ETV Bharat / bharat

భారత్​ సత్తా: జాబిల్లిపై ఇళ్ల నిర్మాణానికి అంతరిక్ష ఇటుకలు

author img

By

Published : Feb 5, 2020, 6:41 AM IST

Updated : Feb 29, 2020, 5:42 AM IST

చందమామపై భవనాలు కట్టడమనేది ఓ కల అనుకునేవారు అంతా. కానీ ఇప్పుడు కాలం మారింది. ఆ కల నిజమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. 'ఎలా నిర్మిస్తారు. ఇక్కడి నుంచి ఇటుకలు, సిమెంటు బస్తాలు మోసుకెళ్తారా?' అని ఎద్దేవా చేసేవాళ్లకు సరైన సమాధానమిచ్చారు భారత శాస్త్రవేత్తలు. అంతరిక్ష ఇటుకలను రూపొందించి ప్రపంచ దేశాల మన్ననలు పొందుతున్నారు. మరి ఇస్రో, ఐఐఎస్​ సంయుక్తంగా తయారు చేసిన ఆ అంతరిక్ష ఇటుకల ప్రత్యేకతలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ISRO, IISc Bangalore develops space bricks for building igloos on Moon
భారత్​ సత్తా: జాబిల్లిపై ఇళ్ల నిర్మాణానికి అంతరిక్ష ఇటుకలు

చంద్రుడిపై ఇళ్లు నిర్మించాలని ప్రపంచ దేశాలు యోచిస్తున్నాయి. అయితే.. భూమిపై ఉపయోగించే నిర్మాణ పరికరాలు అంతరిక్షంలోకి తీసుకెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. మరి చందమామపై వ్యోమగాములు ఇళ్లు ఎలా చేస్తారన్నదే పెద్ద సవాలు. కానీ ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపించి.. మరోసారి ప్రపంచ దేశాలకు తన సత్తాను చాటిచెప్పింది భారత్​.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో), భారత వైజ్ఞానిక సంస్థ(ఐఐఎస్​)కు చెందిన శాస్త్రవేత్తలు మహా అద్భుతాన్ని సృష్టించారు. చంద్రుడిపై ఇళ్ల నిర్మాణ కలకు జీవం పోస్తూ.. ప్రత్యేక అంతరిక్ష ఇటుకలను బెంగళూరులోని పరిశోధనా కేంద్రంలో రూపొందించారు.

జాబిల్లి వనరులతోనే..

భారత్​ సత్తా: జాబిల్లిపై ఇళ్ల నిర్మాణానికి అంతరిక్ష ఇటుకలు

జాబిల్లిపై ఉన్న వనరులతోనే నిర్మాణం జరగాలని ఏడేళ్ల క్రితమే భావించారు ఐఐఎస్ మెకానికల్ ఇంజినీరింగ్​ విభాగం అసిస్టెంట్​ ప్రొఫెసర్ అలోక్​ కుమార్​​. తన బృందంతో కలిసి ఆయన ఆలోచనకు పదును పెట్టారు. చంద్రుడి ఉపరితలంపై లభించే మట్టిన కృత్రిమంగా సృష్టించి దానితో ఇటుకలు తయారు చేశారు.

ఈ పద్ధతిని వినియోగించి చంద్రుడిపై ఓ ల్యాబ్​లో ఇటుకలు తయారు చేసి నిర్మాణాలు చేసుకోవచ్చు. ఇందుకోసం భూమి నుంచి అతి తక్కువ పరికరాలు తీసుకెళితే సరిపోతుందంటున్నారు అలోక్​.

"కొన్ని రకాల బ్యాక్టీరియా, రసాయనాలను ఉపయోగించి చంద్రుడి మట్టితో ఇటుకలు తయారు చేశాం. విద్యుత్​.. బ్యాక్టీరియా, నీళ్లు.. తీసుకెళ్తే చాలు. ఈ ఇటుకలను అతికించేందుకు సిమెంట్​ అవసరమే లేదు. కేవలం బ్యాక్టీరియాల్లో సహజంగా ఏర్పడే పాలిమర్, గ్వార్ గమ్‌ ద్రవాలను వినియోగించుకుని వాటిని అతికించేయోచ్చు. కాకపోతే వాటికి సరిపడా ఆహారం తీసుకెళ్లాలి."
-అలోక్ కుమార్​, అసిస్టెంట్​ ప్రొఫెసర్.​

అలోక్​ ఆలోచనతో.. చంద్రుడిపై వీధులు నిర్మించేందుకు భారత్​ తొలి అడుగు వేసినట్లేనని అభిప్రాయపడుతున్నారు శాస్త్రవేత్తలు.

