటన వెనుక జైషే మహ్మద్ ఉగ్రసంస్థ హస్తం ఉందని కశ్మీర్ ఐజీపీ పేర్కొన్నారు. దాడి చేసిన ముష్కరులను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

నిఘా మరింత పెంపు

సంఘటన జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో అధికారులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. నగరంలో ప్రత్యేక చెక్​ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వాతంత్ర్య వేడుకలు జరిగే ప్రతీ చోట పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉగ్ర కదలికలపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.  

10:20 August 14

ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు

జమ్ముకశ్మీర్​లో పోలీసు బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్​ శివార్లలోని నౌగామ్​ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి.  

గాయపడ్డ ముగ్గురిని తొలుత ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేసినట్లు చెప్పారు. ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు..

స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

09:55 August 14

కశ్మీర్​లో పోలీసులపై ఉగ్రవాదుల దాడి

జమ్ముకశ్మీర్​లో పోలీసు బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్​ శివార్లలోని నౌగామ్​ వద్ద ఈ ఘటన జరిగింది. ముగ్గురు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం. 

11:02 August 14

ఘటన వెనుక జైషే హస్తం: ఐజీపీ

జమ్ముకశ్మీర్​లో పోలీసు బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్​ శివార్లలోని నౌగామ్​ వద్ద జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి.  

"శ్రీనగర్​ నౌగామ్ బైపాస్ వద్ద ఉదయం 9.15 గంటలకు అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించాం. అందులో ఇద్దరు మరణించారు."

-సీనియర్ పోలీసు అధికారి

మరణించిన ఇద్దరు పోలీసులను ఇష్ఫాక్ అహ్మద్, ఫయాజ్ అహ్మద్​లుగా గుర్తించారు.  

ఈ ఘటన వెనుక జైషే మహ్మద్ ఉగ్రసంస్థ హస్తం ఉందని కశ్మీర్ ఐజీపీ పేర్కొన్నారు. దాడి చేసిన ముష్కరులను త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

నిఘా మరింత పెంపు

సంఘటన జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో అధికారులు భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. నగరంలో ప్రత్యేక చెక్​ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్వాతంత్ర్య వేడుకలు జరిగే ప్రతీ చోట పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. భద్రతా దళాలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉగ్ర కదలికలపై నిఘా ఉంచాలని స్పష్టం చేశారు.  

10:20 August 14

ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు

జమ్ముకశ్మీర్​లో పోలీసు బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్​ శివార్లలోని నౌగామ్​ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు మరణించారు. మరొకరికి గాయాలయ్యాయి.  

గాయపడ్డ ముగ్గురిని తొలుత ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేసినట్లు చెప్పారు. ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు..

స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

09:55 August 14

కశ్మీర్​లో పోలీసులపై ఉగ్రవాదుల దాడి

జమ్ముకశ్మీర్​లో పోలీసు బృందంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్​ శివార్లలోని నౌగామ్​ వద్ద ఈ ఘటన జరిగింది. ముగ్గురు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం. 

Last Updated : Aug 14, 2020, 11:17 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.