ETV Bharat / bharat

'ఐటం' వ్యాఖ్యలపై కమల్​నాథ్​కు ఈసీ మందలింపు

మహిళా అభ్యర్థిపై వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ను ఈసీ మందలించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఈసీ సూచించింది. మరోవైపు.. కమల్​నాథ్, దిగ్విజయ్ సింగ్​ లక్ష్యంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు భాజపా నేత కైలాశ్ విజయ్​వర్గియాకు నోటీసులు జారీ చేసింది.

author img

By

Published : Oct 27, 2020, 5:42 AM IST

Item jibe: EC advises Kamal Nath not to use such words in campaigning
'ఐటం' వ్యాఖ్యలపై కమల్​నాథ్​కు ఊరట

మహిళా అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ను ఈసీ మందలించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. నియంత్రణతో వ్యవహరించాలని హితవు పలికింది

"ఓ మహిళను 'ఐటం' అని పేర్కొన్న కమల్​నాథ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. నియమావళి అమలులో ఉన్నప్పుడు ఇలాంటి పదాలు, వ్యాఖ్యలు బహిరంగంగా ఉపయోగించకూడదని కమల్​నాథ్​కు ఎన్నికల కమిషన్ సలహా ఇస్తోంది."

-ఈసీ

గతవారం గ్వాలియర్​లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా నేతను 'ఐటం' అని పేర్కొన్నారు కమల్​నాథ్. దీనిపై ఈసీ నోటీసులు జారీ చేయగా... భాజపా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని వివరణ ఇచ్చారు.

భాజపా నేతకు నోటీసులు

మరోవైపు భాజపా నేత కైలాశ్ విజయ్​వర్గియాకు ఈసీ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్​నాథ్​ లక్ష్యంగా చేసిన 'చున్ను-మున్ను' వ్యాఖ్యలపై వివరణ కోరింది. 48 గంటల్లోగా స్పందించాలని సోమవారం నోటీసులో పేర్కొంది.

అక్టోబర్ 14న ఇండోర్​లో జరిగిన ఎన్నికల ర్యాలీలో వర్గియా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఈసీ తన నోటీసులో వివరించింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు ఇచ్చింది.

మహిళా అభ్యర్థిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్​ను ఈసీ మందలించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. నియంత్రణతో వ్యవహరించాలని హితవు పలికింది

"ఓ మహిళను 'ఐటం' అని పేర్కొన్న కమల్​నాథ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. నియమావళి అమలులో ఉన్నప్పుడు ఇలాంటి పదాలు, వ్యాఖ్యలు బహిరంగంగా ఉపయోగించకూడదని కమల్​నాథ్​కు ఎన్నికల కమిషన్ సలహా ఇస్తోంది."

-ఈసీ

గతవారం గ్వాలియర్​లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా నేతను 'ఐటం' అని పేర్కొన్నారు కమల్​నాథ్. దీనిపై ఈసీ నోటీసులు జారీ చేయగా... భాజపా తన వ్యాఖ్యలను వక్రీకరించిందని వివరణ ఇచ్చారు.

భాజపా నేతకు నోటీసులు

మరోవైపు భాజపా నేత కైలాశ్ విజయ్​వర్గియాకు ఈసీ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, కమల్​నాథ్​ లక్ష్యంగా చేసిన 'చున్ను-మున్ను' వ్యాఖ్యలపై వివరణ కోరింది. 48 గంటల్లోగా స్పందించాలని సోమవారం నోటీసులో పేర్కొంది.

అక్టోబర్ 14న ఇండోర్​లో జరిగిన ఎన్నికల ర్యాలీలో వర్గియా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఈసీ తన నోటీసులో వివరించింది. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు ఇచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.