ఇదీ చదవండి:ట్రాఫిక్​ నిబంధనలు పాటించలేదని ఏనుగు అరెస్టు!

చంద్రుడిపై ఇళ్లు నిర్మించాలని ప్రపంచ దేశాలు యోచిస్తున్నాయి. అయితే.. భూమిపై ఉపయోగించే నిర్మాణ పరికరాలు అంతరిక్షంలోకి తీసుకెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. మరి చందమామపై వ్యోమగాములు ఇళ్లు ఎలా చేస్తారన్నదే పెద్ద సవాలు. కానీ ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపించి.. మరోసారి ప్రపంచ దేశాలకు తన సత్తాను చాటిచెప్పింది భారత్​.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో), భారత వైజ్ఞానిక సంస్థ(ఐఐఎస్​)కు చెందిన శాస్త్రవేత్తలు మహా అద్భుతాన్ని సృష్టించారు. చంద్రుడిపై ఇళ్ల నిర్మాణ కలకు జీవం పోస్తూ.. ప్రత్యేక అంతరిక్ష ఇటుకలను బెంగళూరులోని పరిశోధనా కేంద్రంలో రూపొందించారు.

జాబిల్లి వనరులతోనే..

భారత్​ సత్తా: జాబిల్లిపై ఇళ్ల నిర్మాణానికి అంతరిక్ష ఇటుకలు

జాబిల్లిపై ఉన్న వనరులతోనే నిర్మాణం జరగాలని ఏడేళ్ల క్రితమే భావించారు ఐఐఎస్ మెకానికల్ ఇంజినీరింగ్​ విభాగం అసిస్టెంట్​ ప్రొఫెసర్ అలోక్​ కుమార్​​. తన బృందంతో కలిసి ఆయన ఆలోచనకు పదును పెట్టారు. చంద్రుడి ఉపరితలంపై లభించే మట్టిన కృత్రిమంగా సృష్టించి దానితో ఇటుకలు తయారు చేశారు.

ఈ పద్ధతిని వినియోగించి చంద్రుడిపై ఓ ల్యాబ్​లో ఇటుకలు తయారు చేసి నిర్మాణాలు చేసుకోవచ్చు. ఇందుకోసం భూమి నుంచి అతి తక్కువ పరికరాలు తీసుకెళితే సరిపోతుందంటున్నారు అలోక్​.

"కొన్ని రకాల బ్యాక్టీరియా, రసాయనాలను ఉపయోగించి చంద్రుడి మట్టితో ఇటుకలు తయారు చేశాం. విద్యుత్​.. బ్యాక్టీరియా, నీళ్లు.. తీసుకెళ్తే చాలు. ఈ ఇటుకలను అతికించేందుకు సిమెంట్​ అవసరమే లేదు. కేవలం బ్యాక్టీరియాల్లో సహజంగా ఏర్పడే పాలిమర్, గ్వార్ గమ్‌ ద్రవాలను వినియోగించుకుని వాటిని అతికించేయోచ్చు. కాకపోతే వాటికి సరిపడా ఆహారం తీసుకెళ్లాలి."
-అలోక్ కుమార్​, అసిస్టెంట్​ ప్రొఫెసర్.​

అలోక్​ ఆలోచనతో.. చంద్రుడిపై వీధులు నిర్మించేందుకు భారత్​ తొలి అడుగు వేసినట్లేనని అభిప్రాయపడుతున్నారు శాస్త్రవేత్తలు.

ఇదీ చదవండి:ట్రాఫిక్​ నిబంధనలు పాటించలేదని ఏనుగు అరెస్టు!

ZCZC
PRI NAT NRG
.JAMMU NRG17
JK-POPPY
J-K: Two truck drivers held, 200 kg poppy seized
          Jammu, Feb 4 (PTI) Two truck drivers were arrested and 200 kg of poppy was seized from their possession in separate incidents here on Tuesday, police said.
          A police party intercepted a truck, which was on its way to Punjab from Kashmir, at the Jakhani area and seized six bags containing 100 kg of poppy, they said.
          Driver Mangal Singh of Punjab was arrested and a case registered in this connection, police said.
          Another police team intercepted a Punjab-bound truck at Roun Domail and seized 100 kg of poppy during its checking, they said.
          Driver Anoop Singh was arrested and a case registered against him, police said. PTI AB
AQS
AQS
02041937
NNNN
Last Updated : Feb 29, 2020, 5:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